IT Internships: మళ్లీ ఇంటర్న్షిప్ల జోరు!
ఐటీ కంపెనీలు ఏడాది తర్వాత మళ్లీ ఇంటర్న్షిష్ల జోరు పెంచాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మందగమనంతో సంవత్సర కాలంగా ఇంటర్న్షిప్లను తగ్గించిన కంపెనీలు మళ్లీ ప్రతిభావంతులైన విద్యార్థులకు ద్వారాలు తెరిచాయి.
ఐటీ కంపెనీలు పిలుస్తున్నాయ్..
కోడింగ్ నైపుణ్యాలకు పెద్దపీట
వచ్చే మూడేళ్లలో బీటెక్ పూర్తిచేసే వాళ్లకు అవకాశం
అమ్మాయిలకే కొన్ని ప్రత్యేకం..
ఇంటర్న్షిప్ తర్వాత కొలువుల్లోకి..!
ఈనాడు, హైదరాబాద్: ఐటీ కంపెనీలు ఏడాది తర్వాత మళ్లీ ఇంటర్న్షిష్ల జోరు పెంచాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మందగమనంతో సంవత్సర కాలంగా ఇంటర్న్షిప్లను తగ్గించిన కంపెనీలు మళ్లీ ప్రతిభావంతులైన విద్యార్థులకు ద్వారాలు తెరిచాయి. 3 నుంచి 6 నెలల వరకు ఇంటర్న్షిప్లకు అవకాశం కల్పించేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించాయి. ప్రధానంగా ఈసారి కోడింగ్ నైపుణ్యాలకే పెద్దపీట వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 2023, 2024 సంవత్సరాల్లో పాసైన విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కాదు.. ఇంటర్న్షిప్ అవకాశాలూ భారీగా తగ్గాయి. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ సందడి కూడా తగ్గిపోయింది. ఫలితంగా గత ఏడాదిన్నరగా బీటెక్ పూర్తయిన చాలామంది విద్యార్థులకు కొలువులు దక్కలేదు. దీనివల్ల కూడా రెండు మూడేళ్లుగా పెద్దసంఖ్యలో విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ కంపెనీలు ఇంటర్న్షిప్ అవకాశాలు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుండటం విశేషం.
- ప్రస్తుతం బీటెక్ చదువుతున్న (రెండు, మూడు, నాలుగు సంవత్సరాల) విద్యార్థులకు ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తున్నాయి. ఎంపికైన వారికి పలు కంపెనీలు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు స్టైపెండ్ కూడా అందజేస్తున్నాయి. ఇందుకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆప్టిట్యూడ్, కోడింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి.
- ఎక్కువగా ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు 70-80 శాతం ఇంటర్న్షిప్లు కల్పిస్తున్నాయి. విద్యార్థులు బీటెక్ మొదటి సెమిస్టర్లో ఆప్టిట్యూడ్, సీ, డీఎస్లు.. రెండో సెమిస్టర్లో కోడింగ్ విత్ జావా లేదా పైథాన్ లేదా సీ++ నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మూడో సెమిస్టర్లో డీఎస్ఏ కోడింగ్పై పట్టు సాధించాలని, అప్పుడే టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్లను దక్కించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్న్షిప్లతో విద్యార్థి దశలోనే ఉద్యోగానుభవం దక్కించుకునే వీలుంటుంది.
- అట్లాసియన్, అమెజాన్ వావ్, అడోబ్ కంపెనీలు కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నాయి. కోడింగ్ కాంపిటీషన్ ప్లస్ హ్యాకథాన్ పేరిట వారికి పోటీలు నిర్వహించి నగదు బహుమతిని అందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గోల్డ్మ్యాన్ శాక్స్, రూబ్రిక్ ఇంక్, జీఈ (కేవలం సీఎస్ఈ, ఐటీ బ్రాంచి విద్యార్థులకు), మోర్గాన్ స్టాన్లీ, డైరెక్ట్ ఐ, సేల్స్ ఫోర్స్ తదితర కంపెనీలు అర్హులైన విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాయి. అధిక కంపెనీలు 3-6 నెలలపాటు ఇంటర్న్షిప్ అందిస్తుండగా.. కొన్ని కంపెనీలు బీటెక్ చివరి సంవత్సరం మొత్తం ఆఫర్ చేస్తున్నాయి.
కోడింగ్పై దృష్టి పెడితేనే..!
ఎక్కువ జీతాలను ప్రొడక్ట్ కంపెనీలు మాత్రమే ఇస్తాయి. అందుకే అవి అత్యంత ప్రతిభావంతులను కోరుకుంటున్నాయి. డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ (డీఎస్ఏ) కోడింగ్ నైపుణ్యాలు ఉన్నవారిని ఎంపిక చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. అందుకోసం బీటెక్ రెండో సంవత్సరం నుంచే అభ్యర్థులను అన్వేషిస్తున్నాయి. ఇంతవరకు మేం వెర్బల్, రీజనింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా పెంపొందించేందుకు సమయం వెచ్చించాం. తాజాగా డీఎస్ఏ కోడింగ్పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. విద్యార్థులకు ఆన్లైన్తోపాటు, క్లాస్రూమ్ శిక్షణ ఇస్తున్నాం. బీటెక్లో చేరిన విద్యార్థులు తొలి ఏడాది నుంచే కోడింగ్పై దృష్టి పెడితేనే రెండో సంవత్సరంలో ఇంటర్న్షిప్నకు ఎంపికయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ఎంపికైన వారంతా అవే కంపెనీల్లో శాశ్వత కొలువు దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వెంకట్ కాంచనపల్లి, సీఈఓ, సన్టెక్ కార్ఫ్ ప్లేస్మెంట్ శిక్షణ సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు