IT Internships: మళ్లీ ఇంటర్న్షిప్ల జోరు!
ఐటీ కంపెనీలు ఏడాది తర్వాత మళ్లీ ఇంటర్న్షిష్ల జోరు పెంచాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మందగమనంతో సంవత్సర కాలంగా ఇంటర్న్షిప్లను తగ్గించిన కంపెనీలు మళ్లీ ప్రతిభావంతులైన విద్యార్థులకు ద్వారాలు తెరిచాయి.
ఐటీ కంపెనీలు పిలుస్తున్నాయ్..
కోడింగ్ నైపుణ్యాలకు పెద్దపీట
వచ్చే మూడేళ్లలో బీటెక్ పూర్తిచేసే వాళ్లకు అవకాశం
అమ్మాయిలకే కొన్ని ప్రత్యేకం..
ఇంటర్న్షిప్ తర్వాత కొలువుల్లోకి..!
ఈనాడు, హైదరాబాద్: ఐటీ కంపెనీలు ఏడాది తర్వాత మళ్లీ ఇంటర్న్షిష్ల జోరు పెంచాయి. అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక మందగమనంతో సంవత్సర కాలంగా ఇంటర్న్షిప్లను తగ్గించిన కంపెనీలు మళ్లీ ప్రతిభావంతులైన విద్యార్థులకు ద్వారాలు తెరిచాయి. 3 నుంచి 6 నెలల వరకు ఇంటర్న్షిప్లకు అవకాశం కల్పించేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించాయి. ప్రధానంగా ఈసారి కోడింగ్ నైపుణ్యాలకే పెద్దపీట వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 2023, 2024 సంవత్సరాల్లో పాసైన విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కాదు.. ఇంటర్న్షిప్ అవకాశాలూ భారీగా తగ్గాయి. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ సందడి కూడా తగ్గిపోయింది. ఫలితంగా గత ఏడాదిన్నరగా బీటెక్ పూర్తయిన చాలామంది విద్యార్థులకు కొలువులు దక్కలేదు. దీనివల్ల కూడా రెండు మూడేళ్లుగా పెద్దసంఖ్యలో విద్యార్థులు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ కంపెనీలు ఇంటర్న్షిప్ అవకాశాలు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుండటం విశేషం.
- ప్రస్తుతం బీటెక్ చదువుతున్న (రెండు, మూడు, నాలుగు సంవత్సరాల) విద్యార్థులకు ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తున్నాయి. ఎంపికైన వారికి పలు కంపెనీలు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు స్టైపెండ్ కూడా అందజేస్తున్నాయి. ఇందుకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆప్టిట్యూడ్, కోడింగ్ నైపుణ్యాలను పరీక్షిస్తున్నాయి.
- ఎక్కువగా ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు 70-80 శాతం ఇంటర్న్షిప్లు కల్పిస్తున్నాయి. విద్యార్థులు బీటెక్ మొదటి సెమిస్టర్లో ఆప్టిట్యూడ్, సీ, డీఎస్లు.. రెండో సెమిస్టర్లో కోడింగ్ విత్ జావా లేదా పైథాన్ లేదా సీ++ నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మూడో సెమిస్టర్లో డీఎస్ఏ కోడింగ్పై పట్టు సాధించాలని, అప్పుడే టాప్ కంపెనీల్లో ఇంటర్న్షిప్లను దక్కించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్న్షిప్లతో విద్యార్థి దశలోనే ఉద్యోగానుభవం దక్కించుకునే వీలుంటుంది.
- అట్లాసియన్, అమెజాన్ వావ్, అడోబ్ కంపెనీలు కేవలం అమ్మాయిలకు మాత్రమే ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నాయి. కోడింగ్ కాంపిటీషన్ ప్లస్ హ్యాకథాన్ పేరిట వారికి పోటీలు నిర్వహించి నగదు బహుమతిని అందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గోల్డ్మ్యాన్ శాక్స్, రూబ్రిక్ ఇంక్, జీఈ (కేవలం సీఎస్ఈ, ఐటీ బ్రాంచి విద్యార్థులకు), మోర్గాన్ స్టాన్లీ, డైరెక్ట్ ఐ, సేల్స్ ఫోర్స్ తదితర కంపెనీలు అర్హులైన విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాయి. అధిక కంపెనీలు 3-6 నెలలపాటు ఇంటర్న్షిప్ అందిస్తుండగా.. కొన్ని కంపెనీలు బీటెక్ చివరి సంవత్సరం మొత్తం ఆఫర్ చేస్తున్నాయి.
కోడింగ్పై దృష్టి పెడితేనే..!
ఎక్కువ జీతాలను ప్రొడక్ట్ కంపెనీలు మాత్రమే ఇస్తాయి. అందుకే అవి అత్యంత ప్రతిభావంతులను కోరుకుంటున్నాయి. డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ (డీఎస్ఏ) కోడింగ్ నైపుణ్యాలు ఉన్నవారిని ఎంపిక చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. అందుకోసం బీటెక్ రెండో సంవత్సరం నుంచే అభ్యర్థులను అన్వేషిస్తున్నాయి. ఇంతవరకు మేం వెర్బల్, రీజనింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా పెంపొందించేందుకు సమయం వెచ్చించాం. తాజాగా డీఎస్ఏ కోడింగ్పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. విద్యార్థులకు ఆన్లైన్తోపాటు, క్లాస్రూమ్ శిక్షణ ఇస్తున్నాం. బీటెక్లో చేరిన విద్యార్థులు తొలి ఏడాది నుంచే కోడింగ్పై దృష్టి పెడితేనే రెండో సంవత్సరంలో ఇంటర్న్షిప్నకు ఎంపికయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ఎంపికైన వారంతా అవే కంపెనీల్లో శాశ్వత కొలువు దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వెంకట్ కాంచనపల్లి, సీఈఓ, సన్టెక్ కార్ఫ్ ప్లేస్మెంట్ శిక్షణ సంస్థ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబరు ఆఖరివారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం గురువారం సెలవు దినంగా ప్రకటించింది. -
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు చేసే గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) సవరించిన కాలపట్టికను వెల్లడించింది. -
TS Elections: పట్నం బద్ధకించింది.. పల్లె ఓటెత్తింది
రాష్ట్రంలో రానున్న అయిదేళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు పల్లె ఓటర్లు బారులు తీరగా.. పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. -
Chandrababu: తిరుపతిలో బాబుకు జన నీరాజనం
తెదేపా అధినేత చంద్రబాబుకు తిరుపతిలో ప్రజలు నీరాజనాలు పలికారు. బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. -
స్వల్ప ఘర్షణలు.. లాఠీఛార్జి
రాష్ట్రంలో గురువారం శాసనసభ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు.. స్వల్ప ఘర్షణలు.. అక్కడక్కడా లాఠీఛార్జి మినహా ప్రశాంతంగా ముగిశాయి. -
సాగర్ ప్రాజెక్టు వద్ద ఘర్షణ
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఏపీ పోలీసులు భారీగా ప్రాజెక్టు వద్దకు చేరుకొని రక్షణ గేట్లు విరగ్గొట్టి తమపై దాడి చేశారని తెలంగాణ పోలీసులు ఆరోపించారు. -
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జరిగిన లాంగ్ మారథాన్లో ఎన్నో మలుపుల మధ్య పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. -
వరవరరావు రెండో కంటి చికిత్సకు కోర్టు అనుమతి
ఎల్గార్ పరిషద్ - మావోయిస్టు సంబంధాల కేసు(2018)లో నిందితుడిగా ఉన్న వామపక్ష భావజాల కార్యకర్త వరవరరావు ఎడమ కంటికి కేటరాక్టు చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లేందుకు ముంబయిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. -
మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానం
దేశంలో మాంసం లభ్యతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రాథమిక పశుపోషణ గణాంకాల(బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్) వార్షిక నివేదిక-2023 వెల్లడించింది. -
లాసెట్ తొలి విడతలో 5,912 మందికి సీట్లు
లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను గురువారం కేటాయించారు. మూడేళ్లు, అయిదేళ్ల ఎల్ఎల్బీతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లు మొత్తం 6,894 అందుబాటులో ఉన్నాయి. -
మేం నిరాధార ఆరోపణలు చేయలేదు!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. -
ఇదీ సంగతి!
-
ఉచిత ఇసుక కేసులో.. చంద్రబాబు బెయిల్పై విచారణ 6కు వాయిదా
గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ డిసెంబరు 6కు వాయిదా పడింది. -
12 వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దు
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో దాఖలు పిటిషన్పై విచారణ డిసెంబరు 12కు వాయిదా పడింది. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. -
ఉపకరించిన ఓటరు సమాచార కేంద్రాలు
ఓటరు స్లిప్పులు అందని ఓటర్లకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమాచార కేంద్రాలు ఉపకరించాయి. రెండు.. అంతకుమించి కేంద్రాలు ఉన్న చోట వాటిని ఏర్పాటు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Ravichandran Ashwin: నేనెప్పటికీ విరాట్ కోహ్లీ కాలేను: అశ్విన్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Malavika Mohanan: డబ్బింగ్ అంటే నాకు భయం..: మాళవికా మోహనన్
-
Flair Writing Listing: ఫ్లెయిర్ రైటింగ్ లిస్టింగ్ అదుర్స్.. ఒక్కో లాట్పై రూ.12,800 లాభం
-
Nithyananda: కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే మంత్రి పదవి ఊడగొట్టిన నిత్యానంద
-
Cyclone Michaung: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు