టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష 21న

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ(టీఎస్‌ఆర్‌జేసీ) పరిధిలోని 35 గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 21న పరీక్షను నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్‌ రమణకుమార్‌ తెలిపారు.

Published : 16 Apr 2024 03:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ(టీఎస్‌ఆర్‌జేసీ) పరిధిలోని 35 గురుకుల కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 21న పరీక్షను నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్‌ రమణకుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష కోసం 73,527 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని