KCR: ఉద్యమ స్ఫూర్తితో దళితబంధు
ఉద్యమ స్ఫూర్తితో దళితబంధును అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే బడ్జెట్లో దీనికి రూ.20 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పథకం అమలవుతుందన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడంలేదన్నారు.
వచ్చే బడ్జెట్లో రూ.20 వేల కోట్లు
మార్చినాటికి ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ప్రయోజనం
బీసీ కుల గణనపై తీర్మానం
ఎస్సీ రిజర్వేషన్లనూ పెంచాలి
మళ్లీ మేమే గెలుస్తాం
కొత్తగా 80 వేల ఉద్యోగాలు
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఉద్యమ స్ఫూర్తితో దళితబంధును అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వచ్చే బడ్జెట్లో దీనికి రూ.20 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పథకం అమలవుతుందన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడంలేదన్నారు. దీని ద్వారా లబ్ధిపొందే కుటుంబాలకు ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు అన్నీ యథావిధిగా అమలవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దేశంలో బీసీ కుల గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపుతుందని ప్రకటించారు. దళితుల జనాభా పెరిగిన నేపథ్యంలో వారికి రిజర్వేషన్లను పెంచాలని అన్నారు. దళితబంధు పథకం నాలుగు దశల్లో అమలు కానుండగా రూ.1.8 లక్షల కోట్లను వ్యయం చేయనున్నటు వివరించారు. ప్రతి జిల్లాలో నాలుగువేల కోట్ల రూపాయలతో కలెక్టర్ల వద్ద దళిత రక్షణనిధి ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశలో హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఎంపిక చేసిన 4 మండలాల్లో వందశాతం దళిత కుటుంబాలకు పథకం అమలవుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ప్రయోజనం అందుతుందన్నారు. ఆ వందమందిని ఎంపికచేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. శాసనసభలో మంగళవారం దళితబంధుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘హుజూరాబాద్ ఎన్నిక కోసం ఈ పథకం రాలేదు. 1986 నుంచీ దళిత అభ్యున్నతిపై దృష్టి సారించా. గత ఏడాదే అమలుకావాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. దళితుల అభ్యున్నతికి అమలు చేస్తున్న ఈపథకం రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది. అన్ని ఎస్సీ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.
భవిష్యత్తులో కేంద్రంలో తెరాస కీలకం కావచ్చు
అధికారం కోసం కొందరు కలలు కంటున్నారు. కానీ వచ్చేసారి కూడా మేమే గెలుస్తాం. మేలు చేసే వాళ్లను ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. మేమేమి మఠం నడపడంలేదు. భవిష్యత్తులో కేంద్రంలో తెరాస కీలకం కావచ్చు. ప్రతి అంశాన్నీ ఓట్ల కోణంలో చూడటం సరికాదు. హుజూరాబాద్ ఎన్నిక తర్వాత దళితబంధు ఖాతాల్లోని డబ్బును వెనక్కి తీసుకుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వచ్చే ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇందులో దళితబంధు కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. 11.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. దేశ జీడీపీకి అత్యధికంగా దోహదపడుతున్న 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవన్నీ కాగ్, ఆర్బీఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం
రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి సాధ్యమని పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనేక కుట్రలు జరిగాయి. రెండు రాష్ట్రాలు కలసిపోతాయని కూడా ప్రచారం చేశారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను, సీలేరు ప్రాజెక్టును తీసేసుకున్నారు. గిరిజనులు, బీసీలు,మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయరంగం స్థిరీకరణకు రైతుబంధును అన్ని వర్గాలకు అమలు చేశాం. రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వరిధాన్యం పండుతుండటమే దీనికి నిదర్శనం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
17.53 శాతం మంది దళితులు
రాష్ట్రంలో దళితులు 15 శాతం మాత్రమే అనేది సరికాదు. జనాభాలో 17.53 శాతం ఉన్నారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 25.46 శాతం ఉండగా తక్కువగా హైదరాబాద్ జిల్లాలో 11.77శాతం మంది ఉన్నారు. అనేక జిల్లాల్లో 20 శాతానికిపైగా ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 1,03,93,967 కోట్ల కుటుంబాలు ఉండగా ఇందులో 18,22,291 దళిత కుటుంబాలున్నాయి. ఆరేడేళ్లలో ఈ కుటుంబాల సంఖ్య పెరిగి ఉంటుంది.
భాజపా ఎస్సీ వర్గీకరణ చేయిస్తే స్వాగతిస్తాం
ఎస్సీ వర్గీకరణపై శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే కాకుండా 25 ఉత్తరాలు రాశాం. ప్రధానికి స్వయంగా వివరించాం. భాజపా సభ్యులు వర్గీకరణను చేయిస్తే ఎయిర్పోర్టుకు వెళ్లి వారికి స్వాగతం చెబుతాం. బీసీ కులగణనను కేంద్రం ఎందుకు నిరాకరిస్తోంది? కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును ఇస్తే దళితబంధు మరింత బాగా అమలు చేయవచ్చు’’ అని కేసీఆర్ అన్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్
ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుందని పార్టీలనుద్దేశించి వికారాబాద్ ఎమ్మెల్యే (తెరాస) మెతుకు ఆనంద్ వ్యాఖ్యానించారు. ‘దళిత బంధు’ హుజూరాబాద్ ఎన్నికల కోసమేనని, లేకుంటే అక్కడే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని.., ఒకరికి భాగ్యలక్ష్మి ఆలయం, మరొకరికి చేవెళ్ల అయితే.. కేసీఆర్కు కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ అని పేర్కొన్నారు. మీరుపెట్టే సభలు, సమావేశాలు, ప్రజాసంగ్రామ యాత్రలు కూడా ఓట్ల కోసమేనా? అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోసం కాదని నిరూపితమైంది
ఏ ఎన్నికలున్నాయని కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని తెచ్చారు? పథకాలు ఎన్నికల కోసం కాదని ఎప్పుడో రుజువైందని తుంగతుర్తి ఎమ్మెల్యే(తెరాస) గాదరి కిశోర్కుమార్ చెప్పారు. పేదముస్లింలకు ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే బలాల కోరారు.
ఇప్పటికే 1.51 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు
జిల్లాల పునర్వ్యవస్థీకరణ, నూతన జిల్లాల ఏర్పాటు, కొత్త జోనల్ విధానంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. తాజా జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ విధానంలో ఉద్యోగులను కేటాయిస్తాం. అనంతరం ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. కొత్తగా 70 వేల నుంచి 80 వేల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో 1.51 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోగా 1.31 లక్షల మంది ఉద్యోగాల్లో చేరారు.
వచ్చిన పని... నచ్చిన చోట
ఈ ఏడాది బడ్జెట్లో దళిత సాధికారతకు రూ.1,000 కోట్లను కేటాయించాం. సుమారు రూ.2,500 కోట్లను వ్యయం చేస్తాం. దళితబంధుకు రూ.10 లక్షల మొత్తాన్ని శాస్త్రీయంగా నిర్ణయించాం. వందశాతం గ్రాంట్ రూపంలో ఇస్తున్నాం. యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి ఆంక్షలూ లేవు. లబ్ధిదారుల ఇష్టమే. ఈ పథకం కింద వచ్చిన పని నచ్చిన చోట చేసుకోవచ్చు. ఎస్సీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత ఉంది. పథకాలకు ప్రత్యేకంగా అవసరంలేదు. దళితబంధు పొందని కుటుంబాలకు దళిత రక్షణ నిధి ద్వారా తోడ్పాటును అందించడంపై దృష్టిసారిస్తాం. ప్రభుత్వం లైసెన్స్లు ఇచ్చే అన్నింటిలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇందులో భాగంగానే వారికి 250 నుంచి 300 మద్యం దుకాణాలు దక్కనున్నాయి. రాష్ట్రంలో 75 లక్షల మంది దళితులు ఉంటే వారి చేతిలో 13 లక్షల ఎకరాలే ఉంది. గిరిజనులకంటే తక్కువ భూమి ఎస్సీలకు ఉంది. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పలేదు. అయినా 16 వేల ఎకరాలను ఇచ్చాం. వైద్య ఆరోగ్యశాఖలో ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
ప్రైవేటులో రుసుములపై త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
ప్రాణాలు తీసిన పెద్దపులిని పట్టేశారు
మహారాష్ట్రలోని బల్లార్ష-కార్వా అటవీ ప్రాంతంలో నాలుగు నెలల కాలంలో నలుగురు వ్యక్తుల ప్రాణాలు తీసిన టి-86 అనే పెద్దపులిని ఎట్టకేలకు అటవీ అధికారులు సోమవారం రాత్రి పట్టుకుని చంద్రపూర్కు తరలించారు. -
రచయితలపై దాడుల విషయంలో ప్రభుత్వం మౌనం సరికాదు
కాకతీయ యూనివర్సిటీలో సమూహ కవులు, రచయితలపై ఏబీవీపీ జరిపిన భౌతిక దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండడం అరాచక శక్తులకు ఆజ్యం పోస్తోందని తెలంగాణ నిర్బంధ వ్యతిరేక వేదిక మండిపడింది.
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)