CM KCR: ఉపేక్షించం
తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రం అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, ఇది రాష్ట్ర కర్షకులకు, దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సేకరణ జరిగేలా... తక్షణమే సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం ప్రకటించాలని డిమాండు చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి
డిమాండ్ల సాధనకు సభలో, బయటా ఆందోళనలు
కేంద్రానిది అసంబద్ధ, ద్వంద్వ వైఖరి...
సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం ప్రకటించాలి
పార్లమెంటు వేదికగా కేంద్రం తీరును ఎండగడదాం
ప్రాజెక్టులు, నిధుల కోసం ఒత్తిడి తేవాలి
తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ నుంచి వరి ధాన్యాన్ని తీసుకునే విషయంలో కేంద్రం అసంబద్ధ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని, ఇది రాష్ట్ర కర్షకులకు, దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సేకరణ జరిగేలా... తక్షణమే సమగ్ర జాతీయ ధాన్యసేకరణ విధానం ప్రకటించాలని డిమాండు చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, దీనిపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణ పట్ల సానుకూలంగా లేదని, ఏడేళ్లుగా ఓపిక పట్టామని, ఇక ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి తీవ్ర ఒత్తిడి తేవాలని, తెలంగాణ వాణిని పార్లమెంటులో గట్టిగా వినిపించాలని... సభ బయటా నిరసనలు తెలపాలని స్పష్టం చేశారు. సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం ప్రగతిభవన్లో కేసీఆర్తో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. దీనికి తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, వ్యవసాయ, రోడ్లుభవనాల శాఖల మంత్రులు నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎంపీలు లక్ష్మీకాంతరావు, కె.ఆర్.సురేశ్రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, బీబీపాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, గడ్డం రంజిత్రెడ్డి, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ సోమేశ్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రగతిభవన్లో ఆదివారం జరిగిన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న తెరాస
అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో, మంత్రి నిరంజన్ రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు
అన్నింటా అన్యాయమే
‘ఏడేళ్లుగా తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదు. విభజన హామీలను పూర్తిగా విస్మరించింది. ధాన్యం సేకరణపై కేంద్రం తీరు దారుణంగా ఉంది. రైతుల గురించి ఆలోచించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను పెడచెవిన పెట్టింది. ఈ వానాకాలంలో వరిధాన్యం సాగు విస్తీర్ణం విషయంలో పూటకోమాట మాట్లాడుతూ కిరికిరి పెడుతోంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించాల్సి ఉండగా... 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని(40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని) మాత్రమే సేకరిస్తామని కేంద్రం మళ్లీ పాతపాటే పాడుతోంది. రాష్ట్ర రైతుల సమస్యనే అత్యంత ప్రాధాన్యాంశంగా పార్లమెంటులో లేవనెత్తాలి. కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టం రద్దు కోసం పోరాడాలి. నదీజలాల్లో రాష్ట్ర వాటా ఖరారు కోసం పట్టుబట్టాలి. కేంద్రం వైఖరి ఎలా ఉన్నా తెలంగాణలో రైతులకు యథావిధిగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం’ అని తెలిపారు.
పాల్గొన్న ఎంపీలు
కేంద్రం వైఖరిపై సమావేశం అసంతృప్తి
ధాన్యం దిగుబడిలో అనతి కాలంలో మన కర్షకులు.. దేశ రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్న క్రమంలో, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి తెలంగాణ వ్యవసాయ రంగానికి అశనిపాతంగా మారిందని పార్లమెంటరీ పార్టీ సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని, కేంద్ర ప్రభుత్వ అధికారులను కలసి విజ్ఞప్తి చేసినా ఎటూ తేల్చడం లేదని పేర్కొంది. వార్షిక ధాన్యసేకరణ క్యాలండర్ను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ చక్కటి సూచన చేసినా కేంద్రం స్పందించడం లేదని, అయోమయం, అస్పష్టతతో గందరగోళం సృష్టిస్తోందని, దీనిపై పోరాడాలని నిర్ణయించింది.
ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
అంతకుముందు ప్రగతిభవన్లో ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎంకు మంత్రి నిరంజన్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తారా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటారా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
-
చైనాలో కుంగిన రోడ్డు.. 19మంది మృతి
-
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత