Ponguleti: భారాస పాలనలో చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో కరవు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భారాస పదేళ్ల పాలనలో చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పాలనపై బురదచల్లే ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతాంగంపై కపట ప్రేమ చూపుతూ.. రెచ్చగొట్టే ధోరణికి దిగుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాల్లో పర్యటించిన ఆయన.. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

Published : 08 Apr 2024 19:27 IST

భారాస పదేళ్ల పాలనలో చేసిన తప్పిదాల వల్లే తెలంగాణలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పాలనపై బురదచల్లే ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతాంగంపై కపట ప్రేమ చూపుతూ.. రెచ్చగొట్టే ధోరణికి దిగుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాల్లో పర్యటించిన ఆయన.. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.

Tags :

మరిన్ని