బ్రేకింగ్

breaking
03 Oct 2022 | 18:28 IST

క్లాస్‌ రూమ్‌లో‌ ఆత్మాహుతి దాడి.. 53మంది మృతి

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో వరుస పేలుళ్ల ఘటనలు అక్కడివారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో తాజాగా మరో పేలుడు సంభవించింది. తరగతి గదిలో చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందినవారిలో 46 మంది మహిళలు, బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం కాబుల్‌లోని విద్యా కేంద్రంలో జరిగిన పేలుడులో 100కుపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

మరిన్ని

తాజా వార్తలు