గ్రామ దేవతలు
భారత దేశంలో గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా వస్తోంది. మాతృ దేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూల కారకురాలు మాతృ దేవత అని గ్రహించిన పురాతన మానవులు ఆమెను సంతృప్తి పరచేటందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించారు. వాటిలో ప్రార్థన, మంత్ర తంత్రాలు, పవిత్రీకరణ, ఆత్మ హింస, బలి ముఖ్యమైనవి. గ్రామదేవతలను ఊరి పొలిమేరల్లోనే నిలిపేవారు.
భారత దేశంలో గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా వస్తోంది. మాతృ దేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూల కారకురాలు మాతృ దేవత అని గ్రహించిన పురాతన మానవులు ఆమెను సంతృప్తి పరచేటందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించారు. వాటిలో ప్రార్థన, మంత్ర తంత్రాలు, పవిత్రీకరణ, ఆత్మ హింస, బలి ముఖ్యమైనవి. గ్రామదేవతలను ఊరి పొలిమేరల్లోనే నిలిపేవారు. ఈ దేవతలను పంచభూతాలకు ప్రతీకలుగా కొందరు పేర్కొన్నారు. పృథివి అంటే భూమి. పంటకు ఆధారం. కుంకుళ్లు బాగా పండే ప్రాంతంలో ప్రతిష్ఠించిన గ్రామ దేవతను కుంకుళ్లమ్మ అని, గోగులు పూచే ప్రాంతంలో గోగులమ్మ అని, జొన్నలు పండే చోట జొన్నాలమ్మ అని, వరి బాగా పండే ప్రాంతంలో నూకాలమ్మ అని గ్రామ దేవతలను వ్యవహరిస్తుంటారు.బతుకునిచ్చే తల్లి బతుకమ్మ. అన్నం పెట్టే అమ్మ అన్నమ్మ. జలానికి సంబంధించి గంగమ్మ, గంగాలమ్మ పేర్లతో గ్రామదేవతలు వెలశారు. తేజస్సునిచ్చే సూర్యుడికి ప్రతీకగా సూరమ్మ, రాత్రి పూట వెలుగునిచ్చే చంద్రుడికి సంకేతంగా పున్నమ్మ గ్రామ దేవతలయ్యారు. గ్రామ దేవతకు కుడి కన్ను సూర్యుడిగాను, ఎడమ కన్ను చంద్రుడిగాను భావించి, ఇద్దరి కళలు ఉన్న అమ్మను ‘ఇరుకళమ్మ’ అన్నారు. కొండ ప్రాంతంలో గాలి తీవ్రత ఎక్కువ. కరువలి అంటే పెద్ద గాలి. ఆ గాలినుంచి రక్షించేందుకు కొండ ప్రాంతాల్లో ‘కరువలమ్మ’ను ఏర్పాటు చేసుకున్నారు. కొండమ్మ అకాశ దైవానికి ప్రతీక. కొండ ఆకాశం పైన ఉంటుందిగనుక మెరుపులు, పిడుగులు, గాలి వాన నుంచి రక్షణకు ఈ దేవతను కొలుస్తారు. పొలిమేర గ్రామ దేవత పొలిమేరమ్మ. ఆమె జన వ్యవహారంలో పోలేరమ్మ అయ్యింది. భక్తుల తలపుల్ని తీర్చే తల్లి తలుపులమ్మ. ఈ గ్రామ దేవత ఆలయం తుని ప్రాంతంలో ఉంది.
సరిహద్దులను ఎల్లలంటారు. గ్రామ సరిహద్దుల్లో కాపలా కాసే దేవత ఎల్లమ్మ. విశాఖపట్నంలో ఒక ప్రాంతంలో ఎల్లమ్మ గ్రామ దేవత. జీవన భృతి కలిగించి, పోషించే దేవత పోచమ్మ. బ్రోచు అంటే రక్షించు అని అర్థం. పాము పుట్టలుండే ప్రాంతాల్లో వెలసిన దేవతలు పుట్టమ్మ, సుబ్బమ్మ, పాపమ్మలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు కలిపి ఒక గ్రామ దేవత ఉంటుంది. మావూళ్లన్నింటికీ దేవత అనే అర్థంలో భీమవరంలో మావూళ్లమ్మ వెలసింది. శివుడి గళం మీద మచ్చ(అంకం) కారణంగా అంకగళమ్మ అంకాలమ్మగా మారిందని చెబుతారు. మనిషికి జీవిత కాలానికి ఉండే అవధిని ‘కట్ట’ అంటారు. ఆ కట్టను మేయగల అంటే ఆ అవధి నుంచి రక్షించగల దేవత ‘కట్టమైసమ్మ’. ప్రజలు స్వచ్ఛంగా భావించే తల్లి సత్తెమ్మ. స్వచ్ఛమైన తల్లి జన వ్యవహారంలో అచ్చెమ్మ అయ్యింది. దేవతలను విశాల నేత్రాలు కలవారిగా భావించడం సంప్రదాయం. ఫుల్ల అంటే వికసించిన అని అర్థం. ఈ ఉద్దేశంలో పుల్లమ్మ వెలసింది. నైవేద్యం సమర్పించడాన్ని అర్పణ అంటారు. అర్పణమ్మ అప్పలమ్మ అయింది. అమ్మవార్ల ఊరేగింపులో అతి చిన్న విగ్రహం, బాలాత్రిపుర సుందరి విగ్రహానికి సమ ఉజ్జి పెంటి(బాల) పెంటమ్మ అయింది. భోజనానికి వికృత రూపమైన బోనం అందించే తల్లి బోనాలమ్మ. లలితా దేవి భండాసుర సంహారానికి గుర్రం మీద వెళ్ళిందనే భావనతో గుర్రాలమ్మ వెలసింది. కాకతీయుల కాలంలో ఏకవీర, రేణుక గ్రామ దేవతలుగా ప్రసిద్ధికెక్కారు.
గ్రామ దేవతలు చిన్న రాయిగానో, చెట్టు రూపంలోనో దర్శనం ఇవ్వడం ఉంది. శిష్టాచారం ప్రకారం పూజించే దేవతల్ని ఆర్య దేవతలు లేక వైదిక దేవతలు అంటారు. గ్రామ దేవతలను ద్రావిడ దేవతలుగాను కొందరు పరిగణిస్తున్నారు.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!