ధర్మాగ్రహం
‘కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పైకి విశ్వామిత్రుడిలా కనబడతారు... లోపల వారు వసిష్ఠ మహర్షి... బహిర్గాధేయుడు అంతర్ వసిష్ఠుడు’ అన్నారు మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి....
‘కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పైకి విశ్వామిత్రుడిలా కనబడతారు... లోపల వారు వసిష్ఠ మహర్షి... బహిర్గాధేయుడు అంతర్ వసిష్ఠుడు’ అన్నారు మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి. ఇది మామూలు మాట కాదు- విశ్వనాథ వ్యక్తిత్వాన్ని, ఆయన మనస్తత్వాన్ని ఆచి తూచి, తూచి చూసి తూకంగా చెప్పిన మాట. విశ్వామిత్రుడికి కోపం ఆయన స్వభావంలోనే ఉంది. వసిష్ఠుడికి మాత్రం పిలిచినప్పుడే వచ్చేది. ఇది రామాయణం చెబుతున్న మాట. పైకి ఎంతో అసహనంగా, ధుమధుమలాడుతూ కనిపించే విశ్వనాథ- లోలోపల పరమ శాంతమూర్తి... అనేది మధునాపంతుల అభిప్రాయం. విశ్వనాథను సన్నిహితంగా ఎరిగిన వారందరికీ తెలిసిందే ఇది.
విశ్వనాథలోనే కాదు, ప్రతి మనిషిలోనూ ఈ స్వభావాలు రెండూ ఉంటాయి. పైకి కోపిష్టులుగా కనిపించే పరమ శాంతమూర్తుల వల్ల లోకానికి ఏ రకమైన అపకారమూ జరగదు. గుండెలో నిండుగా ప్రశాంతత గూడు కట్టిన శాంతస్వభావులు చాలా సందర్భాల్లో వాస్తవానికి కోపాన్ని నటిస్తారు. అవసరమైన సందర్భాల్లో కావాలని కోపం తెచ్చుకొంటారు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడు ధర్మరాజు అలిగిన నాడు ఏం జరుగుతుందో కృష్ణుడు వివరించాడు. పరమ శాంత స్వభావి సీతమ్మ కావాలని ఆగ్రహాన్ని ఆవాహన చేసుకొంటే, అంత గొప్ప దశకంఠ రావణుడు ఆమె ముందు గడ్డిపోచ అయిపోయాడని వాల్మీకి వర్ణించారు. అలాంటివారికి కోపం రానీయకుండా మనం చూసుకోవాలని అర్థం. రామాయణం తొలి శ్లోకాల్లో ‘రాముడు జితక్రోధుడు’ అన్నారు వాల్మీకి. అంటే కోపాన్ని జయించినవాడు అని అర్థం. రాక్షస సంహార వేళ మాత్రం రాముడికి కోపం అవసరమయ్యేది. అప్పుడు ‘క్రోధ మాహారయామాస...’ పనిగట్టుకుని కోపాన్ని పిలిచేవాడట.
మనిషి ఉండవలసిన తీరు అదే. వాల్మీకి రామాయణం మనిషికి నేర్పుతున్నది అదే. లోపల, బయట విశ్వామిత్రుడి మాదిరిగానో... దుర్వాసుడి తరహాలోనో అనుక్షణం కోపంతో కుతకుతలాడిపోయే మనుషుల వల్ల అటు వారికి, ఇటు సమాజానికి తీరని అపకారం జరుగుతుంది. అలాగే, లోపల అంతులేని కుళ్ళును, అమితమైన కోపాన్ని దాచిపెట్టుకొని మరీ- పైకి పరమ శాంతస్వభావులుగా నటించేవారివల్లా మానవ సమాజానికి ఎంతో హాని జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులనే ‘తేనెపూసిన కత్తులు’ అన్నారు మన పెద్దలు. స్వభావరీత్యా దుర్మార్గులై ఉండి, వారు పైకి మాత్రం మంచితనం ప్రదర్శిస్తారు... అతి వినయం చూపిస్తారు... అది ధూర్తుల లక్షణం. దానికి ‘నక్క వినయం’ అని పేరు. వాళ్లు సమాజానికి ప్రమాదకారులు.
ఇదికాక ‘ధర్మాగ్రహం’ అనేది మరో తరహా కోపం. మగపక్షిని నిషాదుడు బాణంతో కొట్టి చంపాడు. ఆడపక్షి దయనీయంగా రోదిస్తోంది. ఈ దృశ్యం చూసిన వాల్మీకి మహర్షికి కోపం పిలవకుండానే వచ్చేసింది. ‘అధర్మోయం’ అని ఆయన గట్టిగా అరిచాడట. అదీ ధర్మాగ్రహం అంటే! మహర్షి కోపం లోంచే శ్రీమద్రామాయణ సార భూతం, సర్వలౌకిక ఛందస్సులకూ ఆధారభూతం అయిన ‘మానిషాద...’ శ్లోకం ఆవిర్భవించింది. ధర్మానికి హాని కలిగినప్పుడు సజ్జనుల గుండెల్లోంచి ఉప్పొంగేది ధర్మాగ్రహ జ్వాల. అది అధర్మాన్ని శిక్షిస్తుంది.
- ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..