కృషి-విశ్వాసం
దైవాన్ని ముక్తికో లేక దర్శన భాగ్యానికో పూజించేవారే భక్తులు కారు. కార్యార్థులూ భక్తులే. ఇహపరాలు ఆయన అధీనమని భక్తులు నమ్ముతారు. దైవంపై నమ్మకంతో గట్టి ప్రయత్నం చేస్తే కార్యం సఫలమవుతుందని వారి విశ్వాసం. కృషి, విశ్వాసం రెండూ ఉండాలన్నమాట.
దైవాన్ని ముక్తికో లేక దర్శన భాగ్యానికో పూజించేవారే భక్తులు కారు. కార్యార్థులూ భక్తులే. ఇహపరాలు ఆయన అధీనమని భక్తులు నమ్ముతారు. దైవంపై నమ్మకంతో గట్టి ప్రయత్నం చేస్తే కార్యం సఫలమవుతుందని వారి విశ్వాసం. కృషి, విశ్వాసం రెండూ ఉండాలన్నమాట. దైవానుగ్రహం అనేది పక్కన పెట్టి, వాస్తవ దృక్పథం చూస్తే మనిషి చేసే కార్యాలన్నీ కృషితోనే నెరవేరుతున్నాయి. దైవానుగ్రహం అనేది ఒక విశ్వాసం. ఇది అవసరమా అన్నది ప్రశ్న. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తి మనకు తెలిసిందే. కృషితోనే ఏదైనా సాధించగలమని చెప్పే ఈ సూక్తి మనిషికి కొండంత ఆత్మబలాన్నిస్తుంది. తన కృషితోనే ఎదిగాననే భావన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తే మంచిదే. కాని, దాని వెనక అహం బలంగా ఉంటుంది. ఇది మోతాదు మించితే సమస్య మొదలవుతుంది.
కృషితో ఎదిగినవారున్నారు. అంతకుమించి కృషి చేసినా ఓడినవారెందరో ఉన్నారు. గెలుపునకు కృషి అత్యావశ్యకమైనా పరిస్థితులు అనుకూలించాలి. ఇదే దైవానుగ్రహం. పరిస్థితులు అన్నివేళలా సానుకూలంగా ఉంటాయనుకోవడం అవివేకం. వాటిని దాటగలమని అనుకోవడం అంతకన్నా అవివేకం. ఎంతో శ్రమించి సాధించినా అది దైవకృపేనని భావించకపోతే మనిషి జీవితం పరాజయమవుతుంది. గెలుపునుంచి పుట్టే అహం ఎన్నో అనర్థాలకు మూలం. ఎవరినీ లక్ష్య పెట్టకపోవడం, మాట తూలడం, ఎవరు చెప్పినా వినకపోవడం, తాను అనుకున్నదే సరైనదని భావించడం, వ్యతిరేక భావాలను సహించ లేకపోవడం, చిన్న పొరపాటుకే తీవ్రంగా స్పందించడం... ఇలా ఎన్నో దుర్గుణాలను అహం తెచ్చి పెడుతుంది. వాదనలో తనదే పైచేయి కావాలనుకోవడం, తెలియని మొండి తనం, పంతాలు పట్టింపులకు అహం ముడిపదార్థం. బంధు మిత్రులు, సహోదరులు, సహోద్యోగులు, జీవిత భాగస్వామి మనసులో కొంచెమైనా మంచి స్థానం పొందలేనప్పుడు మనిషి ఏది సాధించినా ఎంత సంపాదించినా ఏమీ ప్రయోజనం ఉండదు.
తనను తాను నియంత్రించుకోలేని వ్యక్తి ప్రపంచ నియంత అయినా నిష్ప్రయోజకమే. ఏదో ఒక రోజు అన్నీ కోల్పోతాడు. అహాన్ని ఆదిలోనే తుంచాలంటే గెలుపును దైవకృపగా భావించాలంటారు పెద్దలు. దైవానుగ్రహంతో తన కృషి ఫలించింది అంటే సరిపోదు. అనుకున్నా సరిపోదు. దృఢంగా విశ్వసించాలి. అహానికి విరుగుడు దైవభావనని గుర్తించి, మన పెద్దలు బాల్యం నుంచే దీన్ని అలవరచేవారు. తరగతిలోకి వెళ్ళేముందు, బడిపిల్లలందరిచేతా గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి శ్లోకాలను గతంలో ప్రార్ధన చేయించేవారు. ధార్మిక వాతావరణంలో పిల్లలను పెంచేవారు. పసి మనసులు పసిడి మనసులు. అవి ఎంతో విలువైనవి. సద్భావనలు అనే విత్తనాలు లేత మనసులో నాటాలి. నీరు ఎండి బీటలువేసిన నేలలో విత్తనాలు మొలకెత్తవు. అలాగే కొత్త సంస్కారాలు ఎదిగిన మనసులో పుట్టవు. ఎదిగిన బుద్ధి తర్కాన్ని ఇష్టపడుతుంది. అశక్తుడే దైవాన్ని పట్టుకుంటాడు అనే మాటలు ప్రభావితం చేస్తాయి. భక్తిరహితమైన తార్కికభావాలు నాస్తికుణ్ని చేస్తాయి. తార్కిక భావాలు భక్తికి తోడైతే జ్ఞానం పుడుతుంది. పెరిగే జాజితీగను కర్రకు జోడించి, అది పాకే దిశను నిర్దేశిస్తారు. అలాగే దైవమనే కర్రను కృషికి జతచేస్తే మనిషి సవ్యంగా ఎదుగుతాడు, అహం అదుపులో ఉంటుంది. దైవభావన నుంచి మొదట పుట్టేది పాపభీతి. ఇది నిష్ఠ, నియమం, నీతి, నిబద్ధత, నియంత్రణ అనే అయిదు ఆణిముత్యాలను మనిషికి ఆభరణంగా ఇస్తుంది.
పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?