అన్నదాతల మహాపాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు
అన్నం పెట్టే అన్నదాతకు భోజనం చేసేందుకు స్థలం దొరకలేదు. అమరావతి రాజధాని కోసం వేల ఎకరాల భూములిచ్చిన వారికి నిలువనీడ కరవైంది. మహిళల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకున్న బయో టాయిలెట్లను రోడ్డుపై నిలిపేందుకు కూడా అనుమతివ్వలేదు
సర్వేపల్లి నియోజకవర్గంలో వంటకు, వసతికి అమరావతి రైతుల ఇబ్బందులు
నెల్లూరు గ్రామీణ మండలం పాలిచర్లపాడు అడ్డరోడ్డు సమీపంలోని ఎస్ఎల్వీ ఎస్టేట్ వద్ద పొదలకూరు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు
ఈనాడు డిజిటల్ - నెల్లూరు: న్యూస్టుడే - పొదలకూరు: అన్నం పెట్టే అన్నదాతకు భోజనం చేసేందుకు స్థలం దొరకలేదు. అమరావతి రాజధాని కోసం వేల ఎకరాల భూములిచ్చిన వారికి నిలువనీడ కరవైంది. మహిళల అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకున్న బయో టాయిలెట్లను రోడ్డుపై నిలిపేందుకు కూడా అనుమతివ్వలేదు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు బుధవారం నెల్లూరు జిల్లాలో ఎదురైన అడ్డంకులివి. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
భోజనం చేసేందుకు కూడా స్థలమివ్వకుండా తమపై కక్షసాధిస్తున్నారంటూ కన్నీరు పెడుతున్న అమరావతి మహిళా రైతు
స్థలాలిచ్చే వారికి బెదిరింపులు
సర్వేపల్లి నియోజకవర్గంలో అమరావతి రైతులకు ఉండేందుకు, వండుకునేందుకు స్థలం ఇచ్చిన వారిని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని ఐకాస సభ్యులు ఆరోపించారు. పొదలకూరు సమీపంలోని వేబ్రిడ్జి దగ్గర బుధవారం భోజన ఏర్పాట్లు చేసేందుకు ఐకాస సభ్యులు తొలుత నిర్ణయించారు. ముందు సమ్మతించిన కాటా నిర్వాహకులు తెల్లారేసరికి మాట మార్చారు. దీంతో ఓ రైతు నివాస స్థలంలో ఏర్పాట్లు చేశారు. అక్కడ చోటు చాలకపోవడంతో చాటగొట్ల దగ్గర రోడ్డుపైనే కూర్చొని భోజనం చేశారు. వాహనాల దుమ్ము, మురుగు దుర్వాసన మధ్యనే అర్ధాకలితో భోజనం ముగించారు. తింటున్నంతసేపు మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర 31వ రోజు ఉద్రిక్తతలు, భావోద్వేగాల మధ్య సాగింది. ఉదయం పారిచెర్లపాడు సమీంలోని ఎస్ఎల్వీ వెంచర్స్ దగ్గర పాదయాత్రకు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆహ్వానం పలికిన తర్వాత.. వాహనాలు రోడ్డుపైకి వచ్చే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. యాత్రలో క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలకు న్యాయస్థానం అనుమతి లేదంటూ నిలిపివేశారు. ఆగ్రహించిన గురైన రైతులు, ముస్లిం, క్రైస్తవ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మద్దతు తెలిపే వారిని అడ్డుకోమని కోర్టు చెప్పలేదనీ, మతాచారాలను కించపరిచేలా పోలీసులు వ్యవహరించడం తగదనీ మండిపడ్డారు. అమరావతి రాజధాని అందరిదీ అంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 16వ నంబరు జాతీయ రహదారిపై వరద నీరు పారుతుండటంతో.. భారీ వాహనాలన్నింటినీ పొదలకూరు-నెల్లూరు రహదారి మీదుగా మళ్లించారు. అదే మార్గంలో రైతులు బైఠాయించి నిరసన తెలపడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో రైతులు ఆందోళన విరమించి పాదయాత్ర కొనసాగించారు.
పాదయాత్ర ముగిసిన తర్వాత రాత్రి బసకు చోటు దొరక్క కంకరపై కూర్చున్న మహిళా రైతులు
టాయిలెట్లు తీసేయమని చెప్పలేదు
పాదయాత్రలో మహిళల కోసం ఏర్పాటు చేసిన బయో టాయిలెట్లను తీసేయాలని తాము చెప్పలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీసు అధికారి వివరించారు. జాతీయ రహదారిపై అడ్డంకుల దృష్ట్యా పొదలకూరు రోడ్డులో ట్రాఫిక్ పెరిగిందన్నారు. వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డుపై నిలిపిన వాహనాలను ముందుకు పోనివ్వాలని మాత్రమే చెప్పామన్నారు.
రాత్రి బసకూ అవస్థలు
బుధవారం ఉదయం నెల్లూరు జిల్లా మరుపూరు నుంచి ప్రారంభమైన యాత్ర.. సుమారు 12 కి.మీ. సాగి, మర్రిపల్లి వద్ద ముగిసింది. మరుపూరు నుంచి తోడేరు, పొదలకూరు మీదుగా సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆత్మకూరు, చేజర్ల మండలాల నుంచి పెద్దఎత్తున రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. మరుపూరు దగ్గర బస చేసేందుకు స్థలం దొరక్కపోవడం, మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయోటాయిలెట్లను పోలీసులు తీసేయించడంతో వారు అవస్థలు పడ్డారు. దీంతోవారు అమరావతి రైతులు మళ్లీ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం అంబాపురంలో నాలుగు రోజులుగా బస చేస్తున్న శాలివాహన ఫంక్షన్హాల్కే అమరావతి రైతులు చేరుకున్నారు. 400 కి.మీ.కు పైగా పాదయాత్ర చేస్తున్న అమరావతి ఆడపడుచులు అన్నం తినేందుకు చోటు దక్కకపోవడం దారుణమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్ర ప్రారంభం నుంచి లేని అభ్యంతరాలు ఒక్క సర్వేపల్లిలో నియోజకవర్గంలోనే వచ్చాయా? అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్