ట్రాన్స్జెండర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం
రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? వారికి కల్పిస్తున్న ప్రయోజనాలేంటి? ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోతే ఎంతమేర రిజర్వేషన్ కల్పించాలనే విషయాలపై
వారి సమస్యలపై అధ్యయనం చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఎస్సై నోటిఫికేషన్ రద్దు చేయాలన్న ట్రాన్స్జెండర్ పిటిషన్ కొట్టివేత
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లు ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? వారికి కల్పిస్తున్న ప్రయోజనాలేంటి? ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేకపోతే ఎంతమేర రిజర్వేషన్ కల్పించాలనే విషయాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేని స్పష్టం చేసింది. మూడు నెలల్లో ఉత్తర్వులు అమలు చేయాలని తేల్చిచెప్పింది. ‘రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లు కొద్ది సంఖ్యలోనే ఉన్నప్పటికీ ఉద్యోగాల భర్తీలో వారికి నైష్పత్తిక ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగ దరఖాస్తులో సైతం లింగ గుర్తింపును పేర్కొనేందుకు ప్రత్యేక స్థలం కేటాయించడం లేదు. ఇది ప్రభుత్వ అనాలోచిత చర్య మాత్రమే కాదు.. ఉద్యోగ అవకాశాల్లో స్త్రీ పురుషులతో సమానంగా ట్రాన్స్జెండర్లు అవకాశాలు పొందే హక్కును నిరాకరించడమూ అవుతుంది. ట్రాన్స్జెండర్లలో ఎక్కువ మంది భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారు. ప్రభుత్వాలు వారి సమస్యలను పట్టించుకోవడం లేదు’ అని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు.
ఇదీ నేపథ్యం
2018 నవంబర్ 1న ఎస్సై ఉద్యోగ ప్రకటనలో తమకు రిజర్వేషన్ కల్పించలేదంటూ ట్రాన్స్జెండర్ ఎం.గంగాభవాని 2019లో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది సాల్మన్రాజు వాదనలు వినిపిస్తూ.. ఈ ఉద్యోగ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్నారు. పిటిషనర్ పురుషుడిగా పుట్టి, లింగమార్పిడి శస్త్రచికిత్సతో ట్రాన్స్జెండర్గా మారారన్నారు. ఎస్సై ఉద్యోగానికి దరఖాస్తులో ట్రాన్స్జెండర్ ఐచ్ఛికం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్త్రీగా పేర్కొంటూ దరఖాస్తు చేశారన్నారు. ప్రాథమిక రాతపరీక్ష రాశారన్నారు. బీసీగా రెండు పేపర్లలో 35 శాతం మార్కులు పొందారన్నారు. అయితే అధికారులు తర్వాత ప్రక్రియకు పిటిషనర్ అనర్హులని ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించామని చెప్పారు. పోలీసు నియామక బోర్డు తరఫున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ పుట్టుకతో పురుషుడని, తర్వాత ట్రాన్స్జెండర్గా మారారన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ కోరలేరన్నారు. వివిధ కేటగిరి కింద పేర్కొన్న ప్రకారం పిటిషనర్ మార్కులు పొందలేదన్నారు. ట్రాన్స్జెండర్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధమన్నారు.
పిటిషన్ కొట్టివేత
వాదనలు విన్న హైకోర్టు.. ట్రాన్స్జెండర్లను సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వర్గంగా పేర్కొంటూ, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తుచేసింది. అయితే ఇంత శాతం రిజర్వేషన్ సృష్టించాలని నిర్దిష్టంగా చెప్పలేదని పేర్కొంది. అయితే వారికి రిజర్వేషన్ సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రాన్స్జెండర్లకు ఎస్సై నియామకాల్లో రిజర్వేషన్ కల్పించడంలో విఫలమైనందున అధికారులకు కోర్టుధిక్కరణ వర్తిస్తుందని తెలిపింది. కేవలం ఈ కారణంగానే ఆ నోటిఫికేషన్ చెల్లుబాటుకాదని ప్రకటించలేమంటూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ