Ukraine Crisis: తరలింపునకు మరిన్ని మార్గాలు
ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు వీలుగా సరిహద్దుల వద్ద మరిన్ని మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు పొరుగు దేశాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు రాయబార కార్యాలయం ఆదివారం పేర్కొంది.
ఆ దిశగా ఉక్రెయిన్ పొరుగు దేశాలతో చర్చిస్తున్నాం
తూర్పు ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు వీలైతే పశ్చిమ ప్రాంతాలకు వెళ్లాలి
అడ్వైజరీ జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
దిల్లీ: ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు వీలుగా సరిహద్దుల వద్ద మరిన్ని మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు పొరుగు దేశాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు రాయబార కార్యాలయం ఆదివారం పేర్కొంది. తూర్పు ఉక్రెయిన్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, భారతీయుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చిస్తున్నామని తెలిపింది. పరిస్థితులు కాస్త సజావుగా ఉన్నట్లు అనిపిస్తే ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న తూర్పు ప్రాంతాల నుంచి రైళ్ల ద్వారా పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ‘‘మీరున్న చోట కర్ఫ్యూ ఎత్తివేసినప్పుడు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల రాకపోకలు స్వేచ్ఛగా ఉన్నప్పుడు, దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లకు వెళ్లి పశ్చిమ ప్రాంతాలకు చేరుకోండి. రైల్వే మార్గాలు సురక్షితమైనవి. సాధారణ రైళ్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటితోపాటు ప్రజల తరలింపు కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వాటికి టికెట్లు అవసరం లేదు. అవసరమైనవాటినే బ్యాగులో తీసుకెళ్లండి. రాత్రిపూట మన్నికైన స్వెటర్లను ధరించండి. వీలైనంత ఎక్కువ నగదు, అవసరమైన ఔషధాలు దగ్గర ఉంచుకోండి’’ అని ఎంబసీ సూచించింది. ప్రయాణాలకు అనువైన పరిస్థితులు లేనిచోట, లేదా వేరే కారణాలతో బయటకు రాలేకపోతే పరిస్థితులు చక్కబడేవరకూ వేచి చూడాలని, సమూహాలుగా ఉంటూ పరస్పసరం అనుసంధానమై ఉండాలని సూచించింది.
పోలండ్లోకి వెళ్తున్న భారతీయులకు అడ్డంకులు
వార్సా: ఉక్రెయిన్ నుంచి పోలండ్లోకి వెళ్లడానికి యత్నిస్తున్న భారతీయులకు సరిహద్దులవద్ద చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం భారత రాయబార కార్యాలయం రొమేనియా, హంగరీల ద్వారా మాత్రమే భారతీయులను తరలిస్తోంది. ఇది తెలియని కొందరు ఆదివారం సరిహద్దులోని మెడికా ద్వారా పోలండ్లోకి ప్రవేశించడానికి యత్నించారు. అయితే అక్కడి అధికారులు వారిని అడ్డుకుని రొమేనియా సరిహద్దుకు వెళ్లాలని చెప్పారని పోలండ్లోని రుచిర్ కటారియా అనే వాలంటీర్ తెలిపారు. అప్పటికే సుదూర ప్రాంతాల నుంచి కాలి నడకన అక్కడికి వచ్చినవారు తిరిగి వందల కి.మీ. దూరంలో ఉన్న రొమేనియా సరిహద్దుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎలాగోలా పోలండ్లో ప్రవేశించిన భారతీయులను అక్కడి శిబిరాల్లో ఉండేందుకు అధికారులు అనుమతించడం లేదని, వాటిని ఉక్రెయిన్ జాతీయుల కోసమే ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారని పేర్కొన్నారు.
రష్యా సైనిక చర్య నేపథ్యంలో స్వదేశానికి వచ్చేందుకు ఉక్రెయిన్ నుంచి పోలండ్కు చేరుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఎలాంటి వీసా లేకుండానే ప్రవేశానికి అనుమతిస్తున్నామని భారత్లోని పోలండ్ రాయబారి ఆడమ్ పురాకోవిస్కీ ట్విటర్లో తెలిపారు.
ఒక్కో విమానానికి రూ.1.10 కోట్ల వ్యయం
ముంబయి: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను సరిహద్దు దేశాల నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వానికి భారీగానే ఖర్చవుతున్నట్లు సమాచారం. భారతీయుల తరలింపు ప్రక్రియ కోసం ఎయిర్ ఇండియా ‘బోయింగ్ 787’ విమానాలను వినియోగిస్తోంది. ఈ విమానాలకు 250కిపైగా సీట్ల సామర్థ్యం ఉంటుంది. ఈ రకం విమాన ప్రయాణానికి గంటకు రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకూ ఖర్చవుతుందని ఓ విమాన సంస్థ ఉద్యోగి తెలిపారు. ఒక్కో విమానం గమ్యస్థానాలైన రొమేనియాలోని బుకారెస్ట్, హంగరీలోని బుడాపెస్ట్లకు వెళ్లి తిరిగిరావడానికి రూ.1.10 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ప్రయాణ దూరం, సమయం, ఇంధనం, సిబ్బంది సంఖ్య, ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందన్నారు.
స్వదేశానికి చేరుకున్న మరో 688 మంది
దిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడానికి వెళ్లిన మూడు ఎయిర్ ఇండియా విమానాలు ఆదివారం దిల్లీ చేరుకున్నాయి. వీటి ద్వారా మొత్తం 688 మంది స్వదేశంలో అడుగుపెట్టారు. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఆదివారం 250 మందితో వచ్చిన విమానం ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెల్లవారుజామున 2.45 గంటలకు దిగింది. హంగరి రాజధాని బుడాపెస్ట్ నుంచి 240 మందితో వచ్చిన విమానం ఉదయం 9.20కి ల్యాండ్ అయింది. బుకారెస్ట్ నుంచి 198 మందితో బయల్దేరిన మరో విమానం సాయంత్రం 5.35కు చేరుకుంది. బుకారెస్ట్ నుంచి తొలి విమానంలో వచ్చినవారికి పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమానాశ్రయంలో గులాబీలతో స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా శనివారం ముంబయి చేరుకున్న తొలి విమానంలో 219 మంది ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం నాలుగు విమానాల్లో 907 మంది స్వదేశానికి చేరుకున్నట్లయింది. ఎయిర్ ఇండియా మరో రెండు విమానాలను పంపుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి సుమారు 2 వేల మంది భారతీయులను తరలించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రుంగ్లా చెప్పారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఇండిగో సంస్థ రెండు విమానాలను నడపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సోమ, మంగళవారాల్లో ఇవి దిల్లీ నుంచి ఇస్తాంబుల్ మీదుగా బుడాపెస్ట్కు వెళ్తాయని పేర్కొన్నాయి. అదే మార్గంలో తిరిగొస్తాయని తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్