రామాయంపేట మాజీ ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌ వాసురెడ్డి కన్నుమూత

మెదక్‌ జిల్లా రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసురెడ్డి (ఆర్‌ఎస్‌ వాసురెడ్డి) (75) గురువారం కన్నుమూశారు.

Updated : 22 Sep 2023 05:33 IST

చేగుంట, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసురెడ్డి (ఆర్‌ఎస్‌ వాసురెడ్డి) (75) గురువారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్వగ్రామం చేగుంట మండలం పొలంపల్లిలో ఉంటున్నారు. 1985లో రామాయంపేట నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1989 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తెరాస (భారాస) ఆవిర్భావం తర్వాత అందులో చేరారు. కొన్నేళ్లు ఆ పార్టీలోనే ఉండి, అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ భాజపాలో చేరి మరణించేవరకు అందులోనే కొనసాగారు. 1985 ఎన్నికల్లో రూ.30 వేలు ఖర్చు చేసి విజయం సాధించానని ఆయన చెప్పేవారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ బస్సులోనే హైదరాబాద్‌కు వెళ్లి వచ్చేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని