Chandramohan: అస్తమించిన నట చంద్రుడు
తరాలు మారుతుంటాయి.. కథలు, సినిమాలు మారిపోతుంటాయి. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులొస్తుంటాయి. ఎన్ని మారినా సరే... భిన్న రకాల పాత్రలతో ప్రతి తరానికీ చేరువగా మెలిగిన ఓ అరుదైన నటుడు చంద్రమోహన్.
సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
రేపు హైదరాబాద్లో అంత్యక్రియలు
ఈనాడు, హైదరాబాద్, ఫిలింనగర్, న్యూస్టుడే
తరాలు మారుతుంటాయి.. కథలు, సినిమాలు మారిపోతుంటాయి. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులొస్తుంటాయి. ఎన్ని మారినా సరే... భిన్న రకాల పాత్రలతో ప్రతి తరానికీ చేరువగా మెలిగిన ఓ అరుదైన నటుడు చంద్రమోహన్. కథానాయకుడు... రెండో కథానాయకుడు... ప్రతినాయకుడు... హాస్యనటుడు... సహనటుడు...
..ఇలా పాత్ర ఏదైనా సరే.. పాదరసంలా అందులో ఇమిడిపోయి ప్రేక్షకులకి వినోదం పంచిన ఆల్రౌండర్ ఆయన. ఐదున్నర దశాబ్దాలు నటప్రయాణం కొనసాగించి... ఎన్నో విలక్షణ పాత్రల్లో ఒదిగిపోయిన చంద్రమోహన్ (80) ఇకలేరు. కొంతకాలంగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9.45కి కన్నుమూశారు. ‘ఉదయం కిడ్నీ సమస్య తలెత్తింది. ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. ఆస్పత్రిలో చేర్చాక.. మాతో మాట్లాడారు. అంతలోనే ఒక్కసారిగా గుండెనొప్పి రావడంతో కన్నుమూశారు’. అని చంద్రమోహన్ మేనల్లుడు, సినీ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు. ఆయనకి భార్య జలంధర, కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి ఉన్నారు. జలంధర రచయితగా తెలుగువారికి సుపరిచితం. కుమార్తెలిద్దరూ వైద్యులుగా స్థిరపడ్డారు. అమెరికాలో ఉన్న కుమార్తె మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లో చంద్రమోహన్ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాల్ని నిర్వహిస్తామని కృష్ణప్రసాద్ తెలిపారు.
‘రంగుల రాట్నం’తో పరిచయం
1943 మే 23న కృష్ణాజిల్లా, పమిడిముక్కలలో వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకి జన్మించిన ఏడో సంతానం చంద్రమోహన్. ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ చేశారు. డిగ్రీ పూర్తి కాగానే ఏలూరులో వ్యవసాయ విస్తరణాధికారిగా ఉద్యోగం పొందారు. 1966లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ‘రంగులరాట్నం’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంతోనే నంది పురస్కారాన్ని అందుకున్నారు. సుదీర్ఘమైన నట ప్రయాణంలో ఆయన నాలుగు భాషల్లో 932 సినిమాలు చేశారు. అందులో 175 సినిమాల్లో కథానాయకుడిగా చేశారు. కథానాయకుడిగానే కాకుండా.. హాస్యనటుడిగా, సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా భిన్న రకాల పాత్రల్ని పోషించారు. ‘సుఖదుఃఖాలు’, ‘సిరిసిరిమువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’, ‘రాధాకళ్యాణం’, ‘మూడు ముళ్లు’, ‘కలికాలం’, ‘సగటు మనిషి’, ‘ఆదిత్య 369’... ఇలా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకిగానూ ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. చివరిగా ఆయన 2017లో ‘ఆక్సిజన్’ సినిమాలో నటించారు. ఆయనకి సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బంధువులు. బాపు, కె.విశ్వనాథ్, బాలచందర్ తదితర అగ్రదర్శకులతో కలిసి చంద్రమోహన్ పనిచేశారు.
హీరోయిన్ల లక్కీ హీరో..
చంద్రమోహన్ పక్కన నటిస్తే చాలు... ఆ కథానాయిక స్టార్ హీరోయిన్గా వెలుగుతారనే సెంటిమెంట్ అప్పట్లో ఉండేది. వాణిశ్రీ, జయసుధ, శ్రీదేవి, జయప్రద, రేఖ తదితర ప్రముఖులు చంద్రమోహన్ సరసన నటించి తార స్థాయికి చేరారు. సహజనటనకి పెట్టింది పేరు చంద్రమోహన్. ఆయన కెరీర్లో డీ గ్లామర్ పాత్రలకీ తనదైన నటనతో జీవం పోశారు. తెరపైన పాత్రలే తప్ప తాను కనిపించాలని కోరుకోని నటుడు చంద్రమోహన్. ఆయన ఇక లేరని తెలియగానే చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ సంతాపం
ఈనాడు, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, తొలితరం వెండి తెర కథానాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం సంతాపం తెలిపారు. ఆయన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిందని ప్రధాని అన్నారు. చంద్రమోహన్ మరణం సినీ ప్రపంచంలో శూన్యతను మిగిల్చిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లమంది ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం, తెలుగు చిత్రసీమకు తీరని లోటని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో ఎందరో నటీనటులు ఉన్నత స్థాయికి ఎదిగారని, కళామతల్లి ముద్దుబిడ్డగా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారని సీఎం తెలిపారు. ఇంకా మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్రెడ్డి సంతాపం తెలిపారు. సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి బాధాకరమని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ‘ఎక్స్’ ద్వారా విచారం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాల వారికీ చేరువయ్యారని. ఆయన ఆత్మకు శాంతి కలగాలని జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సినీ ప్రముఖులు బ్రహ్మానందం, ఆర్.నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్, పరుచూరి వెంకటేశ్వరరావు చంద్రమోహన్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్