Venkaiah Naidu-KVP: వెంకయ్యనాయుడికి కేవీపీ ఆతిథ్యం

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావును మంగళవారం కృష్ణా జిల్లా అంపాపురంలో కలిశారు.

Updated : 17 Jan 2024 07:51 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావును మంగళవారం కృష్ణా జిల్లా అంపాపురంలో కలిశారు. కేవీపీ ఆహ్వానం మేరకు వెంకయ్యనాయుడు సతీ సమేతంగా వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. వెంకయ్యనాయుడు, ఉషమ్మ దంపతులకు కేవీపీ, సునీతమ్మ దంపతులు స్వాగతం పలికారు. కాసేపు మాటామంతీ అనంతరం కలిసి భోజనం చేశారు. మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌, సినీ నిర్మాత కేఎల్‌ నారాయణ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని