గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు.
పుదుచ్చేరి ఎల్జీ పదవికి కూడా
రాష్ట్రపతికి సమర్పణ
అద్భుత రాష్ట్రానికి సేవ చేయడం ఆనందాన్నిచ్చింది..
తెలంగాణ ప్రజలకు భావోద్వేగ లేఖ
ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నానని వెల్లడి
ఈనాడు, హైదరాబాద్, చెన్నై(ఆర్కేనగర్), న్యూస్టుడే: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. ఆమె 2019 సెప్టెంబరు 1న తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. 2021 ఫిబ్రవరి 16న పుదుచ్చేరి ఇన్ఛార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు చేపట్టారు.
పోటీ చేసే అవకాశం
తమిళిసై తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తన పదవికి ఆమె రాజీనామా సమర్పించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి రాజ్భవన్లో బస చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాజీనామా అంశాన్ని ఆమె ప్రస్తావించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఒకవైపు జగిత్యాలలో భాజపా బహిరంగ సభలో పాల్గొనడానికి ప్రధాని బయలుదేరి వెళ్లగానే.. తమిళిసై రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై లేదా పుదుచ్చేరి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.తెలంగాణ గవర్నర్గా పనిచేసిన నాలుగున్నరేళ్లలో ప్రజా సమస్యలపై ఆమె చురుగ్గా స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించడం, తిరస్కరించడంలో తనదైన ముద్రను చాటారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. గతేడాది వరంగల్ను వరదలు ముంచెత్తిన సందర్భంగా గవర్నర్ హోదాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. రెడ్క్రాస్ సంస్థ సహకారంతో బాధితులకు సాయం అందించారు. గత భారాస ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య చోటుచేసుకున్న పలు వివాదాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. 2023 డిసెంబరులో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో తమిళిసై స్నేహపూర్వకంగా కొనసాగుతూ వచ్చారు.
చిరస్థాయిగా తెలంగాణపై ప్రేమ..
తెలంగాణ ప్రజల పట్ల తన ప్రేమ చిరస్థాయిగా ఉంటుందని, అద్భుతమైన ప్రయాణంలో చిరస్మరణీయ జ్ఞాపకాలతో నిండిన హృదయంతో తాను రాష్ట్రాన్ని వీడుతున్నానని తమిళిసై తెలిపారు. రాజీనామా చేసిన అనంతరం చెన్నైకి వెళ్తూ.. తెలంగాణ ప్రజలనుద్దేశించి సోమవారం లేఖ విడుదల చేశారు. ‘‘నేను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలుగుతున్నప్పుడు.. అనేక భావోద్వేగాల్లో మునిగిపోయా. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది. అన్నింటికీ మించి నా సోదర సోదరీమణుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుంది. నేను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజలు అక్కగా ఆదరించారు. మీ అచంచలమైన మద్దతు, ప్రేమ, ఆప్యాయత ఎంతగా నా హృదయాన్ని తాకాయో.. నేను మాటల్లో పూర్తిగా వ్యక్తపరచలేకపోతున్నా. అందరం కలిసి రాష్ట్ర ప్రగతికి పాటుపడ్డాం. బోనాలు, బతుకమ్మ తదితర పండుగలు జరుపుకొన్నాం. మీలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నా. క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ వస్తున్నా. అందుకే రాజీనామా చేశా. లోక్సభ ఎన్నికల్లో అధిష్ఠానం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా. రాజీనామా నిర్ణయం గురించి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాకు సమాచారం ఇచ్చా. నేను ఏం కోరుకుంటున్నానో వారికి తెలుసు’’ అని చెప్పారు. 2019లో ఆమె భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓటమి పాలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్