సాక్షాత్తు దేశ ప్రధాని వస్తే కనీస భద్రత కల్పించరా?
సీఎం జగన్ హెలికాఫ్టర్లో వెళుతుంటే, కింద రోడ్లపై ట్రాఫిక్ను ఆపే రాష్ట్ర పోలీసులు.. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజాగళం సభకు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారని తెదేపా, జనసేన, భాజపా నేతలు ధ్వజమెత్తారు.
డీజీపీగా రాజేంద్రనాథరెడ్డి అనర్హుడు
ప్రజాగళం భగ్నానికి ఇంటెలిజెన్స్ డీజీ, పల్నాడు ఎస్పీల యత్నం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూటమి నేతల ఫిర్యాదు
ఈనాడు డిజిటల్, అమరావతి: సీఎం జగన్ హెలికాఫ్టర్లో వెళుతుంటే, కింద రోడ్లపై ట్రాఫిక్ను ఆపే రాష్ట్ర పోలీసులు.. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజాగళం సభకు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారని తెదేపా, జనసేన, భాజపా నేతలు ధ్వజమెత్తారు. ప్రధాని సభకు ఏర్పాట్లు చేయలేని రాజేంద్రనాథరెడ్డికి డీజీపీగా ఉండే అర్హతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది జనం వచ్చిన సభ విషయంలో వ్యవహరించే తీరు ఇలాగేనా అంటూ ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులను ప్రశ్నించారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు కంటే.. కానిస్టేబుల్ సమర్థంగా పని చేస్తారని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి అనవసరంగా ఖాకీ చొక్కా వేసుకున్నారని.. ఆయన వైకాపా చొక్కా వేసుకొని తిరగాల్సిందని మండిపడ్డారు. కూటమి సభను ఎలాగైనా ఛిన్నాభిన్నం చేయాలని వైకాపా ప్రభుత్వం, పోలీసులు శాయశక్తులా ప్రయత్నించారని ఆరోపించారు. జగన్ సేవలో పునీతులవుతున్న రాజేంద్రనాథ్రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు, పాలరాజు, రవిశంకర్రెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తక్షణం వారిని విధుల్లోంచి తొలగించాలని కోరారు. ఈ మేరకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్, భాజపా నేతలు పాతూరి నాగభూషణం, షేక్ బాజీ, జనసేన నాయకులు బండ్రెడ్డి రామకృష్ణ, చిల్లపల్లి శ్రీనివాసరావులు సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని డిమాండ్ చేశారు. స్పందించిన ముకేశ్కుమార్ మీనా.. అన్ని అంశాల్నీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని విలేకర్ల సమావేశంలో మూడు పార్టీల నేతలు తెలిపారు.
దొంగ ఓట్లు వేస్తారు.. వేయిస్తారు
‘రాజేంద్రనాథ్రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు, పాలరాజు, రవిశంకర్రెడ్డిలు అవసరమైతే వైకాపాకు దొంగ ఓట్లు కూడా వేస్తారు.. వేయిస్తారు.. చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, అందులో ప్రధాని మోదీ పాల్గొంటారని ఈ నెల 12న డీజీపీకి లేఖ రాశాం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరాం. కానీ ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఎల్ఈడీ పోల్స్పైకి ఎక్కిన వారిని దిగమని సాక్షాత్తు మోదీ విజ్ఞప్తి చేయాల్సిన దుస్థితి. ప్రధాని సభలో మైక్ పని చేయకపోవడం పోలీసుల వైఫల్యం కాదా.. ప్రజాగళం సభను భగ్నం చేయాలని ఇంటెలిజెన్స్ డీజీ, పల్నాడు ఎస్పీలు యత్నించారు. వైకాపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకపోతే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలు అంటున్నారట.. పల్నాడు ఎస్పీ ముందే పారిపోతారు. వీరా ప్రజల్ని రక్షించేవారు. జగన్ సేవలో పునీతులవుతున్నారు’ అని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హెలిప్యాడ్ వద్ద మోదీకి స్వాగతం పలికే వారి పేర్లు ముందే ఇచ్చినా వారినీ వెళ్లనివ్వలేదు. బొకేలు, శాలువాల్ని అనుమతించలేదు. దేవుడి బొమ్మల్ని సైతం పక్కన పడేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పల్నాడు ఎస్పీ స్పందించలేదు. ఈ అంశాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం’ అని భాజపా నేత నాగభూషణం వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్