దోచిపెట్టాలని దాచిపెట్టారు!
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన మంగంపేట గనుల్లో సీ, డీ గ్రేడ్ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్ల వెనుక భారీ స్కెచ్ బయటపడింది.
మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు వెనుక రహస్యమిదే
ఈ ఏడాదితో నిండుకోనున్న ఏ-గ్రేడ్ నిల్వలు
తర్వాత గ్రేడ్లకు డిమాండ్తో రెట్టింపు కానున్న ధర
దీనిని గుట్టుగా ఉంచి సీ, డీ గ్రేడ్లకు ఐదేళ్లకు టెండరు
ఓ బయ్యర్కు రూ.వందల కోట్ల ప్రయోజనం కలిగించేందుకే
పత్రికల్లో కథనాలు రావడంతో వెనక్కి తగ్గిన వైనం
ఈనాడు - అమరావతి
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన మంగంపేట గనుల్లో సీ, డీ గ్రేడ్ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్ల వెనుక భారీ స్కెచ్ బయటపడింది. ఏపీఎండీసీకి రూ.వందల కోట్ల నష్టం చేకూర్చి, ఓ బయ్యర్కు మేలుచేసే వ్యూహం దీని వెనుక ఉంది. ప్రతి ఏటా పిలవాల్సి ఉండగా ఐదేళ్ల కాలానికి ఒకేసారి కోటి మెట్రిక్ టన్నుల ముగ్గురాయి విక్రయాలకు బిడ్లు ఆహ్వానించారు. ఇందులో మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం కథ నడిపారు. అక్కడ లభించే ముగ్గురాయిలో ఏ గ్రేడ్ నిల్వలు కొన్ని నెలల్లో అయిపోతుండగా, ఆ తర్వాత మిగిలిన గ్రేడ్లకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా ఇదంతా చేసినట్లు సమాచారం. పత్రికల్లో కథనాలు రావడంతో చివరికి ఆ టెండర్లు రద్దయ్యాయి. రద్దు వెనుక తతంగాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి...
అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె మండలం మంగంపేట వద్ద ఏపీఎండీసీకి ముగ్గురాయి గనులు ఉన్నాయి. చమురు వెలికితీసే కంపెనీలు దీనిని వినియోగిస్తుండటంతో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తవ్వితీసే ముగ్గురాయిలో ఏ, బీ, సీ, డీ, డబ్ల్యూ(వేస్ట్) గ్రేడ్లకు ఏటా టెండర్లు పిలిచి, బయ్యర్లను ఎంపిక చేస్తారు. సాధారణంగా ఏటా 15-20 లక్షల మెట్రిక్ టన్నుల వరకే సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల ముగ్గురాయిని బయ్యర్లు తీసుకుంటారు. అయితే ఈ ఏడాది జనవరి 24న ఏపీఎండీసీ అధికారులు ఐదేళ్ల కాలవ్యవధికి కోటి మెట్రిక్ టన్నుల సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల ముగ్గురాయికి ఒకేసారి టెండరు పిలిచారు. ఇందులో టెండరు ధరావతు రూ.90 కోట్లు, టెండరు డాక్యుమెంట్ను డౌన్లోడ్ చేసుకునేందుకు రూ.29.5 లక్షల ఫీజు చెల్లించాలి... బిడ్ దక్కించుకునే గుత్తేదారు కాంట్రాక్టు విలువలో 50 శాతం మేర పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీగా(దాదాపు రూ.600 కోట్లు) డిపాజిట్ చేయాలి... వంటి నిబంధనల్ని విధించారు. ఓ కీలక బయ్యర్కు ఈ టెండరు దక్కేలా ఇదంతా చేశారనే విమర్శలొచ్చాయి.
ఏటా టెండర్లు నిర్వహిస్తే...
ప్రస్తుతం మంగంపేట గనుల్లో కీలకమైన ఏ గ్రేడ్ నిల్వలు చివరి దశలో ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరుకు గనుల్లో ఏ గ్రేడ్ ముగ్గురాయి లభించదు. ఆ తర్వాత బీ గ్రేడ్తోపాటు, సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఏటా టెండర్లు నిర్వహిస్తే వీటి ధర క్రమంగా పెరుగుతుంది. కానీ ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి, ఒకేసారి ఐదేళ్లకు టెండరు పిలిచారు.
- రెండేళ్ల కిందట టెండర్లు పిలిచినప్పుడు ఏ గ్రేడ్కు మెట్రిక్ టన్ను ధర రూ.6,691, బీ గ్రేడ్ రూ.5,225, సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్లకు రూ.1,670గా ఉంది. వీటికి అదనంగా సీనరేజ్, సెస్, జిల్లా ఖనిజ నిధి, మెరిట్, జీఎస్టీ తదితరాలు ఉంటాయి.
- తాజాగా పిలిచిన టెండర్లలో సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్ల రిజర్వ్ ధర మెట్రిక్ టన్నుకు రూ.1,200గా పేర్కొన్నారు. ఇప్పటివరకు బయ్యర్లు కొంటున్న ధర రూ.1,670. దానిని రూ.470 తగ్గించి రూ.1,200గా టెండరులో పేర్కొన్నారు. అంటే కోటి మెట్రిక్ టన్నుల టెండరు దక్కించుకున్న బయ్యర్కు ఐదేళ్లలో రూ.470 కోట్లు మిగులుతుంది.
- సీ, డీ, డబ్ల్యూ గ్రేడ్లకు వచ్చే ఏడాది నుంచి ధర పెరిగి రెండు, మూడేళ్లలో మెట్రిక్ టన్ను రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు చేరొచ్చని భావిస్తున్నారు. అంటే ప్రస్తుతం మెట్రిక్ టన్ను రూ.1,200 ధరతో బిడ్ దక్కించుకునే బయ్యర్కు మున్ముందు మార్కెట్లో రెట్టింపు ధరకు విక్రయించి భారీగా లాభపడనున్నారు. దాదాపు రూ.1,200 కోట్ల మేర బయ్యర్కు మిగులుతుంది.
లొసుగుల్ని వెలుగులోకి తెచ్చేసరికి...
మంగంపేట ప్రాంతంలో పల్వరైజింగ్ మిల్లులు, విదేశీ కంపెనీలతో సంబంధాలు కలిగి... ముగ్గురాయి ఎగుమతుల్లో కొంతకాలం ‘విక్రమా’ర్కుడిలా పైచేయి చూపిస్తున్న ఓ బయ్యర్ కోసం ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. అతనికి ఏపీఎండీసీ కీలక అధికారితో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో టెండరును ఎలాగైనా అతడి సంస్థకే దక్కేలా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ టెండర్లలో లొసుగులు, ఇందులో విధించిన నిబంధనలపై పత్రికల్లో వరుస కథనాలతో ఏపీఎండీసీ అధికారులు వెనక్కు తగ్గారని తెలిసింది. ఈ కీలక బయ్యర్కు బిడ్లు వేయొద్దని సూచించినట్లు సమాచారం. చివరకు ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదని టెండర్లు రద్దుచేశారు. ముందుగా అనుకున్నట్లు ప్రణాళిక ప్రకారం టెండర్లు జరిగి ఉంటే ఏపీఎండీసీ రూ.వందల కోట్లు నష్టపోయేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్