2000 Note: ₹2 వేల నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే గడువు!
2000 Note Exchange: 2 వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగుస్తోంది. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బ్యాంకుల్లో నోట్లు మార్చుకోవచ్చు.
2000 Note Exchange ఇంటర్నెట్ డెస్క్: రెండు వేల రూపాయల నోట్ల (2000 Note) మార్పిడికి గడువు దగ్గరపడింది. బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్బీఐ (RBI) ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. అంటే ఇంకా ఐదు రోజులే మిగిలుంది. ఒకవేళ ఇప్పటికీ ₹2 వేల నోట్లు మార్చుకోకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. నోట్ల మార్పిడికి మే 23 నుంచి బ్యాంకుల్లో మార్చుకునేందుకు అనుమతిచ్చింది.
ఏదైనా బ్యాంకు శాఖలో ఒక రోజులో గరిష్ఠంగా రూ.20 వేల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అదే సాధారణ సేవింగ్స్ అకౌంట్లు, జన్ధన్ ఖాతాల్లో డిపాజిట్లకు మాత్రం ఎలాంటి పరిమితీ లేదు. ఒకవేళ ఒకే రోజు రూ.50 వేలకు పైబడి డిపాజిట్ చేయాల్సి వస్తే మాత్రం ఐటీ నిబంధనల ప్రకారం పాన్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నోట్ల మార్పిడికి స్లిప్ గానీ, ధ్రువీకరణ పత్రం గానీ అవసరం లేదని ఆర్బీఐ చెప్పినప్పటికీ.. కొన్ని బ్యాంకులు మాత్రం ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి.
యోగా చేస్తోన్న టెస్లా రోబో.. ఇంకా ఏమేం చేస్తోందంటే..?
వాస్తవానికి సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు అంటే ఆరు రోజులు గడువు ఉన్నప్పటికీ.. మధ్యలో ఒక రోజు బ్యాంకులకు సెలవు వస్తోంది. అంటే 25, 26, 27 తేదీల్లో నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. 28న మిలాద్-ఉన్-నబి కారణంగా బ్యాంకులు పనిచేయవు. మళ్లీ 29, 30 తేదీల్లో బ్యాంకులు పనిచేయనున్నాయి. ఆయా తేదీల్లో బ్యాంక్ పనివేళల్లో నోట్లు మార్చుకోవచ్చు.
సెప్టెంబర్ 1 నాటికి 7 శాతం నోట్లు వెనక్కి రావాలని ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. గడిచిన 24 రోజుల్లో ఎన్ని నోట్లు బ్యాంకులకు చేరాయి? ఇంకా మొత్తంగా ఎన్ని చేరుతాయి? అనేది తెలియరావాలి. అలాగే, సెప్టెంబర్ 30 తర్వాత రూ.2వేల నోటు గురించి ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటోందనేది ఆసక్తికరం. అయితే, నిర్దేశిత గడువు దాటిన తర్వాత కూడా రూ.2 వేల నోటు లీగల్ టెండర్గా కొనసాగే అవకాశం ఉందని, లావాదేవీలకు అనుమతివ్వకుండా ఆర్బీఐ శాఖల వద్ద మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో డెడ్లైన్లోపు ఎందుకు మార్చుకోలేకపోయిందీ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామలింగ రాజు, మరో నలుగురు రూ.624 కోట్లు లాభపడ్డారు
దాదాపు 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. -
జోష్
దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది -
వాహన అమ్మకాలకు పండగ హుషారు
ఈ ఏడాది నవంబరులో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరా రికార్డు స్థాయిలో జరిగింది. పండగ సీజను గిరాకీకి తగ్గట్లుగా డీలర్లకు కంపెనీలు భారీగా వాహనాలను అందించాయి -
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15 శాతం అధికం. ‘2023 నవంబరులో స్థూలంగా రూ.1,67,929 కోట్ల జీఎస్టీ వసూలైంది. -
భారత ఆర్థిక భవితపై సీఎఫ్ఓలు ఆశావహం
దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94 శాతం భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్ఓ) విశ్వాసం వ్యక్తం చేశారని డెలాయిట్ ఇండియా పేర్కొంది. ఆసియా పసిఫిక్ (అపాక్) ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావహ శాతమని వెల్లడించింది. -
న్యాయ సలహాదారును నియమించుకోనున్న రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లు
రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గౌతమ్ సింఘానియా విడాకుల వివాదం వల్ల ఏర్పడ్డ పరిస్థితులను పరిశీలిస్తున్నామని ఆ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు పేర్కొన్నారు. కంపెనీ వ్యవహారాలు, వ్యాపారంపై ప్రభావం పడకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం. -
రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే
చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది -
డీప్ఫేక్ వీడియోలపై ఆసక్తి లేదు
డీప్ఫేక్ వీడియోలపై యూట్యూబ్కు ఎంతమాత్రం ఆసక్తి లేదని ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంతో అనుబంధం ఉండాలని మా భాగస్వాములెవరూ భావించడం లేదనీ తెలిపారు. -
ఒక కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వం
ఒక రంగంలోని సంస్థలన్నింటికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ, ఒక విభాగంలోని ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎటువంటి రాయితీలను ఇవ్వదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు -
రూ.22 పెరిగిన వాణిజ్య సిలిండర్
హోటళ్లు, రెస్టారెంట్ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. ఈ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.2002 నుంచి రూ.22 పెరిగి రూ.2024 అయ్యింది. -
సంక్షిప్త వార్తలు(6)
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎమ్ఎస్ఐ) తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైక్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!