Tesla Bot: యోగా చేస్తోన్న టెస్లా రోబో.. ఇంకా ఏమేం చేస్తోందంటే..?
Tesla Bot: టెస్లా (Tesla) కంపెనీ తాజాగా తమ సంస్థ నుంచి వస్తోన్న ‘హ్యుమనాయిడ్ రోబో’కు సంబంధించిన వీడియోను తమ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
వాషింగ్టన్: విద్యుత్ కార్లు, అటానమస్ కార్ల తయారీలో తనదైన ముద్ర వేసిన టెస్లా (Tesla).. రోబోటిక్ రంగంలోనూ రాణించేందుకు సిద్ధమైంది. తమ సంస్థ తయారు చేసిన భవిష్యత్ హ్యుమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ (humanoid robot Optimus)కు సంబంధించిన వీడియోను ఆదివారం తమ అధికారిక ఎక్స్ (ట్విటర్)లో పంచుకుంది.
ఈ హ్యుమనాయిడ్ రోబో (humanoid robot Optimus) యోగా కూడా చేస్తోంది. వస్తువులను గుర్తించి వాటిని ఓ క్రమ పద్ధతిలో సర్దుతోంది. మనిషి మధ్యలో కలగజేసుకొని ఏవైనా మార్పులు చేసి పనిని మరింత కష్టతరంగా మార్చినా.. రోబో దాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతోంది. యోగాలో వివిధ రకాల భంగిమలను ప్రదర్శిస్తోంది. తన కాళ్లు, చేతులపై పూర్తి నియంత్రణను కలిగి ఉంది. టెస్లా కార్ల తరహాలోనే న్యూరల్ నెట్వర్క్ ద్వారా వీడియో ఇన్పుట్ను క్షుణ్నంగా సమీక్షించి తదనుగుణంగా ఔట్పుట్ను అందిస్తోంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఈ వీడియోపై స్పందించారు. హ్యుమనాయిడ్ రోబో తయారీలో పురోగతి సాధించినట్లు చెప్పారు. ఈ రోబోకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. టెస్లా నుంచి మరో అద్భుతమైన పురోగతి అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ‘టెస్లాబోట్’గా పేర్కొంటున్న ఈ రోబో ఎప్పుడు వినియోగంలోకి తీసుకొస్తారనే విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామలింగ రాజు, మరో నలుగురు రూ.624 కోట్లు లాభపడ్డారు
దాదాపు 14 ఏళ్ల నాటి సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కేసులో, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. -
జోష్
దేశ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబరు త్రైమాసికంలో అంచనాలను మించి రాణించడంతో, శుక్రవారం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ మరో కొత్త శిఖరానికి చేరగా.. మదుపర్ల సంపద రికార్డు గరిష్ఠాలను అధిరోహించింది -
వాహన అమ్మకాలకు పండగ హుషారు
ఈ ఏడాది నవంబరులో కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహనాల సరఫరా రికార్డు స్థాయిలో జరిగింది. పండగ సీజను గిరాకీకి తగ్గట్లుగా డీలర్లకు కంపెనీలు భారీగా వాహనాలను అందించాయి -
జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు
నవంబరులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లుగా నమోదయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022 నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్ల కంటే ఇవి 15 శాతం అధికం. ‘2023 నవంబరులో స్థూలంగా రూ.1,67,929 కోట్ల జీఎస్టీ వసూలైంది. -
భారత ఆర్థిక భవితపై సీఎఫ్ఓలు ఆశావహం
దేశ ఆర్థిక భవిష్యత్తుపై 94 శాతం భారత కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులు (సీఎఫ్ఓ) విశ్వాసం వ్యక్తం చేశారని డెలాయిట్ ఇండియా పేర్కొంది. ఆసియా పసిఫిక్ (అపాక్) ప్రాంతంలో ఇదే అత్యధిక ఆశావహ శాతమని వెల్లడించింది. -
న్యాయ సలహాదారును నియమించుకోనున్న రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లు
రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గౌతమ్ సింఘానియా విడాకుల వివాదం వల్ల ఏర్పడ్డ పరిస్థితులను పరిశీలిస్తున్నామని ఆ కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు పేర్కొన్నారు. కంపెనీ వ్యవహారాలు, వ్యాపారంపై ప్రభావం పడకుండా చూడాలన్నది వీరి ఉద్దేశం. -
రూ.9,760 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల వద్దే
చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రూ.2,000 నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది -
డీప్ఫేక్ వీడియోలపై ఆసక్తి లేదు
డీప్ఫేక్ వీడియోలపై యూట్యూబ్కు ఎంతమాత్రం ఆసక్తి లేదని ఆ కంపెనీ ఇండియా డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ పేర్కొన్నారు. తప్పుడు వార్తలు/సమాచారంతో అనుబంధం ఉండాలని మా భాగస్వాములెవరూ భావించడం లేదనీ తెలిపారు. -
ఒక కంపెనీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వం
ఒక రంగంలోని సంస్థలన్నింటికీ ఒకే రకమైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ, ఒక విభాగంలోని ఒక కంపెనీకి ప్రత్యేకంగా ఎటువంటి రాయితీలను ఇవ్వదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు -
రూ.22 పెరిగిన వాణిజ్య సిలిండర్
హోటళ్లు, రెస్టారెంట్ వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోగ్రాముల గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా పెరిగింది. ఈ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.2002 నుంచి రూ.22 పెరిగి రూ.2024 అయ్యింది. -
సంక్షిప్త వార్తలు(6)
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎమ్ఎస్ఐ) తన హైనెస్ సీబీ350, సీబీ350ఆర్ఎస్ బైక్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: దుర్గమ్మ సేవలో చంద్రబాబు దంపతులు
-
Israel Hamas: హమాస్ చర్యల వల్లే మళ్లీ గాజాలో బాంబులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా
-
T20I Record: టీ20ల్లో టీమ్ఇండియా ప్రపంచ రికార్డు..
-
Salaar: 114 రోజుల్లోనే ‘సలార్’ను పూర్తిచేశాం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రశాంత్ నీల్
-
Sangareddy: కారు బోల్తా.. బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి
-
Gutha Sukender Reddy: దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ‘సాగర్’ దుశ్చర్య: గుత్తా