Royal Enfield Himalayan: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్.. ధర, ఫీచర్లు ఇవిగో!
Royal Enfield Himalayan launched: రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త హిమాలయన్ను లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది. బుకింగ్లు ప్రారంభమయ్యాయి.
Royal Enfield Himalayan | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన అడ్వెంచర్ మోటార్ సైకిల్ కొత్త హిమాలయన్ను (Royal Enfield Himalayan) లాంచ్ చేసింది. గోవాలో జరిగిన మోటోవెర్స్ ఈవెంట్లో దీన్ని తీసుకొచ్చింది. దీని ధర రూ.2.69 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. ఇది లాంచింగ్ ఆఫర్ మాత్రమే. డిసెంబర్ 31 తర్వాత ధరలు పెంచుతామని కంపెనీ పేర్కొంది. కొత్త హిమాలయన్ మూడు వేరియంట్లలో వస్తోంది.
బేస్ వేరియంట్ను మౌంటెయిన్ పేరుతో పిలుస్తున్నారు. ఇది కాజా బ్రౌన్ రంగులో లభిస్తుంది. మిడ్ వేరియంట్ను పాస్గా పిలుస్తారు. ఇది స్లేట్ హిమాలయన్ సాల్ట్, స్లేట్ హిమాలయన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.2.74 లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఇక టాప్ వేరియంట్ను పీక్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో క్యామెంట్ వైట్ ధర రూ.2.79, హన్లే బ్లాక్ రూ.2.84 లక్షలుగా కంపెనీ పేర్కొంది.
ఇక ఇంజిన్ విషయానికొస్తే.. కొత్త హిమాలయన్ 451 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో వస్తోంది. ఇది 40.02 బీహెచ్పీ పవర్ను, 40ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ముందువైపు 21 అంగుళాల వీల్, వెనుక వైపు 17 అంగుళాల స్పోక్ వీల్స్తో వస్తోంది. ముందువైపు 320 ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక వైపు 270 ఎంఎం డిస్క్ అమర్చారు. డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ అమర్చారు.
ఇందులో అడ్జస్టబుల్ సీట్ ఉంది. ఎత్తు కావాల్సిన విధంగా 825 ఎంఎం నుంచి 845ఎంఎం వరకు పెంచుకోవచ్చు. లోయర్ సీటును 805-825 ఎంఎం వరకు అడ్జెస్ట్ చేసుకోవచ్చు. 17 లీటర్ల సామర్థ్యం కలిగిన మెటాలిక్ ట్యాంక్ను అమర్చారు. ఈ మోటార్ సైకిల్ బరువు 198 కేజీలు. కొత్త హిమాలయన్లో టీఎఫ్టీ డ్యాష్ బోర్డును స్మార్ట్ఫోన్కు కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్తో కలిసి నావిగేషన్ను అభివృద్ధి చేశారు. ఇందులో ఎకో, పెర్ఫార్మెన్స్, రియర్ ఏబీఎస్ ఆన్, పెర్ఫార్మెన్స్ విత్ రేర్ బీఎస్ ఆఫ్ వంటి రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. బైక్ మొత్తం ఎల్ఈడీ లైటింగ్తో వస్తోంది. ఈ మోటార్ సైకిల్ టాప్ స్పీడ్ 150 కిలోమీటర్లు. లీటర్కు 28 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు