Budget 2023: డిజిటల్ రూపాయికి ఏమిస్తారు..?
డిజిటల్ రూపాయికి సంబంధించిన కేటాయింపులు, ప్రతిపాదనలు ఈ సారి బడ్జెట్లో ఉండే అవకాశం ఉంది. భారత్ను డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
ఇంటర్నెట్డెస్క్: డిజిటల్ కరెన్సీ దిశగా భారత్ ఇప్పుడే తొలి అడుగు వేసింది. గతేడాది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని దేశానికి పరిచయం చేసింది. దీనిని భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం సీబీడీసీ హోల్సేల్, సీబీడీసీ-రిటైల్ కరెన్సీలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. వీటిపై రానున్న బడ్జెట్లో కేంద్రం మరింత స్పష్టతను తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కరెన్సీ నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటం, పారదర్శకత ఉండటం ప్రధాన బలాలు. ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఫిన్డెక్స్ నివేదిక ప్రకారం భారత్లో 67 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలున్నాయి. దీంతోపాటు 26 కోట్ల మంది యూపీఐ సేవలను వినియోగించుకొంటున్నారు. చూడటానికి ఇది పెద్ద సంఖ్యలా ఉన్నా.. భారత జనాభాలో కేవలం 20 శాతం మాత్రమే. అంటే బ్యాంకు ఖాతాలున్న వారిలో చాలా మంది డిజిటల్ యూపీఐకి మొగ్గడానికి ఇష్టపడటంలేదు. కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం భారీగా ఖర్చుపెడుతోంది. ఉదాహరణకు ప్రతి 500 రూపాయల నోటు ముద్రణకు రూ.2.94 పైసలు ఖర్చవుతుంది. 2019లో కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం రూ.8,000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత్ ఆర్థిక వ్యవస్థ నుంచి కాగితపు నగదును పూర్తిగా తొలగించాడానికి డిజిటల్ రూపాయి ప్రధాన మార్గంగా మారనుంది.
కొవిడ్ వ్యాప్తి తర్వాత నుంచి ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించడానికి యత్నాలు చేపట్టాయి. భారత ఆర్థిక మంత్రి గత బడ్జెట్ సమయంలో డిజిటల్ కరెన్సీని ప్రస్తావించారు. ఇందుకోసం 1934 ఆర్బీఐ చట్టాన్ని సవరించి ‘బ్యాంక్ నోట్’ నిర్వచనంలో మార్పులు చేసి డిజిటల్ రూపాన్ని కూడా జత చేశారు. గతేడాది చివర్లో ప్రయోగాత్మకంగా పరిశీలించడం మొదలుపెట్టారు. ఇది విజయవంతమైతే వినియోగంలోకి తీసుకురావడంలో అతిపెద్ద సవాళ్లు ఎదురుకానున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి బడ్జెట్ 2023లో ఆచరణాత్మక విధానాలను ప్రకటించాల్సి ఉంటుంది.
* ప్రభుత్వ పథకాల కింద ఇచ్చే సొమ్ము, కీలక రంగాలకు ఇచ్చే రాయితీ మొత్తాలను డిజిటల్ కరెన్సీ రూపంలో బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ కరెన్సీని నిర్దిష్టమైన వాటి వద్ద వినియోగించుకోవాల్సి ఉండటంతో ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు తగ్గుతాయి.
* ప్రస్తుతం సీబీడీసీని రెండు రకాలుగా వాడేలా డిజైన్ చేశారు. హోల్సేల్ కరెన్సీని కొన్ని సంస్థలకే పరిమితం చేసిన కేంద్రం పర్యవేక్షిస్తుంది. అదే సమయంలో రిటైల్ కరెన్సీని అందరూ వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఈ రెండు రకాలుగా డిజిటల్ కరెన్సీ నిర్వహణకు అవసరమైన వ్యవస్థలను బలోపేతం చేసుకోవడానికి కేంద్రం సహకరించాలి. ఈ క్రమంలో శాఖల అభివృద్ధి, ఏటీఎంలు, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ఏర్పాటకు సహకరించాలి.
* డిజిటల్ రూపాయి వాడకం విస్తరించడానికి ప్రీపెయిడ్ వాలెట్ ఆపరేటర్లు, గ్రామీణ ఫిన్టెక్ సంస్థలు, నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలను మధ్యవర్తులగా ప్రభుత్వం వాడుకోవచ్చు. యూపీఐ విస్తరణకు వాడినట్లే థర్డ్ పార్టీ పీఎస్పీలు, అవసరమైన సాఫ్ట్వేర్ల అభివృద్ధికి ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో డిజిటల్ రూపాయిని సృజనాత్మకంగా ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన నియమ నిబంధనలను ప్రకటించాలి.
* కొత్త డిజిటల్ కరెన్సీపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఈ దిశగా ప్రచారం కోసం నిధులను కేటాయించాలి. ఇప్పటికే నగదు ప్రధానంగా సాగే రంగాల్లో డిజిటల్ రూపాయిని వినియోగించేలా అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఎన్బీఎఫ్సీలు రుణాలు ఇచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వినియోగించుకొనేలా చేయాలి.
* డిజిటల్ రూపాయిని వినియోగంలోకి తెచ్చే సమయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. కొత్త వ్యవస్థను ఆసరగా చేసుకొని పుట్టుకొచ్చే మోసాలపై ప్రజలను చైతన్య పర్చాలి.
ముఖ్యంగా డిజిటల్ మోసాలను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధం చేసే అంశంపై బడ్జెట్లో దృష్టిపెట్టాలి. సామాన్య ప్రజలు వీలైనంత ఎక్కువగా వినియోగించుకొనేలా దీని పరిమితిని పెంచాలి. అంతేకాదు.. సమాంతర ఆర్థిక వ్యవస్థలు పుట్టుకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
గత బడ్జెట్లో డిజిటల్ కరెన్సీ ప్రస్తావించిన సమయంలో దాని గురించి ఎటువంటి కీలక అంశాలను కేంద్రం వెల్లడించలేదు. ప్రయోగాత్మకంగా మాత్రమే దానిని ప్రవేశపెట్టడంతో సరిపోయింది. కానీ, ఈ సారి డిజిటల్ కరెన్సీని సామాన్యప్రజలకు అందుబాటులోకి తెచ్చేట్లైతే పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకొని దానికి తగినట్లు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు
-
నేను చేసిన కర్మల ఫలితమే: స్పామ్ కాల్స్పై జిరోదా సీఈవో పోస్ట్
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన