Boeing: నాసిరకంగా బోయింగ్ విమానాల నిర్మాణం : ప్రజావేగు ఆరోపణలు
ఒకప్పుడు అమెరికా కీర్తి కిరీటంగా మెరిసిన బోయింగ్ (Boeing) ప్రతిష్ఠ మసకబారుతోంది. ఆ సంస్థకు చెందిన రెండు రకాల విమానాల నిర్మాణ సమయంలో ప్రమాణాలను పాటించడంలేదని ఓ ప్రజావేగు ఆరోపించాడు. ఆ లోపాలు తీవ్ర ప్రమాదాలకు దారితీయవచ్చని వెల్లడించాడు.
ఇంటర్నెట్డెస్క్: వైమానిక రంగ దిగ్గజం బోయింగ్(Boeing)కు చెందిన రెండు ప్రతిష్ఠాత్మక మోడళ్లపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్స్ట్రేషన్ (ఎఫ్ఏఏ) రంగంలోకి దిగింది. ఆ కంపెనీకి చెందిన ఇంజినీర్ సామ్ సలేహ్పౌర్ బోయింగ్(Boeing) లోపాలను ఎత్తిచూపాడు. 777, 787 డ్రీమ్లైనర్ నిర్మాణ సమయంలో సంస్థ షార్ట్కట్లను వాడుతోందని పేర్కొన్నాడు. ఫలితంగా విమానాలు పాతబడేకొద్దీ ఈ లోపాలు అత్యంత ప్రమాదకరంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశాడు. తాను ఈ విషయాలను బహిర్గతం చేయడంతో కంపెనీ ప్రతీకారచర్యలకు దిగుతోందని ఆరోపించాడు. అతడు జనవరిలో నేరుగా ఎఫ్ఏఏకు ఫిర్యాదు పంపాడు. ఈ విషయాన్ని తాజాగా మంగళవారం బహిర్గతం చేశాడు. మొత్తం 400 వరకు బోయింగ్ 777 రకం విమానాలు, దాదాపు 1,000 డ్రీమ్లైనర్ల (787)లో ఈ సమస్యలు ఉన్నట్లు సామ్ వెల్లడించాడు.
తన ఫిర్యాదులో ముఖ్యంగా రెండు లోపాలను ప్రస్తావించాడు. వాటివల్ల విమాన జీవితకాలం నాటకీయంగా పడిపోతుందని సామ్ అన్నాడు. ‘‘నేను బోయింగ్ను దెబ్బతీయడానికి ఈ ఫిర్యాదులు చేయలేదు. సంస్థను విజయవంతమైందిగా తీర్చిదిద్దడానికి, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను నివారించడానికి చేశాను. ప్రస్తుతం ఉన్న విధంగా ఆ సంస్థ ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. మరింత మెరుగుపడాల్సి ఉందనుకుంటున్నాను’’ అని తెలిపాడు.
దర్యాప్తులో భాగంగా సామ్ను ఎఫ్ఏఏ బృందం విచారించింది. ఈ సందర్భంగా ప్రజావేగుల నుంచి అందే అన్ని ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ‘‘లోపాలను స్వచ్ఛందంగా బహిర్గతం చేయడమనేది వైమానిక రంగ భద్రతలో కీలకమైంది. ఈ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ సమాచారాన్ని పంచుకోవడాన్ని మేం ప్రోత్సహిస్తాం’’ అని ఎఫ్ఏఏ తెలిపింది. మరోవైపు బోయింగ్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ‘‘787 డ్రీమ్లైనర్ నిర్మాణ సమగ్రతపై చేసిన ఆరోపణలు సరైనవి కావు. దీర్ఘకాలిక సురక్షిత, నాణ్యతపై బోయింగ్ చేసిన కృషిని విస్మరించాయి’’ అని పేర్కొంది.
బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలు 2011లో సర్వీసులోకి వచ్చాయి. వీటి జీవితకాలం 50 సంవత్సరాలుగా అంచనావేశారు. 44,000 సార్లు ప్రయాణాలు చేసేలా తీర్చిదిద్దారు. సామ్ ఆరోపణల ప్రకారం విమానం అసెంబ్లింగ్ సమయంలో సిబ్బంది కారణంగా లోపాలు చోటు చేసుకొంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో తయారై వచ్చిన విడిభాగాల అనుసంధానం వేళ ముఖ్యంగా ఈ పరిస్థితి నెలకొంది. ఫలితంగా విమానం వాడకం సమయంలో తొందరగా దెబ్బతినడం, జీవితకాలం పడిపోవడం, ప్రాణాంతక వైఫల్యాల వంటివి చోటు చేసుకొనే ప్రమాదం ఉందన్నారు.
ఆరోపణలు ఇదే తొలిసారి కాదు..
డ్రీమ్లైనర్లపై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2021లో ఈ రకం విమానం డెలివరీలను నిలిపివేశారు. ఆ సమయంలో విమానంలో లోపాలను ఎఫ్ఏఏ, బోయింగ్ పునః పరిశీలించాయి. నిర్మాణ విధానంలో మార్పులు చేసినట్లు అప్పట్లో బోయింగ్ ప్రకటించడంతో డెలివరీలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా మరోసారి ఎఫ్ఏఏ తనిఖీలు చేసింది. తాజాగా సామ్ ఆరోపణలు, వెల్లడించిన లోపాలను చూసి దర్యాప్తు సంస్థ ఆశ్చర్యపోయినట్లు అతడి లాయర్ తెలిపారు.
బదిలీ చేసిన చోట కూడా లోపాలే..
సామ్ ఆరోపణలతో ఆగ్రహించిన బోయింగ్ అతడిని 787 ప్రాజెక్టు నుంచి తప్పించి 777 ప్రోగ్రామ్కు బదిలీ చేసింది. చివరికి అక్కడ కూడా అతడు లోపాలను గుర్తించాడు. ముఖ్యంగా 777 విమానం విడిభాగాలను అనుసంధానించే వేళ ప్రమాణాలు పాటించకపోవడం, చేసిన పనిని ఎటువంటి తనిఖీలు లేకుండా ఆమోదించేలా ఇంజినీర్లపై ఒత్తిడి తేవడం వంటివి చోటు చేసుకొంటున్నట్లు గమనించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..