Adani group: వీసాతో అదానీ గ్రూప్ జట్టు.. త్వరలో క్రెడిట్ కార్డ్..!
Adani group credit card: అదానీ గ్రూప్ నుంచి త్వరలో క్రెడిట్ కార్డు రానుంది. ఈ మేరకు ఆ సంస్థ వీసాతో జట్టు కట్టింది. ఇరు సంస్థలు ఓ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును లాంచ్ చేయనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గౌతమ్ అదానీకి (Gautam Adani) చెందిన అదానీ గ్రూప్ (Adani group) నుంచి త్వరలో ఓ క్రెడిట్ కార్డు (Credit card) రానుంది. ఈ మేరకు ఆ గ్రూప్ అమెరికాకు చెందిన డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసాతో (Visa) జట్టు కట్టింది. రెండు సంస్థలు కలిసి ఓ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును లాంచ్ చేయనున్నాయి. 40 కోట్ల మంది ట్రావెలర్లే లక్ష్యంగా ఈ క్రెడిట్ కార్డును తీసుకొస్తున్నట్లు వీసా సీఈఓ ర్యాన్ మెక్నెర్నీ పేర్కొన్నారు. ఈ కార్డులతో ఎయిర్పోర్ట్ సేవలతో పాటు రిటైల్, ఆన్లైన్ ట్రావెల్ సర్వీసులను వినియోగించుకోవచ్చని తెలిపారు.
అదానీ గ్రూప్ ప్రస్తుతం భారత్లో ఏడు ఎయిర్పోర్టులను నిర్వహిస్తోంది. ముంబయి, అహ్మదాబాద్ వంటి ప్రధాన ఎయిర్పోర్టులు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు నవీ ముంబయి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును సైతం అదానీ గ్రూప్ అభివృద్ధి చేస్తోంది. త్వరలో ఇక్కడ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. మరిన్ని ఎయిర్పోర్టులను సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. తద్వారా అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా అవతరించాలన్నది ఆ గ్రూప్ లక్ష్యం. మరోవైపు వీసా దాదాపు 200 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
కష్టాలు చుట్టుముట్టిన వేళ.. బైజూస్ రవీంద్రన్ కంటతడి!
కొవిడ్ అనంతరం ట్రావెల్కు ఆదరణ పెరిగిన నేపథ్యంలో ఈ డీల్ జరగడం గమనార్హం. ఇందులో భాగంగా తీసుకొచ్చే క్రెడిట్ కార్డు ద్వారా కస్టమర్లు సాధారణ లావాదేవీలతో పాటు ఆయా సంస్థలు అందించే సేవలు వినియోగించుకోవచ్చు. ఇందుకు గానూ వినియోగదారులకు కొన్ని ప్రయోజనాలను అందించనున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే ట్రైన్మ్యాన్, క్లియర్ట్రిప్ సంస్థల్లో వాటాలను కొనుగోలు చేసింది. అదానీ వన్ పేరిట వెబ్సైట్/ యాప్ నిర్వహిస్తోంది. ఇందులో విమాన బుకింగ్లు, రైలు టికెట్లు, హోటళ్ల బుకింగ్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డును తీసుకొస్తుండడం గమనార్హం. దేశీయంగా ఇప్పటికే ఐసీఐసీఐ- మేక్ మై ట్రిప్ కార్డ్, ఎస్బీఐ- యాత్ర, యాక్సిస్ బ్యాంక్- విస్తారా వంటి ట్రావెల్ ఆధారిత కో-బ్రాండెండ్ క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
Credit Card: ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై మాత్రమే అదనపు రుసుము వసూలు చేసిన క్రెడిట్ కార్డు జారీ సంస్థలు ఇకపై ఇతర యుటిలిటీ బిల్లులకు కూడా దాన్ని విస్తరించేందుకు క్రమంగా సిద్ధమవుతున్నాయి. -
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?