DLF: 1,137 ఫ్లాట్లు.. మూడు రోజులు.. రూ.8,000 కోట్లు!
ది ఆర్బర్ పేరిట గురుగ్రామ్లో DLF హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. దీంట్లో ఫ్లాటన్నీ మూడు రోజుల్లోనే అమ్ముడైనట్లు పేర్కొంది. రూ.8,000 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపింది.
దిల్లీ: గురుగ్రామ్లోని తమ హౌసింగ్ ప్రాజెక్టులో 1,137 విలాసవంతమైన ఫ్లాట్లను విక్రయించినట్లు ప్రముఖ స్థిరాస్తి సంస్థ DLF లిమిటెడ్ గురువారం ప్రకటించింది. ఒక్కో ఫ్లాట్ ధర రూ.ఏడు కోట్ల పైనే ఉంటుందని పేర్కొంది. ఆ లెక్కన రూ.8,000 కోట్ల ఆదాయం లభించినట్లు వెల్లడించింది. కేవలం మూడు రోజుల్లోనే విక్రయాలు పూర్తయినట్లు తెలిపింది. ప్రధాన నగరాల్లో ప్రీమియం ఫ్లాట్లకు ఉన్న గిరాకీకి ఇది నిదర్శనమని పేర్కొంది.
‘‘గురుగ్రామ్లోని సెక్టార్ 63, గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ రోడ్ ప్రాంతంలో ‘ది ఆర్బర్’ పేరుతో ఈ హౌసింగ్ ప్రాజెక్టును 25 ఎకరాల్లో అభివృద్ధి చేశాం. ఈ ప్రాజెక్ట్లో మొత్తం ఐదు టవర్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో 38 - 39 అంతస్తులుంటాయి. ఒక్కో ఫ్లాట్లో 4 బెడ్ రూమ్లు ఉండనున్నాయి’’ అని డీఎల్ఎఫ్ తెలిపింది. అయితే విక్రయాలను అధికారికంగా ప్రారంభించడానికి ముందు నిర్వహించిన ‘ప్రీ-ఫార్మల్ లాంఛ్’లోనే ఈ ఫ్లాట్లన్నీ అమ్ముడైనట్లు తెలిపింది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారత్లో డీఎల్ఎఫ్ అతిపెద్ద స్థిరాస్తి సంస్థ. ఏప్రిల్- డిసెంబర్ మధ్య కంపెనీ సేల్స్ బుకింగ్లు 45 శాతం వృద్ధితో రూ.6,599 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆ విలువ రూ.4,544 కోట్లుగా ఉంది. ఈ ఏడాది దిల్లీ, గురుగ్రామ్, పంచకుల, చెన్నైలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రారంభించింది. ఈ కంపెనీ ఇప్పటి వరకు 330 మిలియన్ చదరపు అడుగుల్లో 153 ప్రాజెక్టులు అభివృద్ధి చేసింది. రూ.7,500 కోట్ల ఆదాయ అంచనాలతో త్వరలోనే ది ఆర్బర్ ప్రాజెక్టు విక్రయాలు ప్రారంభిస్తామని జనవరిలోనే కంపెనీ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 70కి పైగా విమానాలు రద్దు
Air India Express: దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ అనారోగ్య కారణంతో సెలవు పెట్టినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దీంతో దాదాపు 70కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. -
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం. -
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 70కి పైగా విమానాలు రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా