చమురు ఉత్పత్తిలో భారీ కోత: ఒపెక్
చమురు ఎగుమతి దేశాలు, అనుబంధ దేశాల సమాఖ్య అయిన ఒపెక్+.. చమురు ఉత్పత్తిలో నవంబరు నుంచి భారీ కోత విధించాలని నిర్ణయించాయి. దీంతో చమురు ధరలు పెరిగి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఫ్రాంక్ఫర్ట్: చమురు ఎగుమతి దేశాలు, అనుబంధ దేశాల సమాఖ్య అయిన ఒపెక్+.. చమురు ఉత్పత్తిలో నవంబరు నుంచి భారీ కోత విధించాలని నిర్ణయించాయి. దీంతో చమురు ధరలు పెరిగి, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవంబరు నుంచి రోజుకు 2 మిలియన్ బారెళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత విధిస్తామని ఒపెక్ దేశాలు ప్రకటించాయి. కరోనా అనంతరం ప్రత్యక్షంగా జరిగిన సభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందనే అంచనాలతో, చమురుకు గిరాకీ తగ్గుతుందనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్న’ట్లు ఒపెక్+ పేర్కొంది. ప్రస్తుతం ముడిచమురు ధరలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముందు స్థాయికి దిగివచ్చిన నేపథ్యంలో, చమురు ధరల్లో రికవరీ కోసం ఈ అడుగులు వేసినట్లు తెలుస్తోంది.
అమెరికాలో ప్రభావం ఇలా
అమెరికా కాంగ్రెషనల్ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్న సమయంలో రాజకీయంగా ఈ పరిణామం ప్రభావం చూపొచ్చు. అంతర్జాతీయ సరఫరా పెంచడానికి వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును అమెరికా బయటకు తీయదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. జూన్ గరిష్ఠమైన 5.02 డాలర్ల నుంచి గ్యాసోలిన్ ధరలు తగ్గుతూ వచ్చిన వైనాన్ని అమెరికా అధ్యక్షుడు తన విజయంగా చెబుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇపుడు అమెరికా గ్యాస్ పంపుల్లో ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మనపై ప్రభావం ఇలా..
మన దేశంలో దాదాపు ఆరు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరల సవరణ జరగడం లేదు. బుధవారం ఒపెక్+ ప్రకటన అనంతరం ముడిచమురు ధరలు పెరిగాయి. ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉంది. ఒపెక్+ నిర్ణయానికి ముందు దేశీయంగా చమురు మార్కెటింగ్ సంస్థలకు లీటర్ డీజిల్పై నష్టం రూ.30 నుంచి రూ.5కు తగ్గితే, పెట్రోలుపై కొంత మేర లాభాన్ని పొందాయి. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు; రూపాయి బలహీనతలు కంపెనీల మార్జిన్లను దెబ్బతీయవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ నుంచి వచ్చిన నష్టాలను పూడ్చుకోవచ్చన్న ఆశలతో ఉన్న చమురు కంపెనీలకు తాజా పరిణామం మింగుడుపడకపోవచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు 4 నుంచి 137 రోజుల పాటు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ రిటైల్ ధరల సవరణను నిలిపివేశాయి. మార్చి 22 నుంచి మళ్లీ పెట్రో ఉత్పత్తుల సవరించినప్పటికీ.. ఏప్రిల్ 7 నుంచీ మాత్రం మార్చలేదు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకే సంస్థలు ఇలా చేస్తున్నాయి. మళ్లీ ముడిచమురు ధరలు పెరిగితే, చమురు మార్కెటింగ్ కంపెనీలు-ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్