ఆ ఫారంలో రోజుకు 1.20 లక్షల గుడ్ల ఉత్పత్తి
రవీంద్ర మేట్కర్.. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఈ రైతు పౌల్ట్రీ రంగంలో చరిత్ర సృష్టిస్తున్నారు. అమరావతి జిల్లాలోని అంజన్గావ్ బారీ గ్రామానికి చెందిన రవీంద్ర రోజూ రికార్డు స్థాయిలో లక్షా 20 వేల కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు.
50 మంది సిబ్బందితోనే సాధ్యం చేసిన రైతు
ఈటీవీ భారత్, అమరావతి (మహారాష్ట్ర): రవీంద్ర మేట్కర్.. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఈ రైతు పౌల్ట్రీ రంగంలో చరిత్ర సృష్టిస్తున్నారు. అమరావతి జిల్లాలోని అంజన్గావ్ బారీ గ్రామానికి చెందిన రవీంద్ర రోజూ రికార్డు స్థాయిలో లక్షా 20 వేల కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు. విదర్భ ప్రాంతంలో చుట్టుపక్కల మరెక్కడా ఈ స్థాయి ఉత్పత్తి లేదు. ‘మాతోశ్రీ పౌల్ట్రీ ఫారం’ పేరిట ఈయన ప్రారంభించిన వ్యాపారానికి జాతీయస్థాయి గుర్తింపు సైతం లభించింది. ఈ పౌల్ట్రీ ఫారంలో అన్నీ ఆటోమేటిక్ వ్యవస్థలతో కూడిన అత్యాధునిక వసతులే. వేల సంఖ్యలో ఉన్న కోళ్లకు మేత వేయడం, వాటి విసర్జితాలు తొలగించడం, పెట్టిన గుడ్లు సేకరించడం.. ఇలా అన్ని పనులు యంత్రాలే చేస్తాయి. ఉష్ణోగ్రత పరంగా కోళ్లు ఇబ్బంది పడకుండా ఏసీ వసతి కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా అపరిశుభ్రతకు చోటనేది లేదు. ఈ వసతులతో కోళ్ల ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగినట్లు రవీంద్ర మేట్కర్ ‘ఈటీవీ భారత్’కు తెలిపారు. ‘మాకు మార్కెటింగు సమస్య కూడా లేదు. కోడిగుడ్లన్నీ పౌల్ట్రీ ఫారం వద్దే అమ్మేస్తాం. భోపాల్, ఖాండ్వా, బెర్హాన్పుర్, ఇందోర్ వంటి నగరాలకు వీటిని తరలిస్తారు. గుజరాత్లోని సూరత్ నగరానికి కూడా పంపుతుంటాం’ అని వివరించారు. ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణకు నిపుణులైన 50 మంది సిబ్బంది మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. కోళ్లకు రోజూ 13 టన్నుల ఆహారం అందిస్తారు. అన్నీ కలిపి రోజుకు రూ.3.5 లక్షల ఖర్చు ఉంటుంది. రవీంద్ర కృషికి గుర్తింపుగా పలు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పురస్కారాలు వరించాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి అందించే ప్రతిష్ఠాత్మక జగ్జీవన్ రాం అభినవ్ కిసాన్ అవార్డు, జగ్జీవన్ రాం ఇన్నొవేటివ్ ఫార్మర్ అవార్డు-2021 వంటివి ఇందులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
‘రివర్స్’ పాలనతో వచ్చిన తిరకాసు!
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..