ప్రైవేటు క్రిప్టోలతో సంక్షోభమే
బిట్ కాయిన్ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు మరింత వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తే మరో ఆర్థిక సంక్షోభం వచ్చేందుకు అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు.
వాటిని నిషేధించాలనే చెబుతా
రుణాలు, డిపాజిట్ల మధ్య పెద్ద అంతరం లేదు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ముంబయి: బిట్ కాయిన్ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలు మరింత వృద్ధి చెందడానికి వీలు కల్పిస్తే మరో ఆర్థిక సంక్షోభం వచ్చేందుకు అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. ‘ఊహాజనిత క్రిప్టో కరెన్సీల వల్ల స్థూల ఆర్థికానికి, ఆర్థిక స్థిరత్వానికి భారీ ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మేం చెబుతూనే ఉన్నామ’ని బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై ఆయన ఏం చెప్పారంటే..
ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం
అమెరికాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జరిగే ఎఫ్టీఎక్స్ ఎక్స్ఛేంజీ దివాలా తీసింది. ఏడాది కాలంగా క్రిప్టో పరిణామాలు చూస్తే, ప్రమాదం పొంచి ఉందనే తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీల విలువ 190 బిలియన్ డాలర్ల నుంచి 140 బి.డాలర్లకు దిగివచ్చింది. ఇది 100 శాతం ఊహాజనిత కరెన్సీల ట్రేడింగ్. ఒక వేళ వీటిని పెంచి పోషిస్తే మాత్రం.. మరో ఆర్థిక సంక్షోభం తప్పక వస్తుంది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలు అధికారిక ఆర్థిక వ్యవస్థను ‘నాశనం’ చేస్తాయి. వాటిని నిషేధించాలనే చెబుతా.
ధరలపై ప్రభుత్వంతో కలిసి పోరాడుతున్నాం
ద్రవ్యోల్బణంపై పోరులో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య ‘చాలా సమన్వయంతో కూడిన ధోరణి’ ఉంది. ధరలను అదుపులో ఉంచే విషయంలో పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. కీలక రేట్లు, పరపతి విధానం, ద్రవ్యలభ్యత రూపంలో ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంటే.. పెట్రోలు, డీజిల్పై పన్నులు; ఆహార వస్తువుల దిగుమతిపై సుంకాలను ప్రభుత్వం తగ్గిస్తోంది. పరపతి విధాన సమీక్షపై ఎన్నికల ప్రభావం ఉండదు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే ప్రయత్నించొచ్చు.
రుణ వృద్ధి స్థిరంగా ఉంది
రుణ వృద్ధి మరీ ఎక్కువగా ఉందని చెప్పడానికి ఇంకా సమయం ఉంది. కొవిడ్ పరిణామాల వల్ల రెండేళ్ల పాటు రుణాలకు గిరాకీ బాగా తగ్గింది. అందువల్ల ఇపుడు రుణాలకు అధిక గిరాకీ ఉన్నట్లు కనిపిస్తోంది. రెండేళ్ల ప్రాతిపదిక ప్రభావం వల్లే డిపాజిట్ల వృద్ధి కూడా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి రుణ వృద్ధి స్థిరంగా ఉన్నప్పటికీ.. మేం జాగ్రత్తగా గమనిస్తున్నాం. డిసెంబరు 2 నాటికి రుణ వృద్ధి రూ.19 లక్షల కోట్లకు చేరగా.. డిపాజిట్లు రూ.17.5 లక్షల కోట్లు పెరిగాయి. కాబట్టి రుణ వృద్ధి, డిపాజిట్ల పెరుగుదల మధ్య ‘మరీ ఎక్కువ అంతరం’ లేదు. వ్యవస్థలో రుణ రేట్లు 1.17 శాతం పెరగ్గా.. డిపాజిట్ రేట్లు 1.5 శాతం మేర పెరిగాయి. మరో వైపు యూపీఐ వాలెట్తో పోలిస్తే సీబీడీసీ ప్రయోగాత్మక ప్రాజెక్టు భిన్నమైనదని.. ఇందులో ప్రత్యేక ఫీచర్లున్నాయని శక్తికాంత దాస్ అన్నారు.
డిజిటల్ కరెన్సీతో సబ్సిడీల బట్వాడా
ప్రభుత్వ సబ్సిడీలను కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)/ డిజిటల్ కరెన్సీ ద్వారా జారీచేసే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవి శంకర్ ఈ సదస్సులో పేర్కొన్నారు. ‘ఇంటర్నెట్ పరిమిత కనెక్టివిటీ ఉన్న, నెట్ సిగ్నల్స్ లేని చోట కూడా డిజిటల్ రూపాయి లావాదేవీలు చేయొచ్చు. సీబీడీసీకి ఉన్న ఫీచర్ల ద్వారా ఏవైనా లక్షిత చెల్లింపులను సైతం చేయొచ్చ’ని అన్నారు. విదేశీ చెల్లింపులను వేగంగా, చౌకగా చేసే సత్తా సీబీడీసీకి ఉండడం అత్యంత ప్రధాన ప్రయోజనమన్నారు. ఒకే కార్యకలాపాలను నిర్వర్తించే పక్షంలో బ్యాంకుల తరహాలోనే ఫిన్టెక్ వంటి బ్యాంకింగేతర సంస్థలకూ నియంత్రణలు ఉండాలని పేర్కొన్నారు.
మెస్సీ కూడా చరిత్రలో పట్టభద్రులా?
చరిత్ర పాఠ్యాంశాల్లో, దిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి శక్తికాంత దాస్ పట్టభద్రులయ్యారు. గత 28 ఏళ్లలో ఆర్బీఐకి ఆర్థిక అంశాలు అభ్యసించని గవర్నర్ ఈయనే. తరచూ ‘చరిత్ర చదివిన ఆర్బీఐ గవర్నర్’ అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వస్తుంటాయి కదా అన్న ప్రశ్నకు దాస్ స్పందిస్తూ ‘మెస్సీ చరిత్రలో పట్టభద్రుడై ఉంటాడా అని ఫుట్బాల్లో ఆయన ప్రత్యర్థి ఆలోచిస్తాడా? లేదు కదా.. కొన్ని సార్లు, కొంత మంది వ్యక్తులు మాత్రం నేనేం చదివానో నాకు చెబుతూ ఉంటార’ని సరదాగా దాస్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
Warren Buffett: భారత మార్కెట్లో ఉన్న అవకాశాలను భవిష్యత్తులో అందిపుచ్చుకునేందుకు తమ కంపెనీ బెర్క్షైర్ హాత్వే సిద్ధంగా ఉందని వారెన్ బఫెల్ తెలిపారు. -
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
IPO: రూ.6,400 కోట్ల సమీకరణ లక్ష్యంతో వచ్చేవారంలో మూడు కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. 2004 నుంచి సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఐపీఓలు ఉండడం ఇదే తొలిసారి. -
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
యాపిల్ వాచ్ ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అసలు ఒక స్మార్ట్ గడియారం ఆమెను ఎలా రక్షించగలిగిందంటే. -
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
USA: అమెరికా టెక్ పరిశ్రమలో భారతీయులది కీలక పాత్ర అని సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ సీఈఓ హర్బీర్ కె భాటియా తెలిపారు. వారు లేనిదే ఆ పరిశ్రమ మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు. -
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూ చిత్తు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన కోల్కతా
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..