హైదరాబాద్ నుంచి గోవా, బెంగళూరుకు ఆకాశ విమానాలు
దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ హైదరాబాద్ నుంచి బెంగళూరు, గోవాలకు రోజువారీ విమాన సేవలను బుధవారం (ఈనెల 25) ప్రారంభిస్తోంది.
నేటి నుంచే
ఈనాడు, హైదరాబాద్: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ హైదరాబాద్ నుంచి బెంగళూరు, గోవాలకు రోజువారీ విమాన సేవలను బుధవారం (ఈనెల 25) ప్రారంభిస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి బెంగళూరుకు అదనంగా మరో 2 సర్వీసులు నిర్వహిస్తామని ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ మంగళవారం ఇక్కడ తెలిపారు. మరో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బెల్సన్ కౌటినోతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఆకాశ ఎయిర్ వద్ద మొత్తం 14 విమానాలు ఉన్నాయని, ప్రతి 15 రోజులకో కొత్త విమానం జత అవుతోందన్నారు. ప్రస్తుతం 1,500 మంది ఉద్యోగులు ఉండగా, నెలకు 175 మందిని చేర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. 21 మార్గాల్లో వారానికి 575 విమాన సర్వీసులు నిర్వహిస్తున్నామని, విమానాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై దృష్టి పెడతామన్నారు. విదేశాలకూ విమాన సేవలను ప్రారంభించే ఆలోచన ఉందన్నారు.
2028నాటికి ప్రయాణికులు 40 కోట్లకు: ప్రస్తుతం దేశంలో ఏడాదికి 20 కోట్ల మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. 2028 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ప్రవీణ్ అయ్యర్ అన్నారు. దేశంలో మొత్తం 700 విమానాలున్నాయని, పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా 1,000 విమానాలు కావాలని పేర్కొన్నారు. కరోనాకు ముందు రోజూ 3130 విమాన సర్వీసులు నడిస్తే, ఇప్పుడు 2800 వరకూ ఉన్నాయన్నారు. వేసవికి సర్వీసుల సంఖ్య 3,000కు చేరుకుంటుందనే అంచనాలున్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం. -
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్ వారెన్ బఫెట్ ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.