ChatGPT: చాట్జీపీటీ ఎలా వాడాలి?
సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం చాట్జీపీటీ. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ చాట్జీపీటీ అనేక ఐటీ దిగ్గజ సంస్థలకు సవాలు విసురుతోంది.
ఉద్యోగులకు ఐటీ సంస్థల శిక్షణ
కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్లపై దృష్టి
ఈనాడు, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం చాట్జీపీటీ. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ చాట్జీపీటీ అనేక ఐటీ దిగ్గజ సంస్థలకు సవాలు విసురుతోంది. దీంతో సరికొత్త సాంకేతికతలను రూపొందించే దిశగా ప్రయత్నాలు చేయడంతోపాటు, చాట్జీపీటీని తమ సంస్థ అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చు అనే విషయాలపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నాయని సమాచారం.
నాలుగైదేళ్లుగా కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా, బ్లాక్చైన్ సాంకేతికతలు ఐటీ పరిశ్రమను శాసిస్తున్నాయి. ఈ సాంకేతికతలపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, ఈ నైపుణ్యాలున్న కొత్త వారికి నియామకాల్లో కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఐటీ పరిశ్రమను ఈ నిపుణుల కొరత ఇప్పటికీ వేధిస్తోంది. ఈ తరుణంలో ప్రాథమిక దశలోనే ఉన్న ఈ కొత్త చాట్జీపీటీ మరో సవాలు తీసుకొచ్చింది.
ధరల విషయంలో పోటీ
ఇప్పటికే యాక్సెంచర్, డెలాయిట్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు చాట్జీపీటీ, కొత్తతరం ఏఐపై శిక్షణ ఇవ్వడం ప్రారంభించాయి. ఓపెన్సోర్స్ సాఫ్ట్వేర్ల వినియోగం, అవసరమైన చోట వాటిని వాడటం లాంటి అంశాలపై దృష్టి సారించాయి. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం ‘ఈ సంస్థలు కొత్తతరం ఏఐని అధికంగా తీసుకొస్తున్నాయి. దీంతో భారతీయ కంపెనీలకు ప్రధానంగా ప్రాజెక్ట్ ధరల విషయంలో పోటీ పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా ఆదాయాలపై ప్రభావం ఉంటుంద’ని తెలిపింది.
దేశీయ సంస్థల సన్నాహాలు
పోటీని తట్టుకునేందుకు వీలుగా తమ ఉద్యోగులకూ ఈ సాంకేతికతను నేర్పించేందుకు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రయత్నాలు మొదలుపెట్టాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాట్జీపీటీని అభివృద్ధి చేస్తున్న ఓపెన్ ఏఐకి ఇన్ఫోసిస్ ఇప్పటికే కొన్ని నిధులను సమకూర్చింది. దీంతోపాటు ఏఐ మీద ఉద్యోగులకు వర్క్షాప్నూ ఏర్పాటు చేసింది. చాట్జీపీటీని వాడటంలో ఉద్యోగులకు పోటీలనూ ఏర్పాటు చేస్తున్నట్లు ఒక వార్తా సంస్థ తెలియజేసింది.
* ఒక నిర్దిష్ట ప్రశ్నను సందర్భోచితంగా పరిష్కరించేందుకు అనేక మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో చాట్జీపీటీ సరిపోతుందని టీసీఎస్ పేర్కొంటోంది. యాక్సెంచర్ ప్రత్యేకంగా ‘అడ్వాన్స్డ్ ఎన్ఎల్పీ: ఇంట్రడక్షన్ టు జీపీటీ’ అనే డిజిటల్ కోర్సునూ తన ఉద్యోగుల కోసం ప్రారంభించింది.
ఏ ఉద్యోగాలపై ప్రభావం?
చాట్జీపీటీతో ఐటీ రంగంలో ఏ ఉద్యోగాలు ప్రభావితం అవుతాయనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ కృత్రిమ మేధ చాట్బాట్ అనేక ఉద్యోగాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు తోడ్పాటునందిస్తుందనే అంచనాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంస్థలు తమ ఉద్యోగులను భవిష్యత్తుకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముందునుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా అవసరమైనప్పుడు వారు సిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్