ఇంటెల్ సహ వ్యవస్థాపకులు గోర్డాన్ మూర్ కన్నుమూత
ఇంటెల్ కార్ప్ సహ వ్యవస్థాపకులు గోర్డాన్ మూర్(94) కన్నుమూశారు. హవాయ్లోని ఆయన సొంత గృహంలో తుది శ్వాస విడిచినట్లు ఇంటెల్, గోర్డాన్ అండ్ బెట్టీ మూరే ఫౌండేషన్లు వెల్లడించాయి.
శాన్ఫ్రాన్సిస్కో: ఇంటెల్ కార్ప్ సహ వ్యవస్థాపకులు గోర్డాన్ మూర్(94) కన్నుమూశారు. హవాయ్లోని ఆయన సొంత గృహంలో తుది శ్వాస విడిచినట్లు ఇంటెల్, గోర్డాన్ అండ్ బెట్టీ మూరే ఫౌండేషన్లు వెల్లడించాయి. మూర్ రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందారు. 1968లో ఇంటెల్ను స్థాపించారు. దీనికి మూడేళ్ల ముందు ఆయన మూర్స్ లాను కనిపెట్టారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల సామర్థ్యం, సంక్లిష్టత ప్రతి ఏడాది రెట్టింపు అవుతాయని అప్పట్లో చిప్ల ఆధారంగా ఆయన అంచనా వేశారు. టెక్ పరిశ్రమ పురోగతి, ఆవిష్కరణలకు తర్వాత ఇది ప్రామాణికంగా మారింది. 2000వ సంవత్సంలో ఆయన తన భార్యతో కలిసి గోర్డాన్ అం్ బెట్టీ మూరే ఫౌండేషన్ స్థాపించి పర్యావరణ పరిరక్షణ, సైన్స్, రోగుల సేవ తదితర ప్రాజెక్టులకు 5.1 బిలియన్ డాలర్లను అందించారు.
ఇంటిగ్రేటెడ్+ఎలక్ట్రానిక్స్= ఇంటెల్
మూర్ 1929 జనవరి 3న శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి రసాయన శాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1954లో పీహెచ్డీ పట్టా పొందారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీలో రీసెర్చర్గా పని చేశారు. ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందిన విలియమ్ షాక్లే దగ్గరా పని చేశారు. షాక్లే సెమీ కండక్టర్ లేబొరేటరీ నుంచి బయటకొచ్చిన తర్వాత 1968లో మూరే, రాబర్ట్ నోసేలు కలిసి ఇంటెల్ను స్థాపించారు. ‘ఇంటిగ్రేటెడ్’, ‘ఎలక్ట్రానిక్స్’ పదాలను కలిపి ఇంటెల్గా కంపెనీకి పేరు పెట్టారు. 1975లో ఇంటెల్ సీఈఓగా మారారు. 1987 వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించారు. మరో 10 ఏళ్లు ఛైర్మన్గా కొనసాగారు. 1997 నుంచి 2006 వరకు గౌరవ ఛైర్మన్గా ఉన్నారు.
* అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ నుంచి 1990లో నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీని స్వీకరించారు. మరో అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ.బుష్ నుంచి 2002లో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను పొందారు. ఆయనకు భార్య బెట్టీ, కుమారులు కెన్నెత్, స్టీవెన్, నలుగురు మనవళ్లు-మనవరాళ్లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
-
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
-
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
-
AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్ ప్రశ్న!