గోఫస్ట్ పరిష్కార నిపుణుడికి ఎన్సీఎల్టీ నోటీసు
జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) గోఫస్ట్ తాత్కాలిక పరిష్కార నిపుణుడి (ఐఆర్పీ)కి నోటీసు జారీ చేసింది.
డెలివరీ పిటిషన్పై 2 వారాల్లో స్పందించాలి
దిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) గోఫస్ట్ తాత్కాలిక పరిష్కార నిపుణుడి (ఐఆర్పీ)కి నోటీసు జారీ చేసింది. సరఫరా కంపెనీ డెలివరీ దాఖలు చేసిన పిటిషన్పై రెండు వారాల్లోగా స్పందించాలని అందులో ఆదేశించింది. డెలివరీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లో గోఫస్ట్ ఎయిర్లైన్స్ దివాలా ప్రకటించిన మే 2న, తమ వద్ద నుంచి రూ.57 లక్షలు తీసుకుందని ఆరోపించింది. ఎన్సీఎల్టీ ఎదుట స్వచ్ఛంద దివాలాకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు ముందే తెలిసినా ఎయిర్లైన్స్ తమ వద్ద ఆ మొత్తాన్ని తీసుకోవడాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ ద్విసభ్య ధర్మాసనం రెండు వారాల్లోగా దీనిపై స్పందన తెలియజేయాలని ఐఆర్పీకి నోటీసు జారీ చేస్తూ, తదుపరి విచారణను జులై 24కు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్లో ప్రభాస్తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)