Tata Group: యూకేలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడి.. సునాక్ హర్షం
Tata Group Investment UK: భారత్ వెలుపల టాటా గ్రూప్ భారీ పెట్టుబడి పెట్టింది. 4 బిలియన్ పౌండ్లతో గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.
లండన్: దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ (Tata group) భారత్ వెలుపల భారీ పెట్టుబడి పెట్టనుంది. బ్రిటన్లో 4 బిలియన్ పౌండ్లతో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్లాంట్ (గిగా ఫ్యాక్టరీ)ను (Gigafactory) ఏర్పాటు చేయనుంది. టాటా గ్రూప్ నిర్ణయం పట్ల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రశంసలు కురిపించారు. టాటా గ్రూప్ పెట్టుబడి ద్వారా వేలాది సంఖ్యలో ఉద్యోగ సృష్టి జరగబోతోందని చెప్పారు.
టాటా గ్రూప్నకు దేశీయంగా టాటా మోటార్స్తో పాటు యూకేలో లగ్జరీ కార్లు తయారు చేసే జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఉంది. ఈ నేపథ్యంలో 40GWh గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. 2026లో కొత్త గిగా ఫ్యాక్టరీ అందుబాటులోకి రానుంది. ఒకసారి గిగా ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చాక జేఎల్ఆర్తో పాటు ఇతర కార్ల తయారీదారులకు ఉపయోగపడనుంది. సోమర్సెట్లో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రిటన్లో రిషి పాపులారిటీ పడిపోతోంది..!
యూకేలో టాటా గ్రూప్ ఏర్పాటు చేయబోతున్న గిగా ఫ్యాక్టరీ.. తమ కార్ల తయారీ పరిశ్రమను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. దీనివల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నెట్ జీరో వైపు అడుగులకు ఇది దోహదం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉపకరిస్తుందని తెలిపారు. భారత్ వెలుపల టాటా గ్రూప్ తన తొలి గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు బ్రిటన్ను ఎంచుకోవడం గర్వంగా ఉందని సునాక్ పేర్కొన్నారు. తమ పెట్టుబడి ద్వారా ఆటోమొబైల్ రంగం.. ఎలక్ట్రిక్ వైపు మరలడానికి దోహదం చేస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. ఇప్పటికే ఇక్కడ నిర్వహిస్తున్న టెక్నాలజీ, కన్జూమర్, హాస్పిటాలిటీ, స్టీల్, కెమికల్, ఆటోమోటివ్ వ్యాపారాలతో పాటు ఈ వ్యూహాత్మక పెట్టుబడి.. యూకే పట్ల తమ నిబద్ధతనను తెలియజేస్తోందని చంద్రశేఖరన్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..