Mukesh Ambani: మ్యూచువల్ ఫండ్ రంగంలోనూ ముకేశ్ సంచలనం?
జియోతో టెలికాంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ ఇపుడు జియో ఫైనాన్షియల్తో ఫండ్ పరిశ్రమలో ఇంకో సంచలనానికి తెర తీస్తున్నారా?
తక్కువ ఖర్చుతో ఫండ్ల నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: జియోతో టెలికాంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ ఇపుడు జియో ఫైనాన్షియల్తో ఫండ్ పరిశ్రమలో ఇంకో సంచలనానికి తెర తీస్తున్నారా? దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో అనూహ్య మార్పులు రాబోతున్నాయా? ఇంత కాలం ఫండ్ నిర్వహణ ఛార్జీల పేరుతో మదుపర్లపై అధిక భారాన్ని మోపుతున్న విధానం ముగియనుందా? మ్యూచువల్ ఫండ్లలోకి అడుగుపెడుతున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జీఎఫ్ఎస్ఎల్) సృష్టించనున్న విప్లవం ఎలా ఉండబోతోంది.. ఇపుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ జూన్ 30 నాటికి రూ.44.4 లక్షల కోట్లకు చేరుకుంది. మ్యూచువల్ ఫండ్లలో ఇప్పటికీ సంస్థలు, కార్పొరేట్ల పెట్టుబడులే ఎక్కువ. రిటైల్ మదుపర్ల వాటా 2 శాతంలోపే. దీన్ని మంచి అవకాశంగా మార్చుకోవాలని ముకేశ్ అంబానీ భావిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
ఈటీఎఫ్లపైనే ప్రధానంగా దృష్టి
ఆస్తుల నిర్వహణలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన బ్లాక్రాక్తో కలిసి మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమలోకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(జేఎఫ్ఎస్ఎల్) అడుగుపెట్టబోతోంది. సంప్రదాయ ఫండ్లను తీసుకొచ్చే బదులు.. తక్కువ నిర్వహణ వ్యయాలతో, మదుపర్లకు ఆకర్షణీయంగా ఉండే ఈటీఎఫ్ పథకాలపైనే ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించనుందని చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల్లో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల(ఈటీఎఫ్) వాటా 12% దరిదాపుల్లో ఉంది. అంటే, రూ.44.4 లక్షల కోట్లలో ఈ మొత్తం రూ.5 లక్షల కోట్లు మాత్రమే. ఇతర దేశాల్లో ఈటీఎఫ్ల్లోనే పెట్టుబడులు ఎక్కువ. అంటే, ఈ విభాగంలో ఎంతో వృద్ధి అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడుగా డిజిటల్ ఫస్ట్ వేదిక ద్వారా మ్యూచువల్ ఫండ్ లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సిద్ధం అవుతోంది.
సొంత వినియోగదారులను ఆకర్షిస్తే
రిలయన్స్ రిటైల్కు దేశ వ్యాప్తంగా 18,500 స్టోర్లు ఉన్నాయి. అదే సమయంలో జియో వినియోగదార్ల సంఖ్య దాదాపు 45 కోట్ల వరకు ఉంది. ఈ వినియోగదారులను తాను ఆవిష్కరించే మ్యూచువల్ ఫండ్లలోకి ఆకర్షించేందుకు జియో ఫైనాన్షియల్ ప్రయత్నిస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ప్రస్తుతం 284 ఫండ్లు
దేశీయంగా ప్రస్తుతం 284 ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్లు ఉన్నాయి. కానీ, వీటిని ఎంచుకునే వారి సంఖ్య పెద్దగా లేదు. దీనికి ప్రధాన కారణం.. పంపిణీదారులకు వీటిపై పెద్దగా రాబడి ఉండదు. కాబట్టి, వీటిని అందించేందుకు అంతగా ఆసక్తి చూపరు. జియో ఫైనాన్షియల్ ఇప్పటికే తనకున్న స్టోర్లలో ఈ ఫండ్లను విక్రయించేందుకు ప్రయత్నించవచ్చు. అదే సమయంలో బ్లాక్రాక్ డిజిటల్ ఫ్లాట్ఫాం ‘అలాద్దీన్’ ద్వారా మదుపర్లను నేరుగా చేరుకునే అవకాశం కూడా ఉంది. ఈ సానుకూలతలతో మ్యూచువల్ ఫండ్ మార్కెట్పై పట్టు సాధించాలనేది జియో ఫైనాన్షియల్ ఆలోచనగా తెలుస్తోంది.
సవాళ్లూ ఉన్నాయ్
మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమ ప్రధానంగా పంపిణీ వ్యవస్థపై ఆధారపడుతుంది. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల ప్రభావం మదుపర్లపై చాలా ఉంటుంది. వారు చెప్పిన ఫండ్లలో మదుపు చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అదే సమయంలో సంప్రదాయ యాక్టివ్ ఫండ్లు అధిక రాబడిని అందిస్తాయనే నమ్మకమే ఎక్కువగా ఉంది. ఈటీఎఫ్లలో ఛార్జీలు తక్కువగా ఉంటాయి, కానీ, లాభాలు పెద్దగా కనిపించవని పెట్టుబడిదార్లు అంతగా మొగ్గు చూపరు. ఈ రెండు ప్రధాన సవాళ్లను జియో ఫైనాన్షియల్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు