రాబోతున్నాయా.. ముకేశ్ హోటళ్లు!
ముకేశ్ అంబానీ ఏ రంగంలో అడుగుపెట్టినా.. అది సంచలనమే. ఎందులోనైనా దూకుడు ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత.
ముకేశ్ అంబానీ ఏ రంగంలో అడుగుపెట్టినా.. అది సంచలనమే. ఎందులోనైనా దూకుడు ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత. ఇప్పటికే టెలికాం, రిటైల్లో దూసుకెళుతున్న ముకేశ్.. హరిత ఇంధనం, ఆర్థికంపైనా దృష్టి సారించారు. తాజాగా హోటళ్ల వ్యాపారంలోకీ అడుగుపెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఒక దశాబ్దం నుంచీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పలు రంగాల్లోకి అడుగుపెడుతోంది. తన ప్రధాన వ్యాపారమైన చమురు నుంచి టెలికాంలోకి.. ఆ తర్వాత రిటైల్లోకి.. ఇపుడు హరిత ఇంధనంలోకి వచ్చారు. తాజాగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్తో ఆర్థిక రంగంలోకీ ప్రవేశించారు. ఇవన్నీ భారీ స్థాయిలో, అంతకంటే భారీ పెట్టుబడులతో కూడినవే. ఈ వైవిధ్యీకరణ ఇంతటితో ఆగేలా లేదు. తాజాగా ద ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ (ఒబెరాయ్ గ్రూప్)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇందుకు నేపథ్యం. దీని కింద భారత్, బ్రిటన్లోని మూడు హోటళ్లను సంయుక్తంగా నిర్వహిస్తారు. ఇందులో ముంబయిలో ప్రస్తుతం కడుతున్న అనంత్ విలాస్ హోటల్, బ్రిటన్లోని స్టోక్పార్క్, గుజరాత్లో ఇంకా పేరుపెట్టని హోటల్ ప్రాజెక్టు ఒకటి ఉన్నాయి.
ఇది తొలిసారి కాదు..కానీ
ఏళ్ల కిందటే ఆతిథ్య రంగంలో అంబానీ పెట్టుబడులు పెట్టారు. గతేడాది మాండరిన్ ఓరియంటల్ హోటల్ (న్యూయార్క్)లో 73% వాటాను దాదాపు 100 మి. డాలర్లతో కొన్నారు. అంతక్రితం ఏడాది ప్రఖ్యాత కంట్రీ క్లబ్, లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ అయిన స్టోక్ పార్క్ను 57 మి. పౌండ్లతో సొంతం చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే 2010లోనే ఒబెరాయ్ గ్రూప్లో పెట్టుబడులు పెట్టారు. అదే ఏడాది అంబానీకి చెందిన ఆర్ఐఐహెచ్ఎల్.. ఈస్ట్ ఇండియా హోటల్స్ (ఈఐహెచ్)లో 14.12% వాటా కొనుగోలు చేసింది. ఆ సమయంలోనే కంపెనీలో తాము దీర్ఘకాల పెట్టుబడుదారు మాత్రమేనని.. నిర్వహణపై ఆసక్తి లేదని నీతా అంబానీ అన్నారు. అయితే ఇపుడుమాత్రం నిర్వహణలోకి వస్తున్నట్లు తాజా ఒప్పందం ద్వారా తెలుస్తోంది.
ఎవరికి పోటీ..
ఒక వేళ రిలయన్స్ ఆతిథ్య రంగంలో చురుగ్గా అడుగుపెడితే మాత్రం.. ఐటీసీ, టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్స్కు రిలయన్స్ గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంది. న్యూయార్క్లోని ద మాండరిన్ ఓరియంటల్ టాటా గ్రూప్నకు చెందిన తాజ్ హోటల్లో భాగమైన ‘పియరీ’కి చాలా దగ్గరలోనే ఉంటుంది. ప్రస్తుతానికైతే టాటా గ్రూప్, ఈఐహెచ్, ఐటీసీ.. భారత్లో అతిపెద్ద మూడు హోటల్ కంపెనీలు. ఒకవేళ అంబానీ ఇపుడు హోటల్ వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటే మాత్రం.. ఇదే సరైన సమయమని విశ్లేషకులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్న వేళ.. హోటల్ పరిశ్రమకు కొత్త హోటళ్లు నిర్మించి గిరాకీని అందుకోవాలంటే భారీ పెట్టుబడులు కచ్చితంగా అవసరం. కరోనా ముందుతో పోలిస్తే.. ఇపుడు హోటల్ పరిశ్రమలో ఆపరేటింగ్ మార్జిన్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొత్త ప్రోపర్టీలపై భారీ మూలధన వ్యయాలు అవుతున్నాయని ఇక్రా ఇటీవలే తేల్చింది. హోటల్ పరిశ్రమలో పెట్టుబడులు పెంచి, గిరాకీని అందుకోవాల్సిన ఈ సమయంలో భారీ పెట్టుబడులతో అంబానీ ఈ రంగంలోకి అడుగుపెట్టడం సరైన వ్యూహమే అనిపించుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి. -
సూపర్ టాపప్ తీసుకోవచ్చా?
నా వయసు 57. నాకు బృంద ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకుంటే బాగుంటుందా? లేదా సూపర్ టాపప్ను ఎంచుకోవాలా? -
కార్డు బాకీ తీర్చలేకపోతే
చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డులు వెసులుబాటును అందిస్తాయి. ఈ సౌలభ్యం కొన్నిసార్లు అధిక ఖర్చుకూ దారి తీస్తుంది. చివరకు గడువులోపు బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. -
కారు రుణం ముందే తీర్చేస్తే
అప్పు చేసి కారు కొంటాం.. మన దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చి, ఈ రుణం తీర్చేయాలని అనుకున్నాం అనుకోండి.. అప్పుడు ఏం చేయాలో చూద్దామా..
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు