Mukesh Ambanis Children: ముకేశ్ పిల్లలకూ సున్నా వేతనమే!
ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు- ఆకాశ్, ఈశా, అనంత్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్లుగా ఎటువంటి వేతనం తీసుకోకుండా పనిచేయనున్నారు.
బోర్డు సమావేశాలకు హాజరైతే పారితోషికం, కమీషన్
డైరెక్టర్లుగా నియామకానికి వాటాదార్ల అనుమతి కోరుతూ రిలయన్స్ తీర్మానం
దిల్లీ: ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు- ఆకాశ్, ఈశా, అనంత్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్లుగా ఎటువంటి వేతనం తీసుకోకుండా పనిచేయనున్నారు. బోర్డు సమావేశానికి హాజరైతే ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాలపై కమీషన్ను మాత్రమే వాళ్లకు చెల్లిస్తారు. ముకేశ్ ముగ్గురు పిల్లలను కంపెనీ బోర్డులో చేర్చుకునేందుకు వాటాదార్ల అనుమతి కోరుతూ చేసిన తీర్మానంలో ఈ మేరకు పొందుపర్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ తీర్మానాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదార్లకు రిలయన్స్ పంపించింది. కాగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి జీతం లేకుండా కంపెనీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే ఆయన పిల్లలు కూడా వేతనం లేకుండా పనిచేస్తుండటం గమనార్హం.
అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ముకేశ్ సమీప బంధువులు నికిల్, హితల్ మాత్రం జీతంతో పాటు భత్యాలు, కమీషన్లు సహా ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు. మరోవైపు ముకేశ్ భార్య నీతా అంబానీ 2014లో కంపెనీ బోర్డు డైరెక్టరుగా నియమితులైన సమయంలో ఉన్న నియామక షరతులే ఆకాశ్, అనంత్, ఈశాలకూ వర్తించనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నీతా బోర్డు సమావేశాలకు హాజరైనందుకు సిట్టింగ్ రుసుం కింద రూ.6 లక్షలు, కమీషన్ రూపంలో రూ.2 కోట్లు పొందినట్లు రిలయన్స్ వార్షిక నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2020-21లో ఆమెకు సిట్టింగ్ రుసుం రూ.8 లక్షలు కాగా.. రూ.1.65 కోట్ల కమీషన్ లభించింది. కాగా.. తన ముగ్గురు పిల్లలను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో డైరెక్టర్లుగా చేయనున్నట్లు ఇటీవల జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) ముకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను మరో ఐదేళ్ల పాటు కంపెనీ ఛైర్మన్, సీఈఓగా కొనసాగనున్నట్లు కూడా ఆయన ఆ సమయంలో తెలిపారు. వారసత్వ ప్రణాళికలో భాగంగా రిలయన్స్ బోర్డు డైరెక్టరుగా నీతా రాజీనామా చేశారు. అయితే బోర్డు సమావేశాలన్నింటికీ హాజరయ్యేలా ఆమెకు ‘శాశ్వత ఆహ్వానితురాలు’ హోదాను కల్పించారు.
కొత్త పదవీకాలంలోనూ సున్నా వేతనమే..
- ముకేశ్ అంబానీ 1977లో రిలయన్స్లో బోర్డు డైరెక్టరుగా అడుగుపెట్టారు. 2002లో తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణం అనంతరం.. ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు అంటే 11 ఏళ్ల పాటు తన వార్షిక పారితోషికాన్ని రూ.15 కోట్లకే ముకేశ్ పరిమితం చేసుకున్నారు.
- 2020-21లో కొవిడ్-19 పరిణామాల ప్రభావం దృష్ట్యా తన కంపెనీ, వ్యాపారాలు తిరిగి పూర్తి సామర్థ్యంలో ఆదాయాలు ఆర్జించేంతవరకు వేతనం తీసుకోకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2020-21 నుంచి వరుసగా మూడేళ్లుగా ఆయన ఎలాంటి వేతనాన్ని, లాభాలపై కమిషన్ను పొందడం లేదు.
- ముకేశ్ వినతి మేరకు ఆయన కొత్త పదవీకాలమైన 2024 ఏప్రిల్ 19 నుంచి 2029 ఏప్రిల్ 18 వరకు కూడా ఎటువంటి వేతనం, కమిషన్ చెల్లించకూడదని బోర్డు సిఫారసు చేసింది.
- 2022-23 వార్షిక నివేదిక ప్రకారం.. నిఖిల్, హితల్ పారితోషికం రూ.25 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.17.28 కోట్ల కమిషన్ కూడా కలిపి ఉంది. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇంతే కమిషన్ను ఆయన పొందారు.
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్.ప్రసాద్ పారితోషికం రూపేణా (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కలిపి) రూ.13.50 కోట్లు అందుకున్నారు. 2021-22లో పొందిన రూ.11.89 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు కపిల్ పారితోషికం కూడా రూ.4.22 కోట్ల నుంచి రూ.4.40 కోట్లకు పెరిగింది. ఈయన ఐదేళ్ల పదవీకాలం 2023 మే 15తో ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆయన బోర్డు డైరెక్టరు పదవీ నుంచి వైదొలిగారు.
- 2023 జనవరిలో రిలయన్స్ బోర్డు డైరెక్టరుగా నియమితులైన కె.వి.కామత్కు రూ.3 లక్షల సిట్టింగ్ రుసుం, రూ.39 లక్షల కమిషన్ను చెల్లించారు.
- నీతా అంబానీతో పాటు బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా దీపక్ సి జైన్, రఘునాధ్ ఏ మషేల్కర్, అడిల్ జైనుల్భాయ్, రమిందర్ సింగ్ గుజ్రాల్, షుమీత్ బెనర్జీ, ఎస్బీఐ మాజీ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, మాజీ సీవీసీ అయిన కేవీ చౌదరీ, సౌదీ దేశ వెల్త్ ఫండ్ నామినీ యాసిర్ ఓథ్మన్ హెచ్ అల్ రుమాయన్ ఉన్నారు. స్వత్రంత్ర డైరెక్టర్లందరికీ కమిషన్, సిట్టింగ్ రుసుము కింద రూ.2 కోట్లు చెల్లించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!