Mukesh Ambanis Children: ముకేశ్ పిల్లలకూ సున్నా వేతనమే!
ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు- ఆకాశ్, ఈశా, అనంత్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్లుగా ఎటువంటి వేతనం తీసుకోకుండా పనిచేయనున్నారు.
బోర్డు సమావేశాలకు హాజరైతే పారితోషికం, కమీషన్
డైరెక్టర్లుగా నియామకానికి వాటాదార్ల అనుమతి కోరుతూ రిలయన్స్ తీర్మానం
దిల్లీ: ముకేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు- ఆకాశ్, ఈశా, అనంత్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్లుగా ఎటువంటి వేతనం తీసుకోకుండా పనిచేయనున్నారు. బోర్డు సమావేశానికి హాజరైతే ఫీజు, కంపెనీ ఆర్జించిన లాభాలపై కమీషన్ను మాత్రమే వాళ్లకు చెల్లిస్తారు. ముకేశ్ ముగ్గురు పిల్లలను కంపెనీ బోర్డులో చేర్చుకునేందుకు వాటాదార్ల అనుమతి కోరుతూ చేసిన తీర్మానంలో ఈ మేరకు పొందుపర్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ తీర్మానాన్ని పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదార్లకు రిలయన్స్ పంపించింది. కాగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి జీతం లేకుండా కంపెనీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోనే ఆయన పిల్లలు కూడా వేతనం లేకుండా పనిచేస్తుండటం గమనార్హం.
అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న ముకేశ్ సమీప బంధువులు నికిల్, హితల్ మాత్రం జీతంతో పాటు భత్యాలు, కమీషన్లు సహా ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు. మరోవైపు ముకేశ్ భార్య నీతా అంబానీ 2014లో కంపెనీ బోర్డు డైరెక్టరుగా నియమితులైన సమయంలో ఉన్న నియామక షరతులే ఆకాశ్, అనంత్, ఈశాలకూ వర్తించనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నీతా బోర్డు సమావేశాలకు హాజరైనందుకు సిట్టింగ్ రుసుం కింద రూ.6 లక్షలు, కమీషన్ రూపంలో రూ.2 కోట్లు పొందినట్లు రిలయన్స్ వార్షిక నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2020-21లో ఆమెకు సిట్టింగ్ రుసుం రూ.8 లక్షలు కాగా.. రూ.1.65 కోట్ల కమీషన్ లభించింది. కాగా.. తన ముగ్గురు పిల్లలను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో డైరెక్టర్లుగా చేయనున్నట్లు ఇటీవల జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజీఎం) ముకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను మరో ఐదేళ్ల పాటు కంపెనీ ఛైర్మన్, సీఈఓగా కొనసాగనున్నట్లు కూడా ఆయన ఆ సమయంలో తెలిపారు. వారసత్వ ప్రణాళికలో భాగంగా రిలయన్స్ బోర్డు డైరెక్టరుగా నీతా రాజీనామా చేశారు. అయితే బోర్డు సమావేశాలన్నింటికీ హాజరయ్యేలా ఆమెకు ‘శాశ్వత ఆహ్వానితురాలు’ హోదాను కల్పించారు.
కొత్త పదవీకాలంలోనూ సున్నా వేతనమే..
- ముకేశ్ అంబానీ 1977లో రిలయన్స్లో బోర్డు డైరెక్టరుగా అడుగుపెట్టారు. 2002లో తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణం అనంతరం.. ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు అంటే 11 ఏళ్ల పాటు తన వార్షిక పారితోషికాన్ని రూ.15 కోట్లకే ముకేశ్ పరిమితం చేసుకున్నారు.
- 2020-21లో కొవిడ్-19 పరిణామాల ప్రభావం దృష్ట్యా తన కంపెనీ, వ్యాపారాలు తిరిగి పూర్తి సామర్థ్యంలో ఆదాయాలు ఆర్జించేంతవరకు వేతనం తీసుకోకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2020-21 నుంచి వరుసగా మూడేళ్లుగా ఆయన ఎలాంటి వేతనాన్ని, లాభాలపై కమిషన్ను పొందడం లేదు.
- ముకేశ్ వినతి మేరకు ఆయన కొత్త పదవీకాలమైన 2024 ఏప్రిల్ 19 నుంచి 2029 ఏప్రిల్ 18 వరకు కూడా ఎటువంటి వేతనం, కమిషన్ చెల్లించకూడదని బోర్డు సిఫారసు చేసింది.
- 2022-23 వార్షిక నివేదిక ప్రకారం.. నిఖిల్, హితల్ పారితోషికం రూ.25 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.17.28 కోట్ల కమిషన్ కూడా కలిపి ఉంది. గత ఆర్థిక సంవత్సరం కూడా ఇంతే కమిషన్ను ఆయన పొందారు.
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్.ప్రసాద్ పారితోషికం రూపేణా (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కలిపి) రూ.13.50 కోట్లు అందుకున్నారు. 2021-22లో పొందిన రూ.11.89 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు కపిల్ పారితోషికం కూడా రూ.4.22 కోట్ల నుంచి రూ.4.40 కోట్లకు పెరిగింది. ఈయన ఐదేళ్ల పదవీకాలం 2023 మే 15తో ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆయన బోర్డు డైరెక్టరు పదవీ నుంచి వైదొలిగారు.
- 2023 జనవరిలో రిలయన్స్ బోర్డు డైరెక్టరుగా నియమితులైన కె.వి.కామత్కు రూ.3 లక్షల సిట్టింగ్ రుసుం, రూ.39 లక్షల కమిషన్ను చెల్లించారు.
- నీతా అంబానీతో పాటు బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా దీపక్ సి జైన్, రఘునాధ్ ఏ మషేల్కర్, అడిల్ జైనుల్భాయ్, రమిందర్ సింగ్ గుజ్రాల్, షుమీత్ బెనర్జీ, ఎస్బీఐ మాజీ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య, మాజీ సీవీసీ అయిన కేవీ చౌదరీ, సౌదీ దేశ వెల్త్ ఫండ్ నామినీ యాసిర్ ఓథ్మన్ హెచ్ అల్ రుమాయన్ ఉన్నారు. స్వత్రంత్ర డైరెక్టర్లందరికీ కమిషన్, సిట్టింగ్ రుసుము కింద రూ.2 కోట్లు చెల్లించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock Market: ఆర్బీఐ ఎఫెక్ట్.. తొలిసారి 21,000 మార్క్ అందుకున్న నిఫ్టీ!
Stock Market Closing bell: సెన్సెక్స్ 303.91 పాయింట్లు పుంజుకొని 69,825.60 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 68.25 పాయింట్లు లాభపడి 20,969.40 వద్ద ముగిసింది. -
Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
Tata group- iphone: టాటా గ్రూప్ మరో అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి లభించనుంది. -
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
UPI payments: ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెల్లడించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. మరోవైపు యూపీఐ, ఆటో డెబిట్ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Year End Sale: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ తేదీలను ప్రకటించింది. పెద్ద ఎత్తున క్యాష్బ్యాక్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ సేల్ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. -
India Shelter Finance IPO: 13న ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493
India Shelter Finance IPO: రూ.1,200 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభం కానుంది. -
Onion Exports: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..
Onion Exports: దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు వీటి ఎగుమతులపై నిషేధం విధించింది. -
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
RBI: ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. -
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell | ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 69,716 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 20,967 దగ్గర ట్రేడవుతోంది. -
ఐటీ సెజ్ల్లో స్థలాలకు గిరాకీ
ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్ హోదాను రద్దు చేసే అధికారం అంతర్ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
సంస్థల్లో నియామకాలు 12% తగ్గాయ్
వేర్వేరు రంగాల కార్యాలయాల్లో నైపుణ్యంతో కూడిన (వైట్-కాలర్) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్స్పీక్ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా, ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది. -
2025కు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు: ఇక్రా
దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి 170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ - కార్పొరేట్ రేటింగ్స్ వి.విక్రమ్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది. -
ఏడు రోజుల జోరుకు విరామం
సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. -
వివో కేసులో తొలి ఛార్జిషీట్ దాఖలు
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, తొలి ఛార్జిషీట్ను ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది. -
దూసుకెళ్తున్న ఈవీలు
విద్యుత్ వాహనాల (ఈవీల) అమ్మకాలు రాణిస్తున్నాయి. విద్యుత్తు విభాగంలో ప్రయాణికులు- వాణిజ్య వాహనాలు కలిపి నవంబరులో 1,52,606 యూనిట్లు అమ్ముడైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం వెల్లడించింది. -
1 నుంచి హ్యుందాయ్ ధరల పెంపు
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎమ్ఐఎల్), జనవరి 1 నుంచి ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరిగిన ముడి పదార్థాల ధరలు, ప్రతికూల మారకపు రేటు, అధిక కమొడిటీ ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
స్టార్బక్స్కు రూ.91,500 కోట్ల నష్టం
సియాటెల్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్బక్స్ కార్పొరేషన్ ఆదాయంపై, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం వేగంగా కనిపించింది. విక్రయాలు తగ్గడంతో, సుమారు 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91,500 కోట్ల) మేర విలువను కంపెనీ నష్టపోయింది. -
పంచదార ధరల అదుపునకు చర్యలు
దేశంలో పెరుగుతున్న చక్కెర ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసం వినియోగించకుండా నిషేధం విధిస్తూ, చక్కెర మిల్లులు, డిస్టిలరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశీయ అవసరాలకు తగినంత చక్కెరను అందుబాటులో ఉంచడంతో పాటు, ధరలు అదుపులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటా విక్రయం
ఐడీఎఫ్సీ బ్యాంక్లో అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్బర్గ్ పింకస్ 1.3 శాతం వాటాను రూ.790.18 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ విక్రయం జరిగింది. ఈ వార్తలతో బీఎస్ఈలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేరు 3.02 శాతం నష్టపోయి రూ.87.69 వద్ద ముగిసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్లో మంత్రి తెలిపారు. -
భారత్ 8% వృద్ధి సాధిస్తుంది
మన ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బెర్రీ పేర్కొన్నారు. కార్మిక శక్తి బలంగా ఉండటంతో పాటు ప్రజాస్వామ పరంగా సంస్థాగత అనుభవం ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర భారతదేశం అంతగా రాణించడం లేదని, సార్వభౌమ వ్యవస్థలో ఇది ఉద్రిక్తతలను సృష్టించొచ్చని అన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: ఆర్బీఐ ఎఫెక్ట్.. తొలిసారి 21,000 మార్క్ అందుకున్న నిఫ్టీ!
-
Allu Arjun: యానిమల్ మైండ్ బ్లోయింగ్ మూవీ.. మెచ్చుకున్న అల్లు అర్జున్
-
Lok Sabha: మరో ఇద్దరు భాజపా ఎంపీల రాజీనామాలు ఆమోదం
-
Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
-
PM Modi: ‘వెడ్ ఇన్ ఇండియా’ను మీరే ప్రారంభించాలి.. సంపన్న కుటుంబాలకు ప్రధాని మోదీ సూచన
-
David Warner: మిచెల్కు కౌంటర్.. నా తల్లిదండ్రుల గొప్ప పెంపకంలో ఎదిగా: వార్నర్