Mukesh Ambani: దేశీయ కుబేరుడు అంబానీ
దేశంలోని కుబేరుల్లో ముకేశ్ అంబానీ (66) అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ సంపద విలువ తగ్గిపోగా, అంబానీ సంపద విలువ పెరగడమే ఇందుకు కారణం.
2% వృద్ధితో రూ.8.08 లక్షల కోట్లకు సంపద
అదానీ సంపదలో 57% క్షీణత
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023
ముంబయి: దేశంలోని కుబేరుల్లో ముకేశ్ అంబానీ(Mukesh Ambani) (66) అగ్రస్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ సంపద విలువ తగ్గిపోగా, అంబానీ సంపద విలువ పెరగడమే ఇందుకు కారణం. ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా, దేశంలోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది ఈ జాబితాలో చోటు సంపాదించారు. మంగళవారం విడుదల చేసిన ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ ప్రకారం..
- రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద 2 శాతం వృద్ధి చెంది రూ.8.08 లక్షల కోట్లకు చేరుకుంది.
- అదే సమయంలో అదానీ సంపద 57% క్షీణించి రూ.4.74 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో ఆయన రెండో స్థానానికి పరిమితమయ్యారు. అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ నివేదిక ఫలితంగా, అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ పడిపోవడం ఇందుకు కారణమని హురున్ ఎండీ, ముఖ్య పరిశోధకుడు అనాస్ రెహ్మాన్ జునైద్ పేర్కొన్నారు.
- సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) అధిపతి సైరస్ పూనావాలా సంపద విలువ 36% పెరిగింది. ఆయన ఈ జాబితాలో మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్నాడార్ కూడా సంపదను 23% పెంచుకుని నాలుగో స్థానంలో కొనసాగారు.
- అగ్రగామి-10లోని గోపీచంద్ హిందూజా, దిలీప్ సంఘ్వి, ఎల్ఎన్ మిత్తల్, కుమార మంగళం బిర్లా, నీరజ్ బజాజ్లు తమ స్థానాలను మెరుగుపరచుకోగలిగారు.
- డిమార్ట్ అధినేత దమానీ మాత్రం తన సంపదలో 18% క్షీణత కారణంగా మూడు స్థానాలు కోల్పోయి ఎనిమిదో స్థానంలో నిలిచారు.
- జోహోకు చెందిన రాధా వెంబు ఈ జాబితాలో స్వయం కృషితో ఎదిగిన భారతీయ మహిళల్లో అగ్రస్థానాన్ని దక్కించుకోగలిగారు. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ను అధిగమించారు.
- జెప్టోకు చెందిన కైవల్య వోహ్రా జాబితాలో అత్యంత పిన్నవయస్కుడి(20)గా నిలిచారు.
- 94 ఏళ్ల మహేంద్ర రాఠీలాల్ మెహతా(ప్రెసిషన్ వైర్స్ ఇండియా) జాబితాలో తొలిసారిగా చేరారు.
- ప్రతీ మూడు వారాలకు ఇద్దరు కొత్త బిలియనీర్లను భారత్ జత చేసుకుంది. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లున్నారు. 12 ఏళ్ల కిందటితో పోలిస్తే 4.4 రెట్లు పెరిగారు.
- గతేడాదితో పోలిస్తే 51 మంది తమ సంపదను రెట్టింపు చేసుకున్నారు.
- 328 మంది బిలియనీర్లతో ముంబయి నగరం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ(199), బెంగళూరు(100) నిలిచాయి. జాబితాలో ఎక్కువ మందితో టాప్-20లోకెక్కిన నగరాల్లో తొలిసారిగా తిరుప్పూర్ చేరింది.
- కేదారా క్యాపిటల్కు చెందిన పరిశ్రమ దిగ్గజం మనీశ్ కేజ్రివాల్(రూ.3000 కోట్లు) ప్రైవేటు ఈక్విటీ(పీఈ) రంగం నుంచి కుబేరుల జాబితాలో అడుగుపెట్టిన తొలి వ్యక్తి అయ్యారు.
తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి హురున్ జాబితాలో 105 మంది చోటు దక్కించుకున్నారు. ఇందులో అయిదుగురు మహిళలు కాగా, మొత్తం 105 మంది సంపద విలువ రూ.5.25 లక్షల కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 33% పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్ మురళి రూ.55,700 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్ నుంచి అయిదుగురు ఈ జాబితాకెక్కారు. తెలుగు రాష్ట్రాల నుంచి జాబితాకెక్కిన వారిలో 83 శాతం మంది హైదరాబాద్లో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నారని హురున్ తెలిపింది. 105 మందిలో 87 మంది హైదరాబాద్కు చెందిన వారే. ఈ రెండు రాష్ట్రాల నుంచి కొత్తగా 33 మంది ఈ జాబితాలోకి వచ్చారు. వీరి ద్వారా మొత్తం రూ.76000 కోట్లు జతయ్యాయి. జాబితాలో అత్యంత సంపద గల మహిళగా మహిమా దాట్ల (రూ.5700 కోట్లు) నిలిచారు. ఫార్మా రంగం నుంచి మొత్తం 33 మంది ఉన్నారు.
తొలిసారిగా జాబితాలోకి..
టాప్-20లోని మనోజ్ నంబూరు, ప్రవీణ్ కుమార్లతో పాటు జి రవీంద్ర రావు, కుటుంబం(యశోదా హెల్త్కేర్ సర్వీసెస్-రూ.5400 కోట్లు), ఎన్ విశ్వేశ్వర రెడ్డి, కుటుంబం(షిర్డి సాయి ఎలక్ట్రికల్స్-రూ.4,600 కోట్లు), సజ్జ కిశోర్ బాబు, కుటుంబం(పవర్ మెక్ ప్రాజెక్ట్స్-రూ.4300 కోట్లు) కూడా తెలుగు రాష్ట్రాల నుంచి జాబితాలో తొలిసారిగా చోటు దక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!