చాట్జీపీటీ సృష్టికర్త తొలగింపు
టెక్ ప్రపంచంలో ‘చాట్ జీపీటీ’ సృష్టించిన ప్రకంపనలు తెలిసిందే. అయితే దానిని రూపొందించిన శామ్ ఆల్ట్మన్ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ సంస్థ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వెంటనే ఓపెన్ఏఐ సహ-వ్యవస్థాపకుడి రాజీనామా
అమెరికా: టెక్ ప్రపంచంలో ‘చాట్ జీపీటీ’ సృష్టించిన ప్రకంపనలు తెలిసిందే. అయితే దానిని రూపొందించిన శామ్ ఆల్ట్మన్ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ సంస్థ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మైక్రోసాఫ్ట్ ఆర్థిక మద్దతు గల ఓపెన్ఏఐ సంస్థ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ సీఈఓగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఆల్ట్మన్ తొలగింపు నిర్ణయం టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. మరో వైపు, ఆల్ట్మన్ను బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే కంపెనీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్మన్ తన పదవికి రాజీనామా చేశారు. శామ్ ఆల్టమన్ను తొలగించిన కారణంగానే గ్రెగ్ తన పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘గత ఎనిమిదేళ్ల నుంచి మేమంతా కలిసి సృష్టించిన అద్భుతాల పట్ల నేను గర్వంగా ఉన్నా. మేము ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొన్నాం. గొప్ప క్షణాలను ఆస్వాదించాం. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేశాం. కానీ, ఈ రోజు చూసిన వార్తతో (శామ్ తొలగింపును ఉద్దేశిస్తూ) నేను కంపెనీని వీడాలని నిర్ణయించుకున్నా’ అని గ్రెగ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు.
ఆల్ట్మన్ ఉద్వాసనకు కారణమేంటి?
- బోర్డుతో విషయాలేవీ పంచుకోవడం లేదని, తాము తీసుకునే నిర్ణయాలను ఆల్ట్మన్ అడ్డుకుంటున్నాడన్నది బోర్డు ఆరోపణ. కానీ, ఆల్టమన్ తొలగింపునకు వేరే కారణాలున్నాయంటున్నాయి టెక్ వర్గాలు.
- 2015లో ఓపెన్ ఏఐని నెలకొల్పినప్పుడు దీన్నొక లాభాపేక్షలేని సంస్థగా తీర్చిదిద్దాలని వ్యవస్థాపకులు అనుకున్నారు. ఆల్ట్మన్తో పాటు సుత్సేవర్, ఎలాన్ మస్క్, పలువురు వ్యవస్థాపకులుగా ఉన్నారు. మానవాళికి సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐని అందించాలని అనుకున్నారు.
- అయితే, 2019లో ఆల్ట్మన్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారింది. కంపెనీ ఆశయాలకు గండికొడుతూ ఓపెన్ ఏఐని లాభాదాయకమైన ఓ వ్యాపారంగా మార్చాలని అనుకున్నాడు. ఏఐ వల్ల కలిగే దుష్పభ్రావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆల్ట్మన్ దూకుడుగా ముందుకెళ్లడమూ మరో కారణమని సిలికాన్ వ్యాలీ వర్గాలు పేర్కొంటున్నాయి.
- చాట్జీపీటీ, ఇతర సర్వీసులకు సంబంధించిన భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా అతడు ముందుకెళ్లేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల సొంత జీపీటీలను డెవలప్ చేసుకునేలా కొన్ని ప్లగ్ ఇన్లను చాట్జీపీటీలో ఓఎన్ఏఐ తీసుకొచ్చింది. దీంతో వెబ్సైట్కు యూజర్లు పోటెత్తడంతో కొన్ని గంటల పాటు చాట్జీపీటీ నిలిచిపోయింది.
- ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన కంపెనీ చీఫ్ సైంటిస్ట్ సుత్సేవర్కు, ఆల్టమన్ మధ్య విభేదాలు సైతం మరో కారణమని చెప్పుకొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..