రోజంతా ఒడుదొడుకులే
మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో గురువారం స్టాక్మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి.
స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు
మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో గురువారం స్టాక్మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొని, చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్లో భారీ ప్రకటనలు లేకపోవడంతో, సూచీల ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ముఖ్యంగా యంత్ర పరికరాలు, లోహ, స్థిరాస్తి షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. మార్చిలో వడ్డీ రేట్ల కోతలు ఉండకపోవచ్చని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 6 పైసలు పెరిగి 82.98 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
బడ్జెట్ ప్రసంగానికి ముందు
సెన్సెక్స్ ఉదయం 71,998.78 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం కొంత తడబడినా, బడ్జెట్ మీద సానుకూల అంచనాలతో లాభాల్లోకి వచ్చింది. బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 72,151.02 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరింది.
ప్రసంగం అనంతరం
బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక.. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 71,574.89 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 106.81 పాయింట్ల నష్టంతో 71,645.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.25 పాయింట్లు తగ్గి 21,697.45 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 21,658.75- 21,832.95 పాయింట్ల మధ్య కదలాడింది.
- 20 షేర్లకు నష్టాలు: సెన్సెక్స్ 30 షేర్లలో 20 నష్టపోయాయి. అల్ట్రాటెక్ 2.42%, ఎల్ అండ్ టీ 2.38%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2.03%, టైటన్ 1.93%, బజాజ్ ఫైనాన్స్ 1.75%, భారతీ ఎయిర్టెల్ 1.70%, టెక్ మహీంద్రా 1.61%, నెస్లే 1.47%, విప్రో 1.39%, ఏషియన్ పెయింట్స్ 0.99% డీలాపడ్డాయి. మారుతీ 4.40%, పవర్గ్రిడ్ 2.49%, యాక్సిస్ బ్యాంక్ 1.56%, ఎన్టీపీసీ 1.32%, ఎస్బీఐ 1.12% రాణించాయి. రంగాల వారీ సూచీల్లో టెలికాం 1.55%, యంత్ర పరికరాలు 1.12%, స్థిరాస్తి 1.05%, లోహ 0.99%, కమొడిటీస్ 0.91%, పరిశ్రమలు 0.91% పెరిగాయి. ఇంధన, ఎఫ్ఎమ్సీజీ, ఆర్థిక సేవలు, యుటిలిటీస్, సేవలు నీరసపడ్డాయి. బీఎస్ఈలో 2081 షేర్లు నష్టపోగా, 1774 షేర్లు రాణించాయి. 88 షేర్లలో ఎటువంటి మార్పులేదు.
- రూఫ్ టాప్ సోలార్ పథకం కింద కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించడంతో.. కేపీఐ గ్రీన్ ఎనర్జీ 9.48%, వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్ 4.99%, స్టెర్లింగ్ అండ్ విల్సన్ 1.07% చొప్పున లాభాలు నమోదుచేశాయి.
- వచ్చే అయిదేళ్లలో గ్రామీణ పేదలకు 2 కోట్లకు పైగా ఇళ్లను నిర్మిస్తామన్న ప్రకటన నేపథ్యంలో.. ప్రభుత్వరంగ హడ్కో షేరు 19.99 శాతం దూసుకెళ్లి అప్పర్ సర్క్యూట్ తాకి రూ.206.80 వద్ద ముగిసింది. ఎన్బీసీసీ 12.01% లాభంతో రూ.145 దగ్గర స్థిరపడింది.
- బడ్జెట్ ప్రకటనల నేపథ్యంలో విద్యుత్తు వాహనాల తయారీ కంపెనీల షేర్లు మెరిశాయి. జేబీఎం ఆటో 2.48%, గ్రీవ్స్ కాటన్ 0.95% లాభపడ్డాయి. ఒలెక్ట్రా గ్రీన్టెక్ షేరు ఇంట్రాడేలో రూ.1,849.25 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకినా, చివరకు 0.69% నష్టంతో రూ.1729 వద్ద స్థిరపడింది.
- రైల్వేలపై బడ్జెట్ ప్రతిపాదనలతో తొలుత ఆ కంపెనీల షేర్లు లాభపడినా, చివరకు నష్టపోయాయి. రైల్టెల్ 3.84%, ఇర్కాన్ 3.69%, ఆర్వీఎన్ఎల్ 3.49%, ఐఆర్ఎఫ్సీ 2.85%, జూపిటర్ వ్యాగన్స్ 1.93%, ఐఆర్సీటీసీ 1.57%, టెక్స్మాకో రైల్ 0.82%, టిటాగఢ్ రైల్ 0.55% మేర నష్టపోయాయి.
- బీఎల్ఎస్ ఇ-సర్వీసెస్ ఐపీఓకు చివరిరోజు ముగిసేసరికి 162.48 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1,37,02,904 షేర్లను ఆఫర్ చేస్తుండగా, 2,22,63,80,472 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్ఐఐల నుంచి 300.14 రెట్లు, రిటైల్ మదుపర్ల నుంచి 237 రెట్లు, క్యూఐబీ విభాగంలో 123.30 రెట్ల చొప్పున స్పందన నమోదైంది.
నేటి బోర్డు సమావేశాలు: టాటా మోటార్స్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, టొరెంట్ ఫార్మా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, మెడ్ప్లస్, కావేరీ సీడ్ కంపెనీ, ఎంఓఐఎల్, దాల్మియా భారత్ షుగర్, ధనలక్ష్మీ బ్యాంక్, ఎన్ఐఐటీ, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
బ్యాంక్ ఆఫ్ బరోడాపై గతంలో విధించిన ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేసింది. బ్యాంక్ ఈవిషయాన్ని వెల్లడించింది. -
యాపిల్ నుంచి ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, పెన్సిల్.. ధర, విశేషాలు ఇవీ..
Apple Let Loose Event 2024: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ లెట్ లూజ్ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో, యాపిల్ పెన్సిల్ ప్రోలను ఆవిష్కరించింది. -
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 45 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ పూర్తి ఫ్లాట్గా ముగిసింది. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఏమేం యాడ్ చేయొచ్చు?
Google Wallet: టికెట్లు, పాసులు, ఐడీలను భద్రపర్చుకునేందుకు వీలుగా గూగుల్ డిజిటల్ వాలెట్ను భారత్లో విడుదల చేసింది. -
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు (Air India Express) చెందిన పలు విమానాలు రద్దుకావడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
AI ఫీచర్లు, 64MP కెమెరాతో గూగుల్ పిక్సెల్ 8ఏ.. ధర, ఫీచర్లివే
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8ఏ ఫోన్ 64ఎంపీ కెమెరా సహా అత్యాధునిక ఏఐ ఫీచర్లతో భారత్లో విడుదలైంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 80కి పైగా విమానాల రద్దు
Air India Express: దాదాపు 300 మంది క్యాబిన్ క్రూ అనారోగ్య కారణంతో సెలవు పెట్టినట్లు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. దీంతో దాదాపు 80కి పైగా సర్వీసులు రద్దయ్యాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 267 పాయింట్ల నష్టంతో 73,244 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు కుంగి 22,276 దగ్గర కొనసాగుతోంది. -
టాటా సెమీ కండక్టర్ చిప్ల ఎగుమతి!
మన దేశం నుంచి సెమీ కండక్టర్ చిప్సెట్ల ప్రయోగాత్మక ఎగుమతి ప్రారంభమైంది. చిప్సెట్ల కోసం దిగుమతులపైనే ఆధారపడిన మన దేశానికి ఇది ఎంతో ప్రోత్సాహకర అంశమే. -
మెట్రో నగరాల్లో ఖాళీగా షాపింగ్ మాల్స్!
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో, స్టాల్స్ స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. -
డాక్టర్ రెడ్డీస్కు రూ.1,307 కోట్ల లాభం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. -
యాపిల్ కొత్త ఐప్యాడ్ ఎయిర్
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐప్యాడ్ ఎయిర్ను మంగళవారం జరిగిన ‘లెట్ లూజ్’ కార్యక్రమంలో ఆవిష్కరించింది. -
అయిదేళ్ల కనిష్ఠానికి పొదుపు
దేశంలో కుటుంబాల నికర పొదుపు గణనీయంగా తగ్గుతోంది. 2020-21తో పోలిస్తే, 2022-23 ఆర్థిక సంవత్సరం చివరకు కుటుంబాల నికర పొదుపు రూ.9 లక్షల కోట్లు తగ్గి రూ.14.16 లక్షల కోట్లకు పరిమితమైంది. -
3 రోజులు.. రూ.11 లక్షల కోట్ల నష్టం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి పెద్ద షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో మంగళవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
ట్రేడింగ్ సమయం పొడిగింపు లేనట్లే
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) సమర్పించిన ప్రతిపాదనను కేపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. -
పోర్షే రూ.1.69 కోట్ల కారు
పోర్షే సరికొత్త పనమేరాను, అత్యంత ఆకర్షణీయ ఫీచర్లతో ఆవిష్కరించింది. దీని ధర(ఎక్స్ షోరూం) రూ.1,69,62,000. -
వైద్య పరికరాల దిగుమతులు తగ్గాలి
వైద్య పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ (ఔషధ) విభాగ కార్యదర్శి అరుణీష్ చావ్లా వెల్లడించారు. -
హ్యాపియెస్ట్ మైండ్స్ డివిడెండ్ 163%
ఐటీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.71.98 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.351 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
దేశంలో ఘోస్ట్ షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లు, పెద్ద పెద్ద షాపింగ్మాల్స్కు మారడమే ఇందుకు కారణం.
తాజా వార్తలు (Latest News)
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ