Paytm: పేటీఎం బ్యాంక్పై ఆంక్షలను సమీక్షించట్లేదు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై విధించిన ఆంక్షల మీద, పునఃసమీక్ష జరుపుతున్నామంటూ వస్తున్న ఊహాగానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొట్టిపారేసింది.
సమగ్ర మదింపు తర్వాతే విధించాం: ఆర్బీఐ
దిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై విధించిన ఆంక్షల మీద, పునఃసమీక్ష జరుపుతున్నామంటూ వస్తున్న ఊహాగానాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొట్టిపారేసింది. సమగ్ర పరిశీలన అనంతరమే పీపీబీఎల్పై ఆంక్షలు విధించామని స్పష్టం చేసింది. ఈనెల 29 తరవాత డిపాజిట్ల స్వీకరణ, వినియోగదార్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లలో టాప్అప్లను ఆపేయాలంటూ పీపీబీఎల్కు జనవరి 31న ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ‘పీపీబీఎల్ మీద విధించిన ఆంక్షలపై ఎటువంటి సమీక్ష చేయట్లేదు. మా నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తామేమోననే భావనలో ఎవరైనా ఉంటే.. అలాంటిదేమీ ఉండదని మాత్రం కచ్చితంగా చెబుతున్నాన’ని ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ల 606వ సమావేశానంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ నియంత్రణలోని ఏ సంస్థపైనా అయినా.. పూర్తి మదింపు అనంతరమే నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. ఫిన్టెక్ రంగ వృద్ధికి ఆర్బీఐ సహకారం ఎప్పటికీ ఉంటుందని పునరుద్ఘాటిస్తూ.. వినియోగదార్ల ప్రయోజనాల పరిరక్షణ, ఆర్థిక సుస్థిరతకు ఆర్బీఐ కట్టుబడి ఉంటుందని వివరించారు. పేటీఎం (Paytm) వ్యవహారంలో వినియోగదార్లు, డిపాజిటర్ల సందేహాలను నివృత్తి చేసే నిమిత్తం ఈ వారంలోనే ఎఫ్ఏక్యూలను (సందేహాలు- సమాధానాలు) ఆర్బీఐ విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
డైరెక్టరు రాజీనామా నిజమే
పీపీబీఎల్లో స్వతంత్ర డైరెక్టరు రాజీనామా చేశారని కంపెనీ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఫిబ్రవరి 1న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుంచి మంజూ అగర్వాల్ రాజీనామా చేశారని ఎక్స్ఛేంజీలకు తెలిపింది.
రూ.2,000 కోట్లు వాడుతుందా?
2021 నవంబరులో తొలి పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.2,000 కోట్లను చిన్న కంపెనీల కొనుగోలు, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడుల కోసం పేటీఎం పక్కకుపెట్టింది. 2023 డిసెంబరు 31 వరకు చూస్తే.. ఈ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా పేటీఎం ఖర్చు పెట్టలేదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలతో ఏర్పడిన సంక్షోభ స్థితి నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడు ఈ నిధులను పేటీఎం వాడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆర్బీఐ ఆంక్షలు విధించిన వెంటనే.. ఇ-కామర్స్, పేమెంట్స్, ఆన్లైన్ మార్కెటింగ్ విభాగాల్లో సంస్థల కొనుగోలుకు ఉన్న అవకాశాలను అన్వేషించే బాధ్యతలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులకు పేటీఎం అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇ కామర్స్ సంస్థ బిట్సిలా కొనుగోలు నిమిత్తం పేటీఎం చర్చలు జరుపుతోందనీ తెలిపింది. కీలకమైన చెల్లింపుల వ్యాపారాన్ని కాపాడుకునేందుకు పేటీఎం రానున్న రోజుల్లో ఇలాంటి కొనుగోళ్లు మరిన్ని చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. తమ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామనే సానుకూల సంకేతాన్ని ఈ కొనుగోళ్ల ద్వారా మార్కెట్కు ఇవ్వాలన్నది పేటీఎం ఉద్దేశంగా చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా మరింత భారం
పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. -
కేకేఆర్ చేతికి హెల్తియమ్ మెడ్టెక్
సర్జికల్ సూదుల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు సంస్థ హెల్తియమ్ మెడ్టెక్లో మెజార్టీ వాటాను, అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ రూ.7,000 కోట్ల (840 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుందని తెలిసింది. -
సైబర్ దాడులు.. మనపై ఎక్కువే
అమెరికా, బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ‘ఫిషింగ్’ దాడులను అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమే. భారత దేశంపై జరిగిన సైబర్ దాడుల్లో 33% టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది. -
ప్రయాణ - పర్యాటకంలో 5.82 కోట్ల ఉద్యోగాలు!
దేశీయంగా పర్యాటకానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆ రంగంతో పాటు ప్రయాణ రంగంలోనూ ఉపాధికి భారీ అవకాశాలు కలగనున్నాయి. -
ఎయిరిండియా క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితి తగ్గింపు
దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజీ ఉచిత పరిమితిని ఈనెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిరిండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజీగా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. -
కోటక్ బ్యాంక్ లాభం రూ.5,302 కోట్లు
ప్రైవేటు రంగ కోటక్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.5,302 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 25% అధికం. -
రెండేళ్లలో మళ్లీ చిన్న కార్ల హవా
దేశీయ విపణిలో చిన్న కార్ల విభాగం 2026 చివరికల్లా లేదా 2027 నాటికి పుంజుకునే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా అంచనా వేస్తోంది. -
రూ.15,000 కోట్ల రుణాల కోసం వొడాఫోన్ ఐడియా యత్నాలు!
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకులతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచీ రూ.15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్ల) రుణాలు తీసుకునేందుకు వొడాఫోన్ ఐడియా చర్చలు సాగిస్తోందని సమాచారం. -
మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే బెంగ
అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సంఘం ఫియో అంచనా వేస్తోంది. -
పేటీఎం సీఓఓ భవీశ్ గుప్తా రాజీనామా
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి (సీఓఓ) భవీశ్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కాంప్లియెన్సెస్ తదితర విభాగాలను భవీశ్ నడిపించేవారు. -
సంక్షిప్త వార్తలు
డీమార్ట్ సూపర్మార్కెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్, మార్చి త్రైమాసికంలో రూ.563 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.460 కోట్లతో పోలిస్తే, ఇది 22.39% అధికం. -
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
layoffs: ప్రపంచవ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20 వేల మందిని సాగనంపాయి.