యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి.
సీఎంఎస్ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు లాజిస్టిక్స్, సాంకేతిక సేవలను అందించే సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ‘అన్ఫోల్డింగ్ ఇండియాస్ కన్సంప్షన్ స్టోరీ’ పేరిట విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు రూ.1.43 కోట్లకు చేరాయి. 2022-23లో ఇది రూ.1.35 కోట్లుగా ఉంది. యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్నా, ప్రజలు నగదు రూపంలో ఖర్చు చేసేందుకు, నగదును అట్టేపెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారనేందుకు ఇది నిదర్శనమని సంస్థ పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన చూసినా, 2022-23 కంటే గత ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు 10 నెలల కాలంలో సగటున 7.23% కంటే అధికంగా ఉన్నాయి.
- మెట్రోల్లో నగదు ఉపసంహరణ సగటున 10.37% పెరిగింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 3.94%, నగరాల్లో 3.73% పెరిగాయి. దిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నగదు ఉపసంహరణలు అధికంగా జరిగాయి.
- ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు 49% మెట్రోల్లో, నగరాల్లో ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 51% ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలు 64% మెట్రోలు, నగరాల్లోనే ఉన్నాయి.
- నెలవారీగా చూస్తే కర్ణాటకలో అత్యధిక సగటు ఉపసంహరణ రూ.1.83 కోట్లు, దిల్లీలో 1.82 కోట్లు, పశ్చిమ బెంగాల్లో రూ.1.82 కోట్లుగా ఉన్నాయి.
వినోదం కోసం అధికంగా వెచ్చిస్తున్నారు: దేశ ప్రజలు మీడియా, వినోద ప్రసారాల వీక్షణకు అధికంగా ఖర్చు చేస్తున్నారని సీఎంఎస్ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో మీడియా, వినోద రంగం 29.3% వృద్ధి చెందింది. వినోద రంగంలో గత రెండేళ్ల కాలంలో సగటు వ్యయం 100% పెరిగిందని వెల్లడించింది. ఓటీటీలకు చెల్లింపులతో పాటు థియేటర్లకూ అధికులు తరలి వెళ్తుండటంతోనే, వ్యయంలో ఇంతటి వృద్ధి నమోదైందని పేర్కొంది.
- విలాసవంత వస్తువుల కొనుగోలు కోసమూ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆహారం, దుస్తులు, ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలకు మించి ఇతర వాటిపై దృష్టి సారిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఎఫ్ఎంసీజీ రంగంలో 16.76% వృద్ధి కనిపించింది. 2022-23లో ఇది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు పెరిగినదాన్ని చూస్తే ఈ రంగం కోలుకున్నట్లు చెప్పొచ్చు.
- గత ఆర్థిక సంవత్సరంలో విమానయాన రంగంలో సగటు వ్యయం 6.36% పెరిగింది. రైల్వే ప్రయాణాల్లో 8.16% వార్షిక వృద్ధి నమోదైంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో విమానయాన రంగం సగటున 27.42%, రైల్వే ప్రయాణాల్లో 56.35% చొప్పున వృద్ధి కనిపించింది.
- ఇ-కామర్స్ రంగంలో 2022-23లో 25.44% క్షీణత కనిపించింది. 2023-24లో ఈ క్షీణత 14.61 శాతంగా నమోదయ్యింది. గతంతో పోలిస్తే వృద్ధి రేటు కాస్త పెరిగినప్పటికీ, భారతీయుల కొనుగోలు పద్ధతుల్లో మార్పు కనిపిస్తోందని చెప్పొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిని అధికులు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రెండు, మూడో అంచె పట్టణాల వారు ఇదే విధానంలో ఇకామర్స్ కొనుగోళ్లు జరుపుతున్నారని నివేదిక తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం.. -
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సలహా అందించారు. -
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే