యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి.
సీఎంఎస్ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు లాజిస్టిక్స్, సాంకేతిక సేవలను అందించే సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ‘అన్ఫోల్డింగ్ ఇండియాస్ కన్సంప్షన్ స్టోరీ’ పేరిట విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు రూ.1.43 కోట్లకు చేరాయి. 2022-23లో ఇది రూ.1.35 కోట్లుగా ఉంది. యూపీఐ ద్వారా చెల్లింపులు జరుపుతున్నా, ప్రజలు నగదు రూపంలో ఖర్చు చేసేందుకు, నగదును అట్టేపెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారనేందుకు ఇది నిదర్శనమని సంస్థ పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన చూసినా, 2022-23 కంటే గత ఆర్థిక సంవత్సరంలో నగదు ఉపసంహరణలు 10 నెలల కాలంలో సగటున 7.23% కంటే అధికంగా ఉన్నాయి.
- మెట్రోల్లో నగదు ఉపసంహరణ సగటున 10.37% పెరిగింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 3.94%, నగరాల్లో 3.73% పెరిగాయి. దిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో నగదు ఉపసంహరణలు అధికంగా జరిగాయి.
- ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు 49% మెట్రోల్లో, నగరాల్లో ఉన్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 51% ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలు 64% మెట్రోలు, నగరాల్లోనే ఉన్నాయి.
- నెలవారీగా చూస్తే కర్ణాటకలో అత్యధిక సగటు ఉపసంహరణ రూ.1.83 కోట్లు, దిల్లీలో 1.82 కోట్లు, పశ్చిమ బెంగాల్లో రూ.1.82 కోట్లుగా ఉన్నాయి.
వినోదం కోసం అధికంగా వెచ్చిస్తున్నారు: దేశ ప్రజలు మీడియా, వినోద ప్రసారాల వీక్షణకు అధికంగా ఖర్చు చేస్తున్నారని సీఎంఎస్ నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో మీడియా, వినోద రంగం 29.3% వృద్ధి చెందింది. వినోద రంగంలో గత రెండేళ్ల కాలంలో సగటు వ్యయం 100% పెరిగిందని వెల్లడించింది. ఓటీటీలకు చెల్లింపులతో పాటు థియేటర్లకూ అధికులు తరలి వెళ్తుండటంతోనే, వ్యయంలో ఇంతటి వృద్ధి నమోదైందని పేర్కొంది.
- విలాసవంత వస్తువుల కొనుగోలు కోసమూ ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆహారం, దుస్తులు, ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలకు మించి ఇతర వాటిపై దృష్టి సారిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఎఫ్ఎంసీజీ రంగంలో 16.76% వృద్ధి కనిపించింది. 2022-23లో ఇది చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు పెరిగినదాన్ని చూస్తే ఈ రంగం కోలుకున్నట్లు చెప్పొచ్చు.
- గత ఆర్థిక సంవత్సరంలో విమానయాన రంగంలో సగటు వ్యయం 6.36% పెరిగింది. రైల్వే ప్రయాణాల్లో 8.16% వార్షిక వృద్ధి నమోదైంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో విమానయాన రంగం సగటున 27.42%, రైల్వే ప్రయాణాల్లో 56.35% చొప్పున వృద్ధి కనిపించింది.
- ఇ-కామర్స్ రంగంలో 2022-23లో 25.44% క్షీణత కనిపించింది. 2023-24లో ఈ క్షీణత 14.61 శాతంగా నమోదయ్యింది. గతంతో పోలిస్తే వృద్ధి రేటు కాస్త పెరిగినప్పటికీ, భారతీయుల కొనుగోలు పద్ధతుల్లో మార్పు కనిపిస్తోందని చెప్పొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిని అధికులు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రెండు, మూడో అంచె పట్టణాల వారు ఇదే విధానంలో ఇకామర్స్ కొనుగోళ్లు జరుపుతున్నారని నివేదిక తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
Stock market: స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
Moto Edge 50 Fusion: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో మోటో మరో కొత్త ఫోన్ను భారత్లో విడుదల చేసింది. -
₹15 వేల్లోపు ఐకూ కొత్త ఫోన్.. 3ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్
iQOO Z9x: ఐకూ మూడు వేరియంట్లతో కొత్త 5జీ ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి వెయ్యి రుపాయలు డిస్కౌంట్ అందించనుంది. -
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
Android 15: గూగుల్ I/O 2024 సదస్సులో గూగుల్ తమ ఆండ్రాయిడ్ 15 ఓఎస్ అప్డేట్లను ప్రకటించింది. బీటా 2 వెర్షన్ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. -
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
Blinkit: బ్లింకిట్లో ఇక కూరగాయలు కొంటే కొత్తిమీరను ఉచితంగా ఇస్తారట. ఓ తల్లి సూచనతో కంపెనీ సీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్ గోయల్ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. -
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 386 పాయింట్లు పుంజుకొని 73,373 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 22,310 దగ్గర కొనసాగుతోంది. -
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
-
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
12GB ర్యామ్తో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ధర, ఫీచర్లివే..!
-
తెలంగాణ ప్రజలకు ఊరట.. ఐదు రోజులపాటు వర్షం
-
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
-
విజయ్ దేవరకొండ చేయలేకపోయిన ఆ నాలుగు హిట్ మూవీలేంటో తెలుసా?