మీ రోజువారీ ఖర్చులు ఇంకా పెరుగుతాయ్
డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకూ పతనమై, బుధవారం 80.05 స్థాయికి చేరింది. రూపాయి క్షీణత ఇంకా కొనసాగుతుందని, డాలర్ విలువ రూ.85కు చేరే అవకాశం ఉందని కొన్ని బ్రోకరేజీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
డాలర్ విలువ రూ.80ని మించిన ప్రభావం
సెల్, టీవీలే కాదు.. రెడీమేడ్ దుస్తులూ భారమే
రూపాయి క్షీణత ఆపేందుకు రూ.8 లక్షల కోట్లు వెచ్చించడానికి ఆర్బీఐ సిద్ధం
ఈనాడు - హైదరాబాద్
డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకూ పతనమై, బుధవారం 80.05 స్థాయికి చేరింది. రూపాయి క్షీణత ఇంకా కొనసాగుతుందని, డాలర్ విలువ రూ.85కు చేరే అవకాశం ఉందని కొన్ని బ్రోకరేజీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
రూపాయి విలువ క్షీణత వల్ల మన రోజువారీ జీవితంపై తెలియకుండానే భారం పడుతోంది. ఎలా అంటే దిగుమతి చేసుకునే వస్తువులతో పాటు పెట్రోలియం ఆధారితంగా రూపొందే ఉత్పత్తుల ధరలు.. విదేశీ విద్యాభ్యాస ఖర్చులు పెరుగుతున్నాయి. కొన్ని పరిశీలిస్తే..
* విమాన టికెట్లు అయితే మండిపోతున్నాయి. ఇందుకు విమాన ఇంధన ధర ఒక కారణం. విదేశాలకు వెళ్లే మన విమానయాన సంస్థల టికెట్లు రూపాయల్లో ఉంటాయి. అదే బ్రిటిష్, అమెరికన్ ఎయిర్వేస్, ఎతిహాద్, కతార్ వంటివి డాలర్ నుంచి రూపాయల్లోకి మార్చి చూపుతుంటాయి. డాలర్ విలువ పెరిగే కొద్దీ ఇక్కడ నుంచి వెళ్లే వారికి భారమవుతోంది.
* విదేశీ పర్యటనల ఖర్చులు మరింత పెరిగిపోయాయి. మలేసియా ట్రిప్నకు గతంలో విమాన టికెట్లతో కలిపి రూ.35 వేలు అయ్యేది. ఇప్పుడు రూ.65 వేల వరకు అవుతోంది. థాయ్లాండ్ ప్రయాణం కూడా రూ.15 వేల నుంచి రూ.35 వేలకు చేరింది.
* ఎల్ఈడీ టీవీల్లో తెర సహా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల వంటివి; ఏసీల్లో కంప్రెషర్-ప్లాస్టిక్ భాగాలు, రిఫ్రిజరేటర్లో విడిభాగాలు కూడా దిగుమతి అయ్యేవే. అందువల్ల వీటి ధరలు 5 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.
* వస్త్రాల తయారీలో వినియోగించే డైస్, రంగులు, రసాయనాలు దిగుమతి అయ్యేవే. రెడీమేడ్ దుస్తుల్లో వాడే మెటల్ బటన్లు, లోగోలు, కొన్ని రకాల జిప్ల వంటివి విదేశాల నుంచే వస్తుంటాయి. అందువల్ల వీటి ధరలూ పైకెళ్లొచ్చు.
* విదేశీ విద్య అంటే అత్యధికులు వెళ్లేది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లకే. డాలర్ రూ.80, పౌండ్ రూ.96కు చేరడంతో ఫీజులు భారమవుతున్నాయి. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లేవారికి నెలవారీగా ఉపకార వేతనం లేదా పార్ట్టైమ్ ఉద్యోగం ద్వారా ఆర్జన ఉంటే సరే. లేకపోతే విద్యార్థికి అక్కడ నెలవారీ ఖర్చులు సగటున 700-1,000 డాలర్లు (రూ.56,000-80,000) అవుతాయి. జనవరిలో డాలర్ రూ.75. అప్పటితో పోల్చుకుంటే, నెలవారీ భారం రూ.3,500-5,000 పెరిగింది.
సెల్ఫోన్ తయారీలో వినియోగించే విడిభాగాల్లో 80 శాతం దిగుమతి అయ్యేవే. వీటికి డాలర్లలో చెల్లించాలి కనుక, వీటి ధరలు పెరగొచ్చు.
రూపాయి విలువ కాపాడేందుకు..
రూపాయి పతనాన్ని ఆపేందుకు, అవసరమైతే తన వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వల్లో ఆరోవంతు విక్రయించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చూస్తోందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు వార్తాసంస్థ రాయిటర్స్ పేర్కొంది. ప్రస్తుత నిల్వల్లో ఆరో వంతు అంటే దాదాపు 100 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8 లక్షల కోట్ల)కు సమానం. ఈ ఏడాదిలో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 7 శాతం నష్టపోయింది. 2021 సెప్టెంబరులో విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు జీవనకాల గరిష్ఠమైన 642.45 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఇప్పటికే 60 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. అయినప్పటికీ.. 580 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలతో ప్రపంచంలో అయిదో స్థానంలో భారత్ ఉంది. రూపాయిని ఒక స్థాయిలోనే ఉంచాలని ఆర్బీఐ భావించడం లేదని, అయితే భారీ పతనాన్ని మాత్రం ఆపుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు