ఆదాయపు పన్నురిఫండు రావాలంటే
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31 చివరి తేదీ. ఇప్పటికే రిటర్నులు సమర్పించిన వారికి ఆదాయపు పన్ను విభాగం రిఫండులనూ అందించింది.
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31 చివరి తేదీ. ఇప్పటికే రిటర్నులు సమర్పించిన వారికి ఆదాయపు పన్ను విభాగం రిఫండులనూ అందించింది. చాలామంది చెల్లించిన పన్ను మొత్తం రిఫండు రూపంలో అందుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం మోసపూరిత మినహాయింపులను క్లెయిం చేసుకుంటున్నారు. ఐటీ విభాగం ఇలాంటి వారిని అడ్డుకునేందుకు సరికొత్త సాంకేతికతలను వినియోగిస్తోంది. కానీ, కొన్నిసార్లు మనం చెల్లించాల్సిన పన్నుకు మించి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వాస్తవంగానే పన్ను రిఫండు అందుతుంది.
ఆర్జించిన ఆదాయం, ఇతర వివరాల ప్రకారం సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకొని, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. మీరు రిఫండు కోసం ప్రయత్నిస్తున్నట్లయితే.. ముందుగా ఫారం 26ఏఎస్తోపాటు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)ను ఒకసారి పరిశీలించండి. ఇందులో మీ ఆదాయ వివరాలతోపాటు, చెల్లించిన టీడీఎస్, టీసీఎస్లాంటి వివరాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు మీ దగ్గర వసూలు చేసిన పన్ను ఆదాయపు పన్ను శాఖకు జమ కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫారం 26ఏఎస్లో అది కనిపించదు.
పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్నప్పుడు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద రూ.12,500 వరకూ పన్ను రిబేటు లభిస్తుంది. చాలామంది ఫారం 26ఏఎస్లో ఇది కనిపించే అవకాశం ఉంటుంది.
* ఆదాయపు పన్ను రిటర్నులను గడువుకు ముందే దాఖలు చేయాలి. జులై 31 దాటితే అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుంది. తొందరగా దాఖలు చేసినప్పుడు ప్రాసెసింగ్ వేగంగా పూర్తయి, రిఫండు వచ్చే అవకాశం ఉంటుంది.
* కొత్త, పాత పన్నుల విధానం ప్రకారం పన్ను రిటర్నులను దాఖలు చేయొచ్చు. అవసరమైతే ఒకసారి పరిశీలించి, ఎందులో ఎక్కువ రిఫండు వస్తుందో చూసుకోండి. దాని ప్రకారం రిటర్నులు దాఖలు చేయొచ్చు. అన్ని సెక్షన్ల కిందా మినహాయింపులు క్లెయిం చేసుకోలేకపోయిన వారు, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ప్రయత్నం చేయొచ్చు.
* ఫారం-16లో లేని మినహాయింపులను మీరు క్లెయిం చేసుకోవాలంటే, దానికి తగిన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సెక్షన్ 80సీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ మీ పాన్, ఆధార్తో చేసిన కేవైసీతోనే ఉంటాయి. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియమూ మీ పాన్ ఆధారంగా సులభంగానే ఐటీ విభాగానికి తెలిసిపోతుంది.
అనుమతించిన మినహాయింపులను క్లెయిం చేసుకున్న తర్వాత వాస్తవంగా ఎంత రిఫండు వస్తుందో చూసుకోండి. అంతకు మించి తీసుకోవాలనే ప్రయత్నం కొన్నిసార్లు ఇబ్బందులను తెచ్చిపెడుతుందని మర్చిపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి. -
స్త్రీధన్ అంటే ఏంటి ?వివాహితలు తెలుసుకోవాల్సినవి
స్త్రీధన్ (ఆస్తి) అనేది మహిళ వివాహ సమయంలో తన తల్లిదండ్రులు, బంధువులు, వరుడు వైపు వారు, మొదలైన వారి నుంచి పొందే సంపద. దీనిపై హక్కులు ఎవరివి? -
ఆరోగ్య బీమా.. ఎంత ఉండాలి?
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు, బీమా తీసుకునే వ్యక్తి.. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని బీమా మొత్తాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి. -
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
Akshaya Tritiya 2024: అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే హాల్మార్కింగ్ను ఎలా చెక్ చేయాలో తెలుసా? -
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?