Higher Pension from EPFO: అధిక పింఛనుకు రవుర్కెలా పద్ధతే
ప్రైవేటు రంగంలో అధిక పింఛనుకు అర్హులైన వేతన జీవులకు దామాషా పద్ధతిలో పార్టు-1, పార్టు-2 విధానం కింద పింఛను లెక్కించి ఖరారు చేయాలని తాజాగా ఈపీఎఫ్వో నిర్ణయించింది.
రెండు పార్టులుగా లెక్కింపు
ప్రాంతీయ కార్యాలయాలకు సూచించిన ఈపీఎఫ్వో
ఆశావహుల అంచనాలపై దెబ్బ
ఈనాడు, హైదరాబాద్: ప్రైవేటు రంగంలో అధిక పింఛనుకు అర్హులైన వేతన జీవులకు దామాషా పద్ధతిలో పార్టు-1, పార్టు-2 విధానం కింద పింఛను లెక్కించి ఖరారు చేయాలని తాజాగా ఈపీఎఫ్వో నిర్ణయించింది. ఇది ఆశావహుల అంచనాలను బాగా దెబ్బతీసినట్లయింది. ఇటీవల దిల్లీలో జరిగిన ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ల సమావేశంలో రవుర్కెలా ప్రాంతీయ కార్యాలయం ఇచ్చిన డిమాండ్ నోటీసులో పేర్కొన్నట్లుగానే పార్టు-1, పార్టు-2 కింద పింఛను లెక్కించి ఇవ్వాలని ఆదేశించింది. రవుర్కెలా ఈ రకంగా డిమాండ్ నోటీసులు ఇస్తున్న విషయాన్ని పేర్కొంటూ ‘ఈనాడు’ గత నెలలో కథనం ఇచ్చింది. ఇప్పుడు అదే పద్ధతిని అంతా అనుసరించాలని... అధిక పింఛనుకు అర్హులైన వారికి పింఛను చెల్లింపు ఆర్డర్లు (పీపీవో) జారీ చేయాలని సూచించింది.
రవుర్కెలా ప్రాంతీయ కార్యాలయం ఏం చేస్తోందంటే...
1995 నవంబరు 16 నుంచి 2014 ఆగస్టు 31 వరకు చేసిన సర్వీసుకు చివరి ఏడాది వేతన సగటు తీసుకుని పార్ట్-1 కింద; 2014 సెప్టెంబరు 1 నుంచి పదవీ విరమణ చేసిన నాటివరకు చివరి ఐదేళ్ల వేతన సగటు తీసుకుని పార్ట్-2 కింద గణించి ఆ రెండింటినీ కలిపి తుది పింఛను ఖరారు చేస్తోంది.
2023 జూన్ 1 ఫార్ములాకు విరుద్ధం
అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై ఈపీఎఫ్వో 2023 జూన్ 1న స్పష్టత ఇచ్చింది. 2014 సెప్టెంబరు 1 నాటికి రిటైరైన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా లెక్కించాలని సూచించింది. 2014 సెప్టెంబరు 1 తరువాత పదవీ విరమణ చేసే వారికి చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా లెక్కించాలని తెలిపింది. తాజాగా రవుర్కెలా పద్ధతి అమలు చేయాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఈపీఎఫ్వో స్పష్టం చేయడంతో పింఛను మొత్తం తగ్గుతుంది.
డీడీలూ తీసుకోని వైనం
అధిక పింఛనుకు అర్హులైన వారు ఈపీఎస్కు చెల్లించాల్సిన మొత్తంపై ఈపీఎఫ్వో డిమాండ్ నోటీసులు జారీ చేస్తోంది. నోటీసుల్లో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్న వారికి ప్రాంతీయ కార్యాలయాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. డీడీలు తీసుకుని వస్తే తిరస్కరిస్తున్నాయి. ఆ మొత్తాన్ని వారు పనిచేస్తున్న యజమానికి ఇచ్చి యాజమాన్యం ద్వారా ఆన్లైన్లో చెల్లించాలని చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై యాజమాన్యాలూ ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇలా చెల్లింపులు చేస్తే ఆదాయపన్ను, ఇతర న్యాయసమస్యలు వస్తాయని పేర్కొంటున్నాయి.
ఇదీ నష్టం...!
ఉదాహరణకు ఒక ఉద్యోగి ఓ ప్రైవేటు సంస్థలో 2000 నుంచి 2023 వరకు 23 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ ఉద్యోగి చివరి ఐదేళ్ల వేతన సగటు (మూలవేతనం, డీఏ కలిపి) రూ.40,000గా ఉంది. అతనికి 2023 జూన్ 1 నాటి ఆదేశాల ప్రకారం నెలకు రూ.13,142 పింఛను రావాలి.
పార్టు-1, పార్టు-2గా విభజించి లెక్కిస్తే...
ఆ ఉద్యోగికి 2014 ఆగస్టు 31 నాటికి చివరి ఏడాది వేతన సగటు రూ.26 వేలు అనుకుందాం. అప్పుడు అతని సర్వీసు కాలం 14 ఏళ్లు. ఈ లెక్కన పార్టు-1 కింద పింఛను రూ.5,200 అవుతుంది. 2023 నాటికి మిగతా తొమ్మిదేళ్ల సర్వీసుకు ఐదేళ్ల వేతన సగటు తీసుకుంటే పార్టు-2 కింద పింఛను రూ.5,142 అవుతుంది. ఈ లెక్కన పార్టు-1, పార్టు-2 కలిపి తుది పింఛను రూ.10,342 అవుతుంది. అంటే దాదాపు రూ.3000 తగ్గుతుంది.
ఇదీ పింఛను లెక్కింపు ఫార్ములా = (వేతన సగటు x సర్వీసు)/70
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమాలో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి ఆరోగ్య బీమా సంస్థ తన పాలసీదారులకు నగదు రహిత చికిత్సనందించడానికి కొన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యాన్ని (టై-అప్) కలిగి ఉంటుంది. దీని వల్ల పాలసీదారులకు ప్రయోజనమేంటో ఇక్కడ తెలుసుకుందాం.. -
తీవ్ర వ్యాధుల చికిత్సకు ఆర్థిక భరోసా
అనారోగ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఓవైపు పెరుగుతున్న వైద్య చికిత్స ఖర్చులతో కేవలం ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటే ఉంటే సరిపోని రోజులివి. -
వేతనంలోఎంత పొదుపు చేయాలంటే
వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు చేస్తే.. భవిష్యత్ లక్ష్యాలను సాధించడం కష్టమవుతుంది. కాబట్టి, పొదుపు, పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఈ పత్రాలు ఇచ్చారా?
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? వీటిపై వచ్చే వడ్డీపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్) విధించకుండా ఫారం 15జీ / ఫారం15హెచ్ సమర్పించేందుకు సమయం ఇదే. -
ప్రభుత్వ సంస్థల్లో
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నిఫ్టీ పీఎస్ఈ ఈటీఎఫ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్) ఇండెక్స్ ఆధారంగా రూపొందించిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది. -
క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్బ్యాక్ ఎలా సంపాదించాలి?
క్యాష్బ్యాక్ క్రెడిట్ కార్డులు మీరు వస్తువులను కొనుగోలు చేయడానికి మీ కార్డు స్వైప్ చేసినప్పుడు కొంత డబ్బును తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
Section 54F: వారసత్వంగా వచ్చిన ఆభరణాలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని ఇల్లు కొనుగోలుకు వినియోగిస్తే.. మూలధన లాభాల పన్ను వర్తించదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 54ఎఫ్ చెబుతోంది. -
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!