షియామీ 14 అల్ట్రా @ రూ. 99,999

ఇప్పటివరకు అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్లను విక్రయించిన షియామీ, ఖరీదైన మోడళ్లను గురువారం ఆవిష్కరించింది. షియామీ 14ను రూ.59,999, షియామీ 14 అల్ట్రాను రూ.99,999 ధరకు విడుదల చేసింది.

Updated : 08 Mar 2024 07:31 IST

దిల్లీ: ఇప్పటివరకు అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్లను విక్రయించిన షియామీ, ఖరీదైన మోడళ్లను గురువారం ఆవిష్కరించింది. షియామీ 14ను రూ.59,999, షియామీ 14 అల్ట్రాను రూ.99,999 ధరకు విడుదల చేసింది. కృత్రిమ మేధ ఆధారిత ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌తో అనుసంధానం చేసిన స్మార్ట్‌ఫోన్లు ఇవని షియామీ ఇండియా ప్రెసిడెంట్‌ మురళీకృష్ణన్‌ బి తెలిపారు. జర్మనీకి చెందిన హైఎండ్‌ కెమేరాల సంస్థ లీకా రూపొందించిన 50 మెగాపిక్సెల్‌ క్వాడ్‌ కెమేరా, 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ మెమొరీ కలిగిన 14 అల్ట్రా పన్‌ అమ్మకాలు ఏప్రిల్‌ 12న ప్రారంభమవుతాయి. షియామీ 14 అమ్మకాలు ఈ నెల 11 నుంచి చేపడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని