- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
NPAs: 8 ఏళ్లలో రూ.8.6 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు
ఆర్బీఐ, ప్రభుత్వ చర్యల వల్లేనన్న కేంద్రం
దిల్లీ: ఆర్బీఐ, ప్రభుత్వం కలిసి తీసుకున్న పటిష్ఠ చర్యల వల్ల ప్రభుత్వం గత 8 ఆర్థిక సంవత్సరాల్లో రూ.8.6 లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలయ్యాయని కేంద్రం తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో సుదీర్ఘకాలంగా నిరర్ధక ఆస్తుల కింద వర్గీకరించిన బకాయిలను వసూలు చేసేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం ఎప్పటికప్పుడు బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపింది. ఈ మేరకు సోమవారం లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
దేశంలోని స్థూల ఆర్థిక అంశాలు, బ్యాంకింగ్ రంగంలోని పలు సమస్యలు, ప్రపంచ వ్యాపార రంగంలోని పరిస్థితులు, ఎన్పీఏలను గుర్తించడంలో జాప్యం, వేగవంతమైన రుణాల మంజూరు, రిస్క్ను అంచనా వేయలేకపోవడం.. వంటి అంశాలు నిరర్ధక ఆస్తులు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలని కరాడ్ తన సమాధానంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బకాయిల వసూలుకు ఇప్పటికే ఉన్న చట్టపరమైన వెసులుబాట్లతో పాటు కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు బకాయిల వసూలుకు దోహదం చేశాయని వివరించారు. ఫలితంగా గత ఎనిమిదేళ్లలో వాణిజ్య బ్యాంకులు రూ.8,60,369 కోట్ల మొండి బకాయిలను వసూలు చేశాయని పేర్కొన్నారు.
దివాలా స్మృతి అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో రుణ వాతావరణం మారిపోయిందని కరాడ్ తెలిపారు. మార్చి 2022 నాటికి ఈ చట్టం కింద 480 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఫలితంగా బ్యాంకులు రూ.2.34 లక్షల కోట్లు రికవరీ చేశాయన్నారు. మరోవైపు రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన మొత్తాన్ని దివాలాగా ప్రకటించిన సంస్థల వివరాల ప్రతివారం నివేదించేలా ఆర్బీఐ తీసుకొచ్చిన సీఆర్ఐఎల్సీ వ్యవస్థ సైతం మంచి ఫలితాలిచ్చిందని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Assam: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటాం.. సీఎం హిమంత ప్రకటన
-
India News
Indian Army: సియాచిన్లో తప్పిపోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత లభ్యమైన మృతదేహం
-
World News
Anita Bose: నేతాజీ అస్థికలు తెప్పించండి.. డీఎన్ఏ పరీక్షతో నిజం తేలుతుంది
-
Movies News
NTR 31: ‘ఎన్టీఆర్ 31’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. అదేంటంటే?
-
Sports News
T20 Cricket : టీ20ల్లో టాప్ స్కోరర్.. మళ్లీ రోహిత్ను అధిగమించిన కివీస్ ఓపెనర్
-
India News
Mukesh Ambani: ముకేశ్ అంబానీకి బెదిరింపులు.. రెండు గంటల్లో 8ఫోన్ కాల్స్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Flight: గర్ల్ఫ్రెండ్తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Indraja: నాకు అమ్మాయి పుట్టేదాకా.. పెళ్లి విషయం ఎవరికీ తెలియదు: ఇంద్రజ
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్ఛైర్లో ఝున్ఝున్వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Jio Phone 5G: జియో 5జీ ఫోన్.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ వివరాలివే!