GST reward: జీఎస్టీ రివార్డ్ స్కీమ్.. రూ.కోటి వరకు ప్రైజ్ మనీ
GST reward scheme: మీరు కొంటున్న వస్తువులకు బిల్లులు అడుగుతున్నారా?ఇకపై మర్చిపోకుండా ఇన్వాయిస్లు తీసుకోండి. ఎందుకంటే వాటితో మీరు రూ.కోటి వరకు ప్రైజ్మనీ గెల్చుకోవచ్చు. ఇందుకోసం కేంద్రం త్వరలోనే సరికొత్త పథకం తీసుకురాబోతోంది.
దిల్లీ: వస్తు, సేవల పన్ను (GST) ఎగవేతను నిరోధించేందుకు కేంద్రం వ్యాపారులకు పలు నిబంధనలను అమలు చేస్తోంది. ఈ ప్రక్రియలో ఇప్పుడు కస్టమర్లను కూడా భాగస్వాములను చేస్తోంది. త్వరలోనే ‘మేరా బిల్ మేరా అధికార్ (Mera Bill Mera Adhikar)’ పేరుతో సరికొత్త ఇన్వాయిస్ ప్రోత్సాహక పథకాన్ని (GST reward scheme) ప్రారంభించనుంది. ఈ రివార్డు స్కీమ్తో కస్టమర్లు రూ.10వేల నుంచి రూ.కోటి వరకు నగదు బహుమతి పొందొచ్చు. ఏంటీ కొత్త స్కీం..? ఎందుకోసం తీసుకొస్తున్నారు..?
కస్టమర్లు తాము కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు విక్రయదారుల నుంచి బిల్లు అడిగేలా వారిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతోంది. సెప్టెంబరు 1 నుంచి మూడు రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ స్కీమ్ను ప్రారంభించనున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) మంగళవారం వెల్లడించింది. కస్టమర్లు తాము కొనుగోలు చేసిన వస్తువుల జీఎస్టీ ఇన్వాయిస్ (Invoice)లను చూపించి రివార్డులు గెలుచుకోవచ్చని తెలిపింది.
కొత్త అవకాశాలు.. ఖాళీ పోస్టుల భర్తీ: నియామకాలు బాగుంటాయ్
ఈ రివార్డు స్కీం ఎలా ఉంటుందంటే..
- ఇందుకోసం ‘మేరా బిల్ మేరా అధికార్ (Mera Bill Mera Adhikar)’ పేరుతో మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
- కస్టమర్లు తాము కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించిన ఇన్వాయిస్లను ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- ఈ ఇన్వాయిస్ (Invoice)లపై విక్రేతల GSTIN నంబరు, ఇన్వాయిస్ నంబరు, చెల్లించిన మొత్తం, ట్యాక్స్ అమౌంట్ కచ్చితంగా ఉండాలి.
- కేవలం జీఎస్టీ నమోదిత సప్లయర్లు విక్రయించిన వస్తువులు, సేవలకు సంబంధించిన బిల్లులకు మాత్రమే ఈ రివార్డు వర్తిస్తుంది.
- ఈ స్కీమ్ కింద నెలా వారీ, లేదా మూడు నెలలకోసారి లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటిస్తారు. డ్రాలో గెలిచిన వారు రూ.10వేల నుంచి రూ.కోటి వరకు నగదు బహుమతి గెలుచుకునే అవకాశం ఉంటుందని CBIC ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించింది.
- కనీసం రూ.200 అంతకంటే ఎక్కువ మొత్తం వెచ్చించిన ఇన్వాయిస్లను లక్కీ డ్రాకు పరిగణిస్తారు. ఒక కస్టమర్ నెలకు గరిష్ఠంగా 25 ఇన్వాయిస్లను అప్లోడ్ చేసుకునే వీలుంటుంది.
- ఈ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులో ఉండనుంది.
- సెప్టెంబరు 1న అస్సాం, గుజరాత్, హరియాణా, పుదుచ్చేరీ, దమన్ దయ్యూ, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లో ఈ స్కీమ్ను ప్రారంభించనున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
వినియోగదారులు తాము కొన్న వస్తువులకు విక్రేతల నుంచి వాస్తవమైన ఇన్వాయిస్లను అడిగే విధంగా వారిని ప్రోత్సహించేలా ఈ రివార్డు స్కీమ్ను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా వ్యాపారులు పన్ను ఎగవేసేందుకు ఆస్కారం ఉండదని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.