GST: హాస్టల్ వసతికి 12% జీఎస్టీ: ఏఏఆర్
GST on Hostel accommodation:హాస్టల్ వసతికి 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ రెండు వేర్వేరు కేసుల్లో స్పష్టంచేసింది. దీంతో హాస్టల్లో నివాసం ఉండే వారికి భారం కానుంది.
దిల్లీ: హాస్టల్లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులకు హాస్టల్ వసతి భారం కావొచ్చు. హాస్టల్ ఫీజుకూ 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని జీఎస్టీ అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) బెంచ్లు రెండు వేర్వేరు కేసుల్లో తీర్పు వెలువరించడం ఇందుకు నేపథ్యం. హాస్టల్స్, డార్మిటరీలు నివాస గృహాల కిందకు రావని, కాబట్టి జీఎస్టీ నుంచి ఎలాంటి మినహాయింపూ ఉండదంటూ బెంగళూరు, లఖ్నవూ బెంచ్లు తాజాగా తీర్పులు వెలువరించాయి.
బెంగళూరుకు చెందిన శ్రీసాయి లగ్జరీయిస్ స్టే ఎల్ఎల్పీ సంస్థ చేసిన దరఖాస్తుపై బెంగళూరు బెంచ్ తాజాగా తీర్పు ఇచ్చింది. హాస్టళ్లు అనేవి నివాస గృహాలు కావని, వాటికీ జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టంచేసింది. హోటళ్లు, క్లబ్బులు, క్యాంప్సైట్ల వసతికి గానూ రోజుకు రూ.1000 లోగా అయితే జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని గుర్తు చేసింది. 2022 జులై 17 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది. పీజీ/ హాస్టళ్లకు ఇది వర్తించదని స్పష్టంచేసింది. నివాస గృహాన్ని నివాసానికి వినియోగించకుండా అద్దె కోసం వినియోగిస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించింది. ఇక్కడ దరఖస్తుదారుడి (శ్రీసాయి హాస్టల్) సేవలు జీఎస్టీ విధించదగినవి కాబట్టి భూ యజమానులకు చెల్లించే అద్దెపై రివర్స్ జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. కాబట్టి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఒకవేళ సొంత నివాసంలోనే హాస్టల్/ పీజీ సదుపాయం ఇస్తుంటే వాటిని గెస్ట్ హౌస్లు, లాడ్జింగ్ సర్వీసులుగానే పరిగణిస్తామని బెంచ్ పేర్కొంది.
పోకో నుంచి ఫస్ట్ ఇయర్బడ్స్.. రూ.1,199కే విక్రయం
నొయిడాకు చెందిన వీఎస్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్టల్ ప్రైవేట్ లిమిటెడ్ విషయంలో ఏఏఆర్ లఖ్నవూ బెంచ్ సైతం ఇదే తరహా తీర్పును వెలువరించింది. హాస్టల్ వసతికి రోజుకు రూ.1000 తక్కువ ఉన్నా జీఎస్టీ వర్తిస్తుందని పేర్కొంది. ఎక్కువగా విద్యార్థులు నివాసం ఉండే హాస్టళ్లు, డార్మిటరీలపై 12 శాతం జీఎస్టీ విధించడం వల్ల ఆయా కుటుంబాలపై ఎనలేని భారం పడుతుందని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ అన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒకవేళ ఏఏఆర్ బెంచ్లు ఇచ్చిన తీర్పులను ఇతర రాష్ట్రాలు అమలుపరిస్తే హాస్టల్ వసతి భారం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు