Cyber crimes: మీ ఖాతాలో డబ్బు ఖాళీ కాకుడాదంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
దేశంలో డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు చేసే వారి సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఆన్లైన్ ద్వారా ఉన్న చోట నుంచే చెల్లింపులు చేయగలుగుతున్నాం.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు చేసే వారి సంఖ్య ఘననీయంగా పెరిగింది. ఆన్లైన్ ద్వారా ఉన్న చోట నుంచే చెల్లింపులు చేయగలుగుతున్నాం. అలాగే షాపింగ్, చిరుతిళ్లు వంటి వాటి కోసం బయటకు వెళ్లిన ప్రతిసారీ పర్సులో నగదు ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కార్డు లేదా యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపులు చేయగలుగుతున్నాం. రోడ్డు పక్కన ఉండే చిన్న చిన్న వ్యాపారులు కూడా వారి దుకాణాల వద్ద క్యూఆర్ స్కానింగ్ను అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో ఇబ్బంది పడకుండా చెల్లింపులు చేసేస్తున్నాం. అలాగే బ్యాంకు ద్వారా చేయాల్సిన నగదు బదిలీలు, రుణ దరఖాస్తులు కూడా ఇంటి నుంచే చేయగలుగుతున్నాం. అయితే డిజిటల్ లావాదేవీలు ఏ విధంగా పెరిగాయో అదేవిధంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఇటువంటి మోసాల బారిన పడకండా సౌకర్యవంతంగా, సురక్షితంగా చెల్లింపులు చేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
బ్యాంకు ఖాతాలో డబ్బు ఖాళీ చేసేందుకు నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. బ్యాంకర్లు, బీమా ఏజెంట్లు, హెల్త్కేర్ లేదా టెలికాం ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ కస్టమర్లను మెసగాళ్లు ఆశ్రయిస్తున్నారు. అవసరమైన సేవలను అందిస్తామంటూ.. ఇ- కేవైసీ పేరుతో గోప్యంగా ఉండే ఆధారాలను ధ్రువీకరించాలని కోరుతున్నారు. కొన్ని సందర్భాల్లో, వెంటనే సమాచారాన్ని ధ్రువీకరించకపోతే బ్యాంకు ఖాతా రద్దవుతుందని వినియోగదారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాల్స్, మేసేజ్లు, ఈ-మెయిల్ ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, లాగిన్, కార్డు సమాచారం, పాస్వర్డ్లు, పిన్ నంబర్లు, ఓటీపీ వంటి వివరాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఇటువంటి కాల్స్ మేసెజ్లు, ఈ- మెయిల్ విషయంలో జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా వెరిఫై చేయని మొబైల్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ ఫోన్ మోసగాళ్ల అధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీంతో వారు మీ వ్యక్తిగత సమాచారాన్ని సులభంగా యాక్సిస్ చేయగలుగుతారు. అందువల్ల యాప్ల విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
ఆన్లైన్ లావాదేవీలు చేసే వారు ఇవి గుర్తుంచుకోవాలి..
పబ్లిక్ కంప్యూటర్లు / వై-ఫై నెట్వర్క్లను వాడకండి
ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, వంటి మోసపూరిత చర్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున పబ్లిక్ పరికరాలు, వై-ఫై నెట్వర్క్లను ఉపయోగించకుండా ఉండటం మంచిది. పేరున్న, ధ్రువీకరించిన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించడం కూడా ముఖ్యం. విశ్వసనీయ వెబ్సైట్లు తరచుగా ఆన్లైన్ చెల్లింపు లావాదేవీలకు అధిక స్థాయి రక్షణను అందిస్తాయి.
కొంతమంది అత్యవసర పరిస్థితులలో వేరే వాళ్ల కంప్యూటర్ ద్వారా, పబ్లిక్ వై-ఫై ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులలో సమాచారం దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు తొందరలో ఉన్నప్పటికీ, పబ్లిక్ వై-ఫై నెట్వర్క్ వాడిగానీ, పబ్లిక్ కంప్యూటర్ నుంచి గానీ నగదు రహిత లావాదేవీలు చేయకూడదు. అలాగే బిల్లు చెల్లింపులకు ముఖ్యంగా హోటళ్లు, విమానాశ్రయ లాంజ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు వంటి ప్రదేశాలలో బిల్లు చెల్లింపుల కోసం పబ్లిక్ వై-ఫైని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇలాంటి చోట బిల్లు చెల్లింపులకు మొబైల్ నెట్వర్క్నే ఉపయోగించాలి. ఇతర ఆర్థిక లావాదేవీల కోసం మీ వ్యక్తిగత కంప్యూటర్, వై-ఫైలను మాత్రమే వాడాలి.
మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతున్న యాప్స్ని గమనించండి..
కొన్ని యాప్లు మీ మొబైల్లో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ కావచ్చు. అటువంటి యాప్లను గమనించి అన్ఇన్స్టాల్ చేయండి. అలాగే, ఏదైనా యాప్ను మీ డివైజ్కి డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ చేసేముందు వాటిని నమ్మకమైన సంస్థలు రూపొందించినవా? లేదా? అని తెలుసుకోవాలి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్లకు కూడా చట్టబద్ధత ఉండాలి. యాప్ స్టోర్, ప్లే స్టోర్ వంటి వాటిలో కూడా చట్టవిరుద్ధమైన యాప్లు ఉండే అవకాశం ఉంది. అందువల్ల సమీక్షకులు ఇచ్చే రివ్యూలను పరిశీలించండి. తక్కువ సంఖ్యలో డౌన్లోడ్లు ఉన్న యాప్ల జోలికి పోకండి. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉందని ధ్రువీకరించుకున్న తర్వాత మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. యాప్లను ఇన్స్టాల్ చేసేటప్పుడు కెమెరా, ఫోన్బుక్, ఎస్సమ్మెస్ రీడ్ మొదలైన వాటికి అనుమతి నిరాకరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా లింక్ను క్లిక్ చేసే ముందు జాగ్రత్త
సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల కోసం అనుమానాస్పద యాప్లు, వెబ్సైట్లను నివారించాలి. ప్రైవేట్/వర్చువల్ బ్రౌజర్లను, HTTPS:// తో ప్రారంభమయ్యే సురక్షిత కనెక్షన్లను ఎంచుకుని మరింత భద్రంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా HTTP తో ప్రారంభమయ్యే సైట్లు జోలికి పోవద్దు. ఇవి సురక్షితం కాదు. HTTPS://లు, అనవసరమైన సైట్ ఓపెన్ కాకుండా, సమాచారం నిల్వ చేయకుండా నిరోధించి, సురక్షితమైన ఆన్లైన్ బ్యాంకింగ్ను అందించే విధంగా రూపొందించారు. లావాదేవీలు పూర్తైన అనంతరం వెబ్సైట్ నుంచి లాగవుట్ కావడం ఏ పరిస్థితులలోనూ మరవకూడదు.
ఈ విషయాలలోనూ జాగ్రత్త పడాలి
ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి బ్యాంక్ ఖాతా నంబర్, పాస్వర్డ్, ఏటీఎం పిన్, చిరునామా, క్రెడిట్ కార్డు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారం కోసం కాల్ చేస్తే వారికి సమాచారం ఇవ్వకూడదు. ఎందుకంటే బ్యాంకులు, లేదా ఇతర ఆర్థిక సంస్థలు ఇలాంటి సమాచారం కోసం కాల్ చేయవు. కాబట్టి అలాంటి కాల్స్కి సమాధానం ఇవ్వకూడదు. అలాగే ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ఆన్లైన్ ఖాతాలకు బలమైన పాస్వర్డ్లు ఇవ్వాలి. వీటిని తరచూ మారుస్తుండాలి. గూగుల్ ఆథన్టికేటర్/వన్-టైమ్-పాస్వర్డ్(ఓటీపీ) సేవలను ఉపయోగించుకోవడం ద్వారా మరింత భద్రంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.