IBM: వచ్చే ఐదేళ్లలో ఐబీఎంలో 7,800 ఉద్యోగాల స్థానంలో కృత్రిమ మేధ!
IBM: కృత్రిమ మేధ వినియోగానికి పెద్ద పీట వేసేందుకు ఐబీఎం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని కీలక విధుల్లో ఈ అత్యాధునిక సాంకేతికతను వాడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
వాషింగ్టన్: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI) వినియోగం రోజురోజుకీ విస్తరిస్తోంది. ఎక్కడ ఇది ఉద్యోగాల కోతకు దారితీస్తుందోనని ఓవైపు ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ అత్యాధునిక సాంకేతికతలో రోజురోజుకీ కొత్త మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో అనేక ఉద్యోగాల్లో ఏఐ (Artificial Intelligence) తిష్ఠ వేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం (IBM) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రానున్న ఐదేళ్లలో కంపెనీలోని చాలా ఉద్యోగాల స్థానంలో కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉపయోగించాలని ఐబీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆ మేరకు ఆయా విధుల్లోకి కొత్త ఉద్యోగులను తీసుకోవడం ఆపేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తగిన మార్పులు చేయాలని సంబంధిత ఉన్నతోద్యోగులకు కంపెనీ సీఈఓ అర్వింద్ కృష్ణ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్బెర్గ్ కథనం ప్రచురించింది.
అమెజాన్ సహా పలు దిగ్గజ కంపెనీలు ఇటీవల భారీ ఎత్తున మానవ వనరుల విభాగంలో ఉద్యోగులను తొలగించాయి. వారి స్థానంలో కృత్రిమ మేధ (Artificial Intelligence)ను ఉపయోగించుకుంటున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఆయా కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఇప్పటికే ఐబీఎం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జనవరిలో ప్రకటించింది. కొన్ని వ్యాపార విభాగాలను పూర్తిగా తొలగించేసింది.
దాదాపు 7,800 మంది ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించే అవకాశాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐబీఎం సీఈఓ చెప్పినట్లు బ్లూమ్బెర్గ్ తెలిపింది. అయితే, ఐబీఎం ఓవైపు ఉద్యోగులను తొలగిస్తూనే మరోవైపు నియామకాలను సైతం కొనసాగిస్తోంది. తొలి త్రైమాసికంలో దాదాపు 7000 మంది కొత్త వారిని కంపెనీలోకి ఆహ్వానించినట్లు సీఈఓ తెలిపారు.
మోర్గాన్ స్టాన్లీలో 3000 ఉద్యోగాల కోత!
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ మరోసారి ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఐదు శాతానికి సమానమైన 3,000 మందికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. ప్రస్తుత త్రైమాసికం పూర్తయ్యే నాటికి తొలగింపుల ప్రక్రియ పూర్తి కావొచ్చని వెల్లడించారు. అయితే, వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో పనిచేస్తున్న ఆర్థిక సలహాదారులు, వారికి సహాయంగా ఉన్న సిబ్బందిని మాత్రం తొలగించకపోవచ్చని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఎఫ్అండ్ఓపై ఎందుకింత మోజు..?
దేశంలో పొదుపు మొత్తాలు ఎఫ్అండ్ఓ (ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ట్రేడ్లోకి వెళ్తున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
ఐసీఐసీఐ మాజీ ఛైర్మన్ వాఘుల్ కన్నుమూత
ప్రభుత్వ రంగంలోని ఐసీసీఐని ప్రైవేటు సంస్థగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన నారాయణ్ వాఘుల్ (88) ఆరోగ్య సమస్యలతో శనివారం చెన్నైలోని ఒక ఆసుపత్రిలో మరణించారు. బ్యాంకింగ్ పరిశ్రమలో ఆయన ప్రస్థానం 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. -
ఓయో ఐపీఓ దరఖాస్తు ఉపసంహరణ!
తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని.. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్ అండ్ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. -
చైనా ఈవీలు, లోహాలపై దిగుమతి సుంకాల పెంపు
చైనాలో తయారయ్యే విద్యుత్ వాహనాలు (ఈవీ), అత్యాధునిక బ్యాటరీలు, సోలార్ సెల్స్, వైద్య సామగ్రితో పాటు అక్కడ నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై కొత్త టారిఫ్లు విధిస్తామని బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రత్యేక ట్రేడింగ్లో స్వల్ప లాభాలు
విదేశీ మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ప్రాథమిక సైట్లో వైఫల్యం తలెత్తినా ఎదుర్కొనేందుకు వాటి సంసిద్ధతను తనిఖీ చేయడానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను శనివారం రెండు దఫాలుగా నిర్వహించాయి. -
వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయ్
అనుకూల వ్యాపార విధానాలు, ప్రభుత్వ మద్దతు కారణంగా గత తొమ్మిదేళ్లలో వ్యవసాయ - అనుబంధ రంగాల్లో అంకురాల సంఖ్య దాదాపు 7,000కు పైగా పెరిగిందని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య (ఫైఫా) వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
దొడ్ల డెయిరీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.787.4 కోట్ల ఆదాయం, రూ.46.8 కోట్ల నికర లాభం, రూ.7.79 ఈపీఎస్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.724.3 కోట్లు, నికరలాభం రూ.22.5 కోట్లు, ఈపీఎస్ రూ.3.76 ఉన్నాయి. -
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం..